అన్వేషించండి

Telangana DGP Jitender : తెలంగాణ డీజీపీగా జితేందర్ - హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవి గుప్తా

DGP Jitendar : తెలంగాణ డీజీపీ గా జితేందర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీగా ఉన్న రవి గుప్తాను హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించారు.

IPS Jitender as Telangana DGP  :  తెలంగాణలో డీజీపీని మార్చారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తా స్థానంలో  సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చే్శారు. రవి గుప్తాకు హోంశాఖ స్పెషల్ సెక్రటరీ బాధ్యతలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న అంజనీకుమార్ ఫలితాలు వెలువడక ముందే రేవంత్ రెడ్డిని కలవడంతో ఈసీ ఆగ్రహించి బదిలీ చేసింది. ఆ స్థానంలో రవి గుప్తాను నియమించింది. ఎన్నికల ఫలితాల తర్వాత ..సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత డీజీపీగా రవి గుప్తానే కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఇటీవలి కాలంలో మారుతున్న పరిణామాలు, వరుస ఘటనల కారణంగా డీజీపీని  మార్చాలని నిర్ణయానికి వచ్చి జితేందర్ ను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 
Telangana DGP Jitender : తెలంగాణ డీజీపీగా జితేందర్ - హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవి గుప్తా

ఉమ్మడి రాష్ట్రంలో కీలక బాధ్యతలు నిర్వహించిన జితేందర్                                

1992 బ్యాచ్‌ ఏపీ క్యాడర్ కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన జితేందర్ సొంత రాష్ట్రం పంజాబ్. ప్రస్తుతం ఆయన డీజీ ర్యాంక్ లో ఉన్నారు. ఇప్పటి వరకూ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా , విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఏపీలో  నిర్మల్‌  ,  బెల్లంపల్లి అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్‌, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు.   ఢిల్లీ సీబీఐలో 2004 నుంచి 2006 వరకు గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వహించారు. డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్‌లో  పని చేశారు.  హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గా పనిచేశారు.  వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఆయన పదవీకాలం ముగియనుంది. 14 నెలలపాటు ఆయన డీజీపీగా  కొనసాగే అవకాశం ఉంది.   డీజీపీని మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకోలేదు కానీ రాష్ట్రంలో పరిస్థితులు .. లా అండ్ ఆర్డర్ పై వస్తున్న విమర్శలతో కీలక నిర్ణయం తీసుకోక తప్పలేదని చెబుతున్నారు.                                                

సీనియర్ అధికారుల విషయంలో రేవంత్ ప్రత్యేక గౌరవం                      

అధికారుల వి,యంలో  రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోలేదు. చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమారి కేసీఆర్ హయాంలోనే నియమితులయ్యారు.  ఆయినప్పటికీ ఆమెను మార్చలేదు. ఏపీలో చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డిని చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే సెలవులో పంపించారు. ఆ తర్వాత ఆయన రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇచ్చి.. రిటైరయ్యేలా చేశారు. అయితే జవహర్ రెడ్డిపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ విషయంలో జగన్ కుట్రను అమలు చేసి .. పెద్ద ఎత్తున వృద్దుల మరణాలకు కారణం అయ్యారని ఆరోపణలు చేసింది. 


 

టాప్ హెడ్ లైన్స్

KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
Enquiry On Erravalli Farmhouse: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. 30 రోజులు డెడ్‌లైన్
కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. 30 రోజులు డెడ్‌లైన్
CM Revanth Reddy: ధరణి పేరుతో బీఆర్ఎస్ భారీ కుట్ర.. విదేశాల్లోని మాఫియా చేతికి భూముల వివరాలు: సీఎం రేవంత్
ధరణి పేరుతో బీఆర్ఎస్ భారీ కుట్ర.. విదేశాల్లోని మాఫియా చేతికి భూముల వివరాలు: సీఎం రేవంత్
తెలంగాణలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు సింగపూర్ నిర్ణయం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డితో భేటీ
తెలంగాణలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు సింగపూర్ నిర్ణయం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డితో భేటీ

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget