అన్వేషించండి

Revanth Reddy : కాళేశ్వరం నీళ్లతో ఏం పండించాలి, ధాన్యం కొనకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడిస్తాం - రేవంత్ రెడ్డి

రెండు లక్షల కోట్ల తెలంగాణ బడ్జెట్ లో రూ.10 వేల కోట్లు పెట్టి రైతుల పంటలను కొనలేరా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. యాసంగిలో ప్రతీ ధాన్యపు గింజను కొనాలని లేకుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టాడిస్తామని హెచ్చరించారు.

Revanth Reddy : రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి చివరి ధాన్యపు గింజ కొనే వరకూ కాంగ్రెస్‌(Congress) పోరాటం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(TPCC President Revanth Reddy) అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో "మన ఊరు- మన పోరు" బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుంటే రైతులతో కలిసి కేసీఆర్ ఫామ్‌ హౌస్‌(KCR Farm House)ను ముట్టడిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు రెండు సార్లు అధికారం ఇస్తే ఇనాళ్లు ఏంచేయకుండా ఇప్పుడు దిల్లీ వెళ్లి పోరాడతానని ఉపన్యాసాలు ఇస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్‌(Nizamabad) జిల్లాలో చెరకు ఫ్యాక్టరీలు తెరుస్తామని హామీలు ఇచ్చిన కవిత(Kavita) ఎంపీగా గెలిచాక ఆ విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్‌పేపర్‌పై రాసిచ్చిన బీజేపీ ఎంపీ అర్వింద్‌(MP Arvind) ఆ హామీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. పసుపు బోర్డు(Turmaric Board) రాక పసుపు రైతులు, గిట్టుబాటు ధర లేక జొన్న రైతులు, వరి వద్దన్నంటున్న కేసీఆర్‌ ప్రకటనలతో నిజామాబాద్‌ జిల్లా రైతాంగం తీవ్ర ఆవేదనలో ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 

పసుపు బోర్డు ఎక్కడ?

2 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న తెలంగాణలో 10 వేల కోట్లు పెట్టి రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేరా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రంపై నెపం నెట్టేందుకు మరోసారి దిల్లీకి బయలుదేరారని మండిపడ్డారు. వరి పండించిన రైతులను మోసం చేస్తే ఎల్లారెడ్డి నడిబజార్ లో ఉరితీస్తామని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా రైతులు పోరాటం చేసి ఆ చట్టాలను రద్దు చేసేవరకు పోరాడారన్నారు. అలాంటి పోరాటమే ఎల్లారెడ్డి రైతులు చేయాలన్నారు. కవిత ఎంపీగా పోటీ చేసిన సమయంలో వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నారు. కానీ 1500 రోజులు అయిన ఆ షుగర్ ఫ్యాక్టరీని తెరవలేదన్నారు. ఎంపీ అర్వింద్​ ఇలాగే పసుపు బోర్డు తెస్తానని మోసం చేశారన్నారు. 

ఎమ్మెల్యే సురేందర్ అమ్ముడుపోయారు 

కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానన్న కేసీఆర్(KCR).. ఆ నీళ్లతో ఏం పండించమంటారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతులు పండించిన పంటలను కొనమంటే రైతులు ఏమవ్వాలన్నారు. రాష్ట్రంలోని 7,500 ఐకేపీ కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేశారు. ప్రతి గింజను కొనాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో కాంగ్రెస్​ అత్యధిక మెజార్జీతో గెలుస్తుందని రేవంత్​ జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే సురేందర్‌ ను కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపిస్తే కేసీఆర్‌కు అమ్ముడుపోయారని విమర్శించారు. ఈ ప్రాంతంలో 'కల్లాల్లో కాంగ్రెస్‌' కార్యక్రమాన్ని పార్టీ నేతలు విజయవంతం చేశారని రేవంత్​ రెడ్డి అన్నారు. ఈ సభలో అజారుద్దీన్, అంజన్‌ కుమార్, మల్లురవి, ఎమ్మెల్యే సీతక్క, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ​తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
Pawan Kalyan - Surender Reddy Movie: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్... కొత్త సినిమా అనౌన్స్ చేశారోచ్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్... కొత్త సినిమా అనౌన్స్ చేశారోచ్
PM Modi: ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
Pawan Kalyan - Surender Reddy Movie: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్... కొత్త సినిమా అనౌన్స్ చేశారోచ్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్... కొత్త సినిమా అనౌన్స్ చేశారోచ్
PM Modi: ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు ఇవే!
ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు ఇవే!
2026 In India: ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
ఈ ఏడాది భారత్‌కు తిరుగుండదు ప్రపంచం చూపు అంతా మన వైపే -ఇవిగో కీలక ఈవెంట్లు
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
Youtuber Anvesh:పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!
పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!
Embed widget