అన్వేషించండి

Rahul Gandhi : కేసీఆర్ కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టుల్లో మార్పులు - రాహుల్ గాంధీ

Rahul Gandhi : యూపీఏ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన భూములను కేసీఆర్ ప్రభుత్వం లాగేసుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగిసింది.  కామారెడ్డి జిల్లా  మేనూరు వద్ద నిర్వహించిన ముగింపు సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. భారత్‌ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగుతోందన్నారు.  10 రోజులుగా తెలంగాణలో జరిగిన యాత్ర  మహారాష్ట్రలో ప్రవేశిస్తుందన్నారు.  తెలంగాణలో కార్యకర్తలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్నానన్నారు.  తెలంగాణను వదిలి వెళ్లాలంటే చాలా బాధగా ఉందన్నారు.  కాంగ్రెస్ కార్యకర్తలు కష్టం మీడియాలో కనిపించవు.. టీవీలో రావు అన్నారు. పార్టీ కార్యకర్తల పనితీరును తానే స్వయంగా చూశానని రాహుల్ గాంధీ అన్నారు.   

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 

 కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో ప్రజలతో కలిసి ప్రయాణం చేశామని రాహుల్ గాంధీ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నామని అన్నారు. తెలంగాణ ప్రజలు కలలను టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. ఆదివాసీలు, గిరిజనుల కోసం యూపీఏ ప్రభుత్వం ఎంతో చేసిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని లాగేసుకున్నాయని ఆరోపించారు.  తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వస్తేనే ఎవరి భూములు వారికి దక్కుతాయని స్పష్టం చేశారు.  తెలంగాణలో ఒక్క రైతు కూడా సంతోషంగా ఉన్నానని తనతో చెప్పలేదన్నారు.  దేశంలో హింస, ద్వేషం ఎక్కువైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా తాను భారత్‌ జోడో యాత్రను ప్రారంభించానని తెలిపారు.  లక్షల మంది ప్రజలు యాత్రను కొనసాగించేందుకు కావాల్సిన శక్తి ఇచ్చారని రాహుల్ గాంధీ అన్నారు.  తెలంగాణలో తన పాదయాత్రను ఎప్పటికీ మర్చిపోనన్నారు. 

అధికారంలోకి రాగానే రుణమాఫీ 

" 72,000 కోట్ల రైతు రుణమాఫీని అప్పటి యూపీఏ ప్రభుత్వం చేసింది. అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తాం.  అన్ని పంటలకు MSP రేట్లు ఇస్తాం  రైతులకు ప్రయోజనం చేకూరుస్తాం.  కేసీఆర్ కమీషన్లు వచ్చేలా సాగునీటి ప్రాజెక్టులను మారుస్తూ రాత్రికి రాత్రే ధరణి పోర్టల్‌లో భూములు లాక్కోవాలని చూస్తున్నారు. టీఆర్‌ఎస్ కేవలం 5 శాతం ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.  రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో ఎవరికీ ఉపాధి లేదు. నేను లోక్‌సభలో చూశాను, రైతుల బిల్లుతో సహా మోదీ ప్రభుత్వం  అన్ని బిల్లులకు టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చింది. దేశంలోని ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నప్పుడు టీఆర్‌ఎస్ మోదీకి మద్దతు ఇచ్చింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే. వారి స్నేహితులు కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చడం కేసీఆర్ విధానం. సమాజంలోని కొన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని ప్రైవేటీకరించారు. ఇదే మోదీ కేసీఆర్  వైఖరి. GST  నోట్ల రద్దుతో మోదీ ప్రభుత్వం చిన్న పరిశ్రమలను నాశనం చేసింది తద్వారా ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. వారు ఉద్దేశపూర్వకంగా తమ విధానాలతో విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నారు. "- రాహుల్ గాంధీ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget