అన్వేషించండి

Kamareddy News : కామారెడ్డిలో ఉద్రిక్తత, రణరంగంగా మారిన ప్రజాదర్బార్!

Kamareddy News : బీజేపీ, టీఆర్ఎస్ సవాళ్లతో కామారెడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. ప్రజా దర్బార్ నిర్వహించేందుకు ఇరు పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రజాదర్బార్ అనుమతిలేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Kamareddy News : కామారెడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్ ప్రజా దర్బార్ రణరంగంగా మారింది. కామారెడ్డి మున్సిపాలిటీ వద్దకు ర్యాలీగా వచ్చిన టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్లు పోలీసులకు తలనొప్పిగా మారింది. 

అసలేం జరిగింది? 

బీజేపీ, టీఆర్ఎస్ ప్రజాదర్బార్ కార్యక్రమంతో కామారెడ్డి మున్సిపాలిటీ రణరంగంలో మారింది. టీఆర్ఎస్, బీజేపీ సవాళ్లు ప్రతి సవాళ్లు పోలీసుల సహనానికి పరీక్ష పెట్టింది. ప్రజాదర్బారు అనుమతి లేదన్న పోలీసులు మున్సిపల్ కార్యాలయ గేటును మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం10 గంటలకు ప్రజాదర్బార్ నిర్వహిస్తామని బీజేపీ పిలుపునివ్వగా టీఆర్ఎస్ నాయకులు ఉదయం 9:50కి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. బారీకేడ్లను తోసుకుని మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ప్రజలకు క్షమాపణ చెప్పాలి

టీఆర్ఎస్ నాయకుడు వేణుగోపాల్ రావు మాట్లాడుతూ ప్రజాదర్బార్ కార్యక్రమానికి వస్తానని చెప్పిన వెంకట రమణారెడ్డి తోక ముడిచారని మండిపడ్డారు. దమ్ముంటే మున్సిపల్ కార్యాలయానికి రావాలని సవాల్ విసిరారు. అనవసర ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునే రమణారెడ్డి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ నాయకులు మున్సిపల్ ఆఫీస్ వద్దకు రాకుండా మోర్ మార్కెట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 

Kamareddy News : కామారెడ్డిలో ఉద్రిక్తత, రణరంగంగా మారిన ప్రజాదర్బార్!

బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం

కామారెడ్డి బల్దియాలో అవినీతి, కబ్జాలు, అక్రమ భూదందాలపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ప్రజాదర్బార్ పేరుతో ఇరు పార్టీలు బహిరంగ చర్చకు సిద్ధం అయ్యాయి. టీఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాలను ప్రజల ముందు పెడతామని బీజేపీ నాయకులు ప్రకటించారు. దీంతో బీజేపీ సవాల్ ను టీఆర్ఎస్ నేతలు స్వీకరించారు. దీంతో రెండు పార్టీల నేతలు కామారెడ్డి మున్సిపాలిటీ దగ్గరకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దాదాపు 300 మంది పోలీసు సిబ్బందితో మున్సిపల్ కార్యలయం దగ్గర భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Also Read : RFCL: పెద్దపల్లి RFCL ఫ్యాక్టరీకి పొల్యుషన్ బోర్డు షాక్! మళ్లీ రైతులకు కష్టాలు తప్పవా?

Also Read : Crore Rupees in HDFC Account: సామాన్యుడి బ్యాంకు ఖాతాలో రూ.18.52 కోట్లు జమ, లబోదిబో మంటున్న బాధితుడు - ఎందుకంటే !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget