By: ABP Desam | Updated at : 12 Apr 2023 06:10 PM (IST)
సివిల్ సర్వీస్ అధికారుల క్యాడర్ వివాదాన్ని త్వరగా విచారించాలని కేంద్రం పిటిషన్
Telangana News : తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్యాడర్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అత్యవసరంగా విచారణ చేయాలని కోరింది. అయితే హైకోర్టు జూన్ 5 న విచారిస్తామని తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత 14 మంది IAS , IPS అధికారులను AP, తెలంగాణకు కేటాయించింది కేంద్రం. కేంద్ర ఉత్తర్వులపై క్యాట్ ను ఆశ్రయించిన కొంత మంది సివిల్ సర్వీస్ అధికారులు తెలంగాణలోనే విధులు నిర్వహిస్తున్నారు . ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించింది కేంద్రం. ఇప్పటికే హైకోర్టు అదేశాలతో ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ఏపీ క్యాడర్ కు వెళ్లారు. సీఎస్ పోస్టులో ఉన్న ఆయన ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సి రావడంతో చివరికి వీఆర్ఎస్ తీసుకున్నారు.
ఏపీ క్యాడర్కు చెందిన 12 మంది ఆలిండియా సర్వీస్ ఆఫీసర్లు క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో పని చేస్తున్నారు. వీరిలో తెలంగాణ ఇన్ చార్జ్ డీజీపీ అంజనీకుమార్, ఎడ్యుకేషన్ సెక్రటరీ వాకాటి కరుణ, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్ రాస్ తదితరులు ఉన్నారు. ఏపీ క్యాడర్ కు చెందిన సోమేశ్ కుమార్ మొన్నటిదాకా తెలంగాణ సీఎస్ గా పని చేశారు. అయితే క్యాడర్ విషయంలో వారం కిందట హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడం.. అందుకు అనుగుణంగా డీవోపీటీ ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణలో సీఎస్ పోస్టును వదులుకుని.. రెండు రోజుల వ్యవధిలోనే ఏపీలో సోమేశ్ కుమార్ రిపోర్ట్ చేశారు. కానీ అక్కడ పోస్టింగ్ కేటాయించలేదు. విధుల్లో చేరకుండానే పదవి విరమణ తీసుకున్నారు.
తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న డీజీపీ అంజనీ కుమార్ సహా 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది. తెలంగాణ ఇన్ చార్జ్ డీజీపీ అంజనీకుమార్ సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపులపై విచారణను తెలంగాణ హైకోర్టు కొన్నాళ్ల కిందట వాయిదా వేసింది. 12 మంది బ్యూరోక్రాట్ల క్యాడర్ పై వేసిన పిటిషన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరుపుతోంది. ట్రైబ్యునల్ వేర్వేరుగా తీర్పులు వెలువరించిందని అన్ని పిటిషన్లపై రెగ్యులర్ బెంచ్ విచారణ జరపాలని గతంలో నిర్ణయించారు.
ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలు డీజీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజకీయ కుట్రలతో తమను కేసుల్లో ఇరిక్సుతన్నారని బండి సంజయ్ ఆరోపించారు. డీజీపీని ఏపీ క్యాడర్ కు పంపిస్తామన్న ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కేసులను త్వరగా తేల్చాలని కేంద్రం హైకోర్టును ఆశ్రయించడంతో అధికారవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సోమేష్ కుమార్ విషయంలో ఇచ్చిన తీర్పు మెరిట్ ప్రకారం చూస్తే అందరూ ఏపీకి వెళ్లాల్సి వస్తుందన్న అభిప్రాయ అధికారవర్గాల్లో ఉంది. అయితే విచారణను జూన్లో చేపడతామని హైకోర్టు చెప్పడంతో మరో రెండు నెలల వరకూ ఈ అంశంలో ఎలాంటి కదలిక ఉండకపోవచ్చు.
TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!
Singareni Bonus: సింగరేణి ఉద్యోగులకు కేసీఆర్ భారీ బోనస్ ప్రకటన - ఈసారి ఏకంగా రూ.700 కోట్లు
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
KCR Speech: ధరణి వద్దన్నోడిని గిరాగిరా తిప్పి బంగాళాఖాతంలో విసిరెయ్యండి - కేసీఆర్ వ్యాఖ్యలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్
Varun Tej Engagement: వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి
WTC Final 2023: ప్చ్.. టీమ్ఇండియా 296 ఆలౌట్! అజింక్య సెంచరీ మిస్ - ఆసీస్కు భారీ లీడ్!