అన్వేషించండి

Revanth Reddy : కాళేశ్వరం నీళ్లతో ఏం పండించాలి, ధాన్యం కొనకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడిస్తాం - రేవంత్ రెడ్డి

రెండు లక్షల కోట్ల తెలంగాణ బడ్జెట్ లో రూ.10 వేల కోట్లు పెట్టి రైతుల పంటలను కొనలేరా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. యాసంగిలో ప్రతీ ధాన్యపు గింజను కొనాలని లేకుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టాడిస్తామని హెచ్చరించారు.

Revanth Reddy : రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి చివరి ధాన్యపు గింజ కొనే వరకూ కాంగ్రెస్‌(Congress) పోరాటం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(TPCC President Revanth Reddy) అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో "మన ఊరు- మన పోరు" బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుంటే రైతులతో కలిసి కేసీఆర్ ఫామ్‌ హౌస్‌(KCR Farm House)ను ముట్టడిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు రెండు సార్లు అధికారం ఇస్తే ఇనాళ్లు ఏంచేయకుండా ఇప్పుడు దిల్లీ వెళ్లి పోరాడతానని ఉపన్యాసాలు ఇస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్‌(Nizamabad) జిల్లాలో చెరకు ఫ్యాక్టరీలు తెరుస్తామని హామీలు ఇచ్చిన కవిత(Kavita) ఎంపీగా గెలిచాక ఆ విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్‌పేపర్‌పై రాసిచ్చిన బీజేపీ ఎంపీ అర్వింద్‌(MP Arvind) ఆ హామీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. పసుపు బోర్డు(Turmaric Board) రాక పసుపు రైతులు, గిట్టుబాటు ధర లేక జొన్న రైతులు, వరి వద్దన్నంటున్న కేసీఆర్‌ ప్రకటనలతో నిజామాబాద్‌ జిల్లా రైతాంగం తీవ్ర ఆవేదనలో ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 

పసుపు బోర్డు ఎక్కడ?

2 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న తెలంగాణలో 10 వేల కోట్లు పెట్టి రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేరా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రంపై నెపం నెట్టేందుకు మరోసారి దిల్లీకి బయలుదేరారని మండిపడ్డారు. వరి పండించిన రైతులను మోసం చేస్తే ఎల్లారెడ్డి నడిబజార్ లో ఉరితీస్తామని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా రైతులు పోరాటం చేసి ఆ చట్టాలను రద్దు చేసేవరకు పోరాడారన్నారు. అలాంటి పోరాటమే ఎల్లారెడ్డి రైతులు చేయాలన్నారు. కవిత ఎంపీగా పోటీ చేసిన సమయంలో వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నారు. కానీ 1500 రోజులు అయిన ఆ షుగర్ ఫ్యాక్టరీని తెరవలేదన్నారు. ఎంపీ అర్వింద్​ ఇలాగే పసుపు బోర్డు తెస్తానని మోసం చేశారన్నారు. 

ఎమ్మెల్యే సురేందర్ అమ్ముడుపోయారు 

కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానన్న కేసీఆర్(KCR).. ఆ నీళ్లతో ఏం పండించమంటారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతులు పండించిన పంటలను కొనమంటే రైతులు ఏమవ్వాలన్నారు. రాష్ట్రంలోని 7,500 ఐకేపీ కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేశారు. ప్రతి గింజను కొనాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో కాంగ్రెస్​ అత్యధిక మెజార్జీతో గెలుస్తుందని రేవంత్​ జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే సురేందర్‌ ను కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపిస్తే కేసీఆర్‌కు అమ్ముడుపోయారని విమర్శించారు. ఈ ప్రాంతంలో 'కల్లాల్లో కాంగ్రెస్‌' కార్యక్రమాన్ని పార్టీ నేతలు విజయవంతం చేశారని రేవంత్​ రెడ్డి అన్నారు. ఈ సభలో అజారుద్దీన్, అంజన్‌ కుమార్, మల్లురవి, ఎమ్మెల్యే సీతక్క, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ​తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Embed widget