అన్వేషించండి

Andhra News : బిడ్డకు హాస్టల్ ఫీజు కట్టలేక జర్నలిస్టు ఆత్మహత్య - కృష్ణాజిల్లాలో విషాదం !

Journalist suicide కొడుకు హాస్టల్ ఫీజుకు డబ్బులు లేక జర్నలిస్టు ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణా జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది.

 

Andhra News  Journalist suicide  :  చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించలేక.. బిడ్డ హాస్టల్ ఫీజు చెల్లించలేక ఓ జర్నలిస్టు  ( Journalist   ) తండ్రి ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జిగింది. కృష్ణాజిల్లా చల్లపల్లిలో ( challapalli )  కల్లేపల్లి చంద్ర అనే జర్నలిస్టు సిటీకేబుల్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన తన కుమారుడ్ని  హాస్టల్ లో ఉంచి చదివిస్తున్నారు. హాస్టల్ ఫీజు కట్టాల్సి ఉండటంతో కొద్ది రోజులుగా.. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తారేమోని తిరుగుతున్నారు. నీతి, నిజాయితగా ఉండే  చంద్ర రాజకీయ నాయకులు, వ్యాపారస్తుల వద్ద ఎప్పుడూ చేయిచాచలేదు. ఇప్పుడు కూడా ఆయన తెలిసిన వారిని సాయం చేయమని అడిగారు కానీ..  పెద్దగా ఫలితం లేకపోవడంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.              
 
జర్నలిస్టుగా అందరితోనూ కలుపుగోలుగా ఉండే కల్లేపల్లి చంద్ర తన కుమారుడి హాస్టల్ ఫీజ్ కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సూసైడ్ నోట్ రాసి ప్రభుత్వ కార్యాలయం వద్ద ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం సంచలనం సృష్టించింది. చాలీ చాలని జీతాలతో పని చేస్తున్న జర్నలిస్టులు తమ కుటుంబాలను పోషించుకోలేక ఇలా బలవన్మరణం చెందడంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.                              

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం తరుపున కొంత మేర  సాయం అందుతూ ఉండేది. అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశాయి. సంక్షేమపథకాలను కూడా అమలు చేయడం లేదు. ప్రభుత్వం జర్నలిస్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పిల్లలు చదువులు కోసం రాయితీ ఇవ్వాలని అడుగుతున్న పట్టించుకునే నాధుడు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తరపు నుంచి కొద్దిగా మద్దతు ఉన్నా కల్లేపల్లి చంద్ర తన బిడ్డను చదివించుకునేవాడని.. ఇప్పుడు హాస్టల్ ఫీజు కట్టలేక చనిపోయాడని తోటిజర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.                                    

ఈ అంశంపై జనసేన నేతలు స్పందించారు. పాత్రికేయుడు ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి... కృష్ణా జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి   లంకిశెట్టి బాలాజీ... అనునిత్యం కుటుంబ సభ్యులను విడిచిపెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న పాత్రికేయుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వ విధివిధానాలకు చల్లపల్లిలో జరిగిన కల్లేపల్లి చంద్ర ఆత్మహత్య నిలువెత్తు నిదర్శనం అని కృష్ణా జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ అన్నారు.        

ప్రభుత్వ విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెబుతూ ఇప్పుడు మార్కెట్ ధరలో 40% విలేకరులే భరించాలని, యాజమాన్యం నుంచి ఐదు సంవత్సరాలు తక్కువ కాకుండా అక్రిడ్షన్ కార్డులు కావాలని, సాధ్యం కానీ నిబంధనలు పెట్టి విలేకరుల్ని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని బాలాజీ అన్నారు. చంద్ర కుటుంబానికి ప్రభుత్వ పరంగా కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున బాలాజీ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.         

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget