అన్వేషించండి

Rahul Gandhi : కేసీఆర్ కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టుల్లో మార్పులు - రాహుల్ గాంధీ

Rahul Gandhi : యూపీఏ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన భూములను కేసీఆర్ ప్రభుత్వం లాగేసుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగిసింది.  కామారెడ్డి జిల్లా  మేనూరు వద్ద నిర్వహించిన ముగింపు సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. భారత్‌ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగుతోందన్నారు.  10 రోజులుగా తెలంగాణలో జరిగిన యాత్ర  మహారాష్ట్రలో ప్రవేశిస్తుందన్నారు.  తెలంగాణలో కార్యకర్తలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్నానన్నారు.  తెలంగాణను వదిలి వెళ్లాలంటే చాలా బాధగా ఉందన్నారు.  కాంగ్రెస్ కార్యకర్తలు కష్టం మీడియాలో కనిపించవు.. టీవీలో రావు అన్నారు. పార్టీ కార్యకర్తల పనితీరును తానే స్వయంగా చూశానని రాహుల్ గాంధీ అన్నారు.   

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 

 కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో ప్రజలతో కలిసి ప్రయాణం చేశామని రాహుల్ గాంధీ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నామని అన్నారు. తెలంగాణ ప్రజలు కలలను టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. ఆదివాసీలు, గిరిజనుల కోసం యూపీఏ ప్రభుత్వం ఎంతో చేసిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని లాగేసుకున్నాయని ఆరోపించారు.  తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వస్తేనే ఎవరి భూములు వారికి దక్కుతాయని స్పష్టం చేశారు.  తెలంగాణలో ఒక్క రైతు కూడా సంతోషంగా ఉన్నానని తనతో చెప్పలేదన్నారు.  దేశంలో హింస, ద్వేషం ఎక్కువైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా తాను భారత్‌ జోడో యాత్రను ప్రారంభించానని తెలిపారు.  లక్షల మంది ప్రజలు యాత్రను కొనసాగించేందుకు కావాల్సిన శక్తి ఇచ్చారని రాహుల్ గాంధీ అన్నారు.  తెలంగాణలో తన పాదయాత్రను ఎప్పటికీ మర్చిపోనన్నారు. 

అధికారంలోకి రాగానే రుణమాఫీ 

" 72,000 కోట్ల రైతు రుణమాఫీని అప్పటి యూపీఏ ప్రభుత్వం చేసింది. అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తాం.  అన్ని పంటలకు MSP రేట్లు ఇస్తాం  రైతులకు ప్రయోజనం చేకూరుస్తాం.  కేసీఆర్ కమీషన్లు వచ్చేలా సాగునీటి ప్రాజెక్టులను మారుస్తూ రాత్రికి రాత్రే ధరణి పోర్టల్‌లో భూములు లాక్కోవాలని చూస్తున్నారు. టీఆర్‌ఎస్ కేవలం 5 శాతం ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.  రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో ఎవరికీ ఉపాధి లేదు. నేను లోక్‌సభలో చూశాను, రైతుల బిల్లుతో సహా మోదీ ప్రభుత్వం  అన్ని బిల్లులకు టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చింది. దేశంలోని ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నప్పుడు టీఆర్‌ఎస్ మోదీకి మద్దతు ఇచ్చింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే. వారి స్నేహితులు కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చడం కేసీఆర్ విధానం. సమాజంలోని కొన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని ప్రైవేటీకరించారు. ఇదే మోదీ కేసీఆర్  వైఖరి. GST  నోట్ల రద్దుతో మోదీ ప్రభుత్వం చిన్న పరిశ్రమలను నాశనం చేసింది తద్వారా ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. వారు ఉద్దేశపూర్వకంగా తమ విధానాలతో విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నారు. "- రాహుల్ గాంధీ 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR on HCU Lands: హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి స్పందించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి స్పందించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
PM Modi AP Tour: అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
India Bans Pakistans YouTube: మరోసారి భారత్ కన్నెర్ర, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
మరోసారి భారత్ కన్నెర్ర, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
Nani: మహాభారతంలో నాని ఫిక్స్... కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
మహాభారతంలో నాని ఫిక్స్... కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG Captian Rishabh Pant Failures in IPL 2025 | ఆగని రిషభ్ పంత్ ఫెయిల్యూర్స్...ఓనర్ తో మళ్లీ క్లాస్Rishabh Pant Failures IPL 2025 | ఆగని రిషభ్ పంత్ ఫెయిల్యూర్స్...ఓనర్ తో మళ్లీ క్లాస్RCB 6 Away Matches Wins in Row | IPL 2025 లో సరికొత్త చరిత్రను సృష్టించి ఆర్సీబీKrunal Pandya 73 runs vs DC IPL 2025 | కుప్పకూలిపోతున్న RCB ని కొహ్లీ తో కలిసి నిలబెట్టేసిన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR on HCU Lands: హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి స్పందించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి స్పందించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
PM Modi AP Tour: అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
India Bans Pakistans YouTube: మరోసారి భారత్ కన్నెర్ర, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
మరోసారి భారత్ కన్నెర్ర, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
Nani: మహాభారతంలో నాని ఫిక్స్... కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
మహాభారతంలో నాని ఫిక్స్... కన్ఫర్మ్ చేసిన రాజమౌళి
Telangana Politics: డేట్ ఫిక్స్ చెయ్, నీ బచ్చాగాళ్లు వద్దు, అసెంబ్లీలో చర్చకు నువ్వే రావాలి- కేసీఆర్‌కు మంత్రులు ఛాలెంజ్
డేట్ ఫిక్స్ చెయ్, నీ బచ్చాగాళ్లు వద్దు, అసెంబ్లీలో చర్చకు నువ్వే రావాలి- కేసీఆర్‌కు మంత్రులు ఛాలెంజ్
Upcoming Telugu Movies: క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి హారర్ కామెడీ వరకూ.. - ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్ అంతే..
క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి హారర్ కామెడీ వరకూ.. - ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్ అంతే..
KCR On Fire: తులం బంగారం ఏమైంది! పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నారా?  కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ప్రశ్నల వర్షం
తులం బంగారం ఏమైంది! పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నారా? కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ప్రశ్నల వర్షం
Dragon Movie like Scam: డ్రాగన్ మూవీకి ముందే తెలంగాణ ఇంజినీర్ ట్రై చేశాడు- కానీ ఆపరేషన్ ఫెయిల్, కేసులు నమోదు
డ్రాగన్ మూవీకి ముందే తెలంగాణ ఇంజినీర్ ట్రై చేశాడు- కానీ ఆపరేషన్ ఫెయిల్, కేసులు నమోదు
Embed widget