By: ABP Desam | Updated at : 30 May 2022 04:53 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కామారెడ్డిలో ఉద్రిక్తత
Kamareddy News : కామారెడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్ ప్రజా దర్బార్ రణరంగంగా మారింది. కామారెడ్డి మున్సిపాలిటీ వద్దకు ర్యాలీగా వచ్చిన టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్లు పోలీసులకు తలనొప్పిగా మారింది.
అసలేం జరిగింది?
బీజేపీ, టీఆర్ఎస్ ప్రజాదర్బార్ కార్యక్రమంతో కామారెడ్డి మున్సిపాలిటీ రణరంగంలో మారింది. టీఆర్ఎస్, బీజేపీ సవాళ్లు ప్రతి సవాళ్లు పోలీసుల సహనానికి పరీక్ష పెట్టింది. ప్రజాదర్బారు అనుమతి లేదన్న పోలీసులు మున్సిపల్ కార్యాలయ గేటును మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం10 గంటలకు ప్రజాదర్బార్ నిర్వహిస్తామని బీజేపీ పిలుపునివ్వగా టీఆర్ఎస్ నాయకులు ఉదయం 9:50కి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. బారీకేడ్లను తోసుకుని మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రజలకు క్షమాపణ చెప్పాలి
టీఆర్ఎస్ నాయకుడు వేణుగోపాల్ రావు మాట్లాడుతూ ప్రజాదర్బార్ కార్యక్రమానికి వస్తానని చెప్పిన వెంకట రమణారెడ్డి తోక ముడిచారని మండిపడ్డారు. దమ్ముంటే మున్సిపల్ కార్యాలయానికి రావాలని సవాల్ విసిరారు. అనవసర ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునే రమణారెడ్డి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ నాయకులు మున్సిపల్ ఆఫీస్ వద్దకు రాకుండా మోర్ మార్కెట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
కామారెడ్డి బల్దియాలో అవినీతి, కబ్జాలు, అక్రమ భూదందాలపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ప్రజాదర్బార్ పేరుతో ఇరు పార్టీలు బహిరంగ చర్చకు సిద్ధం అయ్యాయి. టీఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాలను ప్రజల ముందు పెడతామని బీజేపీ నాయకులు ప్రకటించారు. దీంతో బీజేపీ సవాల్ ను టీఆర్ఎస్ నేతలు స్వీకరించారు. దీంతో రెండు పార్టీల నేతలు కామారెడ్డి మున్సిపాలిటీ దగ్గరకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దాదాపు 300 మంది పోలీసు సిబ్బందితో మున్సిపల్ కార్యలయం దగ్గర భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Also Read : RFCL: పెద్దపల్లి RFCL ఫ్యాక్టరీకి పొల్యుషన్ బోర్డు షాక్! మళ్లీ రైతులకు కష్టాలు తప్పవా?
KTR Tweet: 'చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా' - అసలైన ఫలితాలు శుభవార్త ఇస్తాయంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్
Tension at Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ వద్ద హై టెన్షన్ - డ్యామ్ పరిశీలించిన కృష్ణా రివర్ బోర్డు సభ్యులు, ఏపీ పోలీసులపై కేసు నమోదు
Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత
Latest Gold-Silver Prices Today 01 December 2023: మళ్లీ పెరిగిన పసిడి వెలుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
LPG Cylinder Price Today: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెరిగిన గ్యాస్ రేట్లు, ఎల్పీజీ సిలిండర్ మరింత భారం
YSRCP Leader Arrest in US : బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !
Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?
భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్
Rs 2000 Notes: రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెల్లుతాయి, కీలక అప్డేట్ ఇచ్చిన ఆర్బీఐ
/body>