అన్వేషించండి

Rahul Gandhi : కేసీఆర్ కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టుల్లో మార్పులు - రాహుల్ గాంధీ

Rahul Gandhi : యూపీఏ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన భూములను కేసీఆర్ ప్రభుత్వం లాగేసుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగిసింది.  కామారెడ్డి జిల్లా  మేనూరు వద్ద నిర్వహించిన ముగింపు సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. భారత్‌ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగుతోందన్నారు.  10 రోజులుగా తెలంగాణలో జరిగిన యాత్ర  మహారాష్ట్రలో ప్రవేశిస్తుందన్నారు.  తెలంగాణలో కార్యకర్తలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్నానన్నారు.  తెలంగాణను వదిలి వెళ్లాలంటే చాలా బాధగా ఉందన్నారు.  కాంగ్రెస్ కార్యకర్తలు కష్టం మీడియాలో కనిపించవు.. టీవీలో రావు అన్నారు. పార్టీ కార్యకర్తల పనితీరును తానే స్వయంగా చూశానని రాహుల్ గాంధీ అన్నారు.   

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 

 కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో ప్రజలతో కలిసి ప్రయాణం చేశామని రాహుల్ గాంధీ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నామని అన్నారు. తెలంగాణ ప్రజలు కలలను టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. ఆదివాసీలు, గిరిజనుల కోసం యూపీఏ ప్రభుత్వం ఎంతో చేసిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని లాగేసుకున్నాయని ఆరోపించారు.  తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వస్తేనే ఎవరి భూములు వారికి దక్కుతాయని స్పష్టం చేశారు.  తెలంగాణలో ఒక్క రైతు కూడా సంతోషంగా ఉన్నానని తనతో చెప్పలేదన్నారు.  దేశంలో హింస, ద్వేషం ఎక్కువైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా తాను భారత్‌ జోడో యాత్రను ప్రారంభించానని తెలిపారు.  లక్షల మంది ప్రజలు యాత్రను కొనసాగించేందుకు కావాల్సిన శక్తి ఇచ్చారని రాహుల్ గాంధీ అన్నారు.  తెలంగాణలో తన పాదయాత్రను ఎప్పటికీ మర్చిపోనన్నారు. 

అధికారంలోకి రాగానే రుణమాఫీ 

" 72,000 కోట్ల రైతు రుణమాఫీని అప్పటి యూపీఏ ప్రభుత్వం చేసింది. అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తాం.  అన్ని పంటలకు MSP రేట్లు ఇస్తాం  రైతులకు ప్రయోజనం చేకూరుస్తాం.  కేసీఆర్ కమీషన్లు వచ్చేలా సాగునీటి ప్రాజెక్టులను మారుస్తూ రాత్రికి రాత్రే ధరణి పోర్టల్‌లో భూములు లాక్కోవాలని చూస్తున్నారు. టీఆర్‌ఎస్ కేవలం 5 శాతం ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.  రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో ఎవరికీ ఉపాధి లేదు. నేను లోక్‌సభలో చూశాను, రైతుల బిల్లుతో సహా మోదీ ప్రభుత్వం  అన్ని బిల్లులకు టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చింది. దేశంలోని ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నప్పుడు టీఆర్‌ఎస్ మోదీకి మద్దతు ఇచ్చింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే. వారి స్నేహితులు కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చడం కేసీఆర్ విధానం. సమాజంలోని కొన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని ప్రైవేటీకరించారు. ఇదే మోదీ కేసీఆర్  వైఖరి. GST  నోట్ల రద్దుతో మోదీ ప్రభుత్వం చిన్న పరిశ్రమలను నాశనం చేసింది తద్వారా ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. వారు ఉద్దేశపూర్వకంగా తమ విధానాలతో విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నారు. "- రాహుల్ గాంధీ 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Breaking News: NDSA చెప్పింది పాటించి, నీళ్లు ఎత్తిపోయడం లేదు: రేవంత్ రెడ్డి
NDSA చెప్పింది పాటించి, నీళ్లు ఎత్తిపోయడం లేదు: రేవంత్ రెడ్డి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget