అన్వేషించండి

YS Sharmila : అవినీతిపై ప్రశ్నిస్తే దాడులా?, ప్రజలు చెప్పులతో కొట్టే రోజు దగ్గర్లోనే - వైఎస్ షర్మిల

YS Sharmila : వైఎస్ఆర్టీపీని కనీసం పార్టీగా గుర్తించమన్న టీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు భయంపట్టుకుందని వైఎస్ షర్మిల విమర్శించారు.

YS Sharmila : జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. అయితే పాదయాత్రలో వైటీపీ, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం తలెత్తింది. వైఎస్ఆర్టీపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.  వైఎస్ షర్మిల మాట్లాడుతూ...  తన పాదయాత్రను అడ్డుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పాదయాత్ర ఫ్లెక్సీలు చించేశారని, తమ నాయకులను కొట్టారన్నారు. చామనపల్లిలో దాడులు జరుగుతుంటే పోలీసులు ఉండి కూడా చర్యలు తీసుకోలేదన్నారు. ఎవరిని అదుపులోకి తీసుకోలేదని, కేసులు పెట్టలేదన్నారు. నైట్ క్యాంప్ ధ్వంసం చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు.  పాదయాత్రలో మేం టెంట్ లు వేసుకొని ఉంటున్నామని, చలికాలం అయి ఉండి కూడా మేం టెంట్ లు వేసుకొని రోడ్ల పైనే పడుకుంటున్నామన్నారు. 

పోలీసులా, టీఆర్ఎస్ కార్యకర్తలా? 

"టీఆర్ఎస్ నేతలు అసలు మనుషులేనా?  మానవత్వం లేదా?. అధికారం రాగానే మృగాలుగా మారారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల వైపే నిలబడ్డారు. టీఆర్ఎస్ నేతలుగా పోలీసులు పనిచేస్తున్నారు. పోలీసులకు ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యత లేదా?. పోలీసులు గులాబీ కండువాలు..గులాబీ నిక్కర్ లు వేసుకొని తిరగండి.  ప్రజల దగ్గర నుంచి జీతం తీసుకొని టీఆర్ఎస్ నేతలకు ఊడిగం చేస్తారా?. ప్రజల పక్షాన నిలబడుతున్న వారిపై దాడులు జరుగుతుంటే కళ్లప్పగించి చూస్తారా?. మేము పాదయాత్ర చేయకూడదా?. మేము ప్రజల పక్షాన నిలబడకూడదా? మీ అవినీతిని ప్రశ్నించ కూడదా?. పాదయాత్రలో అడుగడుగునా ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి బయటపడుతుంది. "- వైఎస్ షర్మిల 

సమాధానం చెప్పే దమ్ముందా? 

రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా బీజేపీ, కాంగ్రెస్ నోరు విప్పడం లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. అందరినీ కొనేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం బ్రతికి ఉందా? అని ప్రశ్నించారు.  ప్రజల పక్షాన నిలబడటం నేరమా? అని నిలదీశారు. ప్రజల తరుపున ఆలోచన చేయడం తప్పా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు ఇంత అవినీతికి పాల్పడుతుంటే ఒక్కరు కూడా మాట్లాడటం లేదన్నారు. అవినీతి, అక్రమాల మీద సమాధానం చెప్పే దమ్ము లేక దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. సమాధానం చెప్పే విషయం ఉంటే ప్రజాక్షేత్రంలో మైకు పట్టుకొని సమాధానం చెప్పండని సవాల్ చేశారు. అవినీతి పరులు కాబట్టి సమాధానం చెప్పే చేతకాదన్నారు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి సమాధానం చెప్పే దమ్ము లేదన్నారు. ఇంతకాలం మాది పార్టీ కాదని పట్టించుకోం అన్నారని, ఇప్పుడు ఎందుకు దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల్లో ఆదరణ లేదని అనుకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారన్నారు. 

చెప్పులతో కొట్టే రోజులు 

"వైఎస్ఆర్ తెలంగాణ గడ్డకు ఎంతో సేవ చేసిన వ్యక్తి.  వైఎస్సార్ పెట్టిన పథకాలతో ఈ గడ్డ కూడా ఎంతో లబ్ది పొందింది. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ పథకాలతో ఎంతో మేలు జరిగింది. అందుకే వైఎస్సార్ ను తెలంగాణ గడ్డ ఇంకా గుర్తు పెట్టుకుంది. వైఎస్సార్ చనిపోతే ఈ గడ్డ మీద 700 మంది గుండె పగిలి చనిపోయారు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకునే దమ్ము లేదు కానీ దాడులు చేస్తారా?. టీఆర్ఎస్ నేతలు వెనక ఉంటారు..కార్యకర్తలను ముందు పెడతారు. కార్యకర్తలు ఆలోచన చేయండి.. మీకు ఇళ్లు ఎవరు ఇచ్చారు.  వైఎస్సార్ ఏం చేశారు కేసీఆర్ చేసిన మోసం ఏంటో గ్రహించాలి. వైఎస్సార్ బిడ్డగా హెచ్చరిస్తున్నా వైఎస్సార్ ఫ్లెక్సీలు, విగ్రహాల జోలికి వస్తే ప్రజలు సహించరు. ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మీ తాటాకు చప్పుళ్లకు YSR బిడ్డ భయపడేది కాదు. "- వైఎస్ షర్మిల 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Ind vs Ban 5 Major controversies: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
Embed widget