అన్వేషించండి

Rahul Gandhi : కేసీఆర్ కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టుల్లో మార్పులు - రాహుల్ గాంధీ

Rahul Gandhi : యూపీఏ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన భూములను కేసీఆర్ ప్రభుత్వం లాగేసుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగిసింది.  కామారెడ్డి జిల్లా  మేనూరు వద్ద నిర్వహించిన ముగింపు సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. భారత్‌ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగుతోందన్నారు.  10 రోజులుగా తెలంగాణలో జరిగిన యాత్ర  మహారాష్ట్రలో ప్రవేశిస్తుందన్నారు.  తెలంగాణలో కార్యకర్తలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్నానన్నారు.  తెలంగాణను వదిలి వెళ్లాలంటే చాలా బాధగా ఉందన్నారు.  కాంగ్రెస్ కార్యకర్తలు కష్టం మీడియాలో కనిపించవు.. టీవీలో రావు అన్నారు. పార్టీ కార్యకర్తల పనితీరును తానే స్వయంగా చూశానని రాహుల్ గాంధీ అన్నారు.   

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 

 కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో ప్రజలతో కలిసి ప్రయాణం చేశామని రాహుల్ గాంధీ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నామని అన్నారు. తెలంగాణ ప్రజలు కలలను టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. ఆదివాసీలు, గిరిజనుల కోసం యూపీఏ ప్రభుత్వం ఎంతో చేసిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని లాగేసుకున్నాయని ఆరోపించారు.  తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వస్తేనే ఎవరి భూములు వారికి దక్కుతాయని స్పష్టం చేశారు.  తెలంగాణలో ఒక్క రైతు కూడా సంతోషంగా ఉన్నానని తనతో చెప్పలేదన్నారు.  దేశంలో హింస, ద్వేషం ఎక్కువైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా తాను భారత్‌ జోడో యాత్రను ప్రారంభించానని తెలిపారు.  లక్షల మంది ప్రజలు యాత్రను కొనసాగించేందుకు కావాల్సిన శక్తి ఇచ్చారని రాహుల్ గాంధీ అన్నారు.  తెలంగాణలో తన పాదయాత్రను ఎప్పటికీ మర్చిపోనన్నారు. 

అధికారంలోకి రాగానే రుణమాఫీ 

" 72,000 కోట్ల రైతు రుణమాఫీని అప్పటి యూపీఏ ప్రభుత్వం చేసింది. అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తాం.  అన్ని పంటలకు MSP రేట్లు ఇస్తాం  రైతులకు ప్రయోజనం చేకూరుస్తాం.  కేసీఆర్ కమీషన్లు వచ్చేలా సాగునీటి ప్రాజెక్టులను మారుస్తూ రాత్రికి రాత్రే ధరణి పోర్టల్‌లో భూములు లాక్కోవాలని చూస్తున్నారు. టీఆర్‌ఎస్ కేవలం 5 శాతం ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.  రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో ఎవరికీ ఉపాధి లేదు. నేను లోక్‌సభలో చూశాను, రైతుల బిల్లుతో సహా మోదీ ప్రభుత్వం  అన్ని బిల్లులకు టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చింది. దేశంలోని ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నప్పుడు టీఆర్‌ఎస్ మోదీకి మద్దతు ఇచ్చింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే. వారి స్నేహితులు కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చడం కేసీఆర్ విధానం. సమాజంలోని కొన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని ప్రైవేటీకరించారు. ఇదే మోదీ కేసీఆర్  వైఖరి. GST  నోట్ల రద్దుతో మోదీ ప్రభుత్వం చిన్న పరిశ్రమలను నాశనం చేసింది తద్వారా ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. వారు ఉద్దేశపూర్వకంగా తమ విధానాలతో విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నారు. "- రాహుల్ గాంధీ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Psych Siddhartha OTT: సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Happy News Year 2026: 2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Embed widget