అన్వేషించండి

Telangana Politics: నేడు మున్సిపల్ ఛైర్మన్, మేయర్ ఎన్నిక.. కీలకంగా ఎక్స్ అఫీషియో ఓట్లు

Municipal Mayor Election | రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలకు మేయర్లను, డిప్యూటీ మేయర్లను, అలాగే 116 మున్సిపాలిటీలకు ఛైర్‌పర్శన్లు, వైస్‌ ఛైర్మెన్లను ఫిబ్రవరి 16న పరోక్ష ఎన్నికల ప్రక్రియతో ఎన్నుకుంటారు.

Telangana Municipal Chairman Elections | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలకు మేయర్లు, 116 మున్సిపాలిటీలకు ఛైర్‌పర్సన్లను ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 16న (నేడు) రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. పరోక్ష పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఎక్స్ అఫీషియో, కో ఆప్షన్ ఓట్లు కీలకం కానున్నాయి.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం సమావేశ మందిరంలో జరిగే ప్రతి అంశాన్ని వీడియో చిత్రీకరించాలని నిబంధన విధించారు. కలెక్టర్ల అనుమతి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమింగ్) కూడా చేయనున్నారు. ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే ఎటువంటి ప్రయత్నాలను హాల్ లోపల అనుమతించబోరు. వేదికపై కేవలం ఎన్నికల అధికారి, పరిశీలకుడు మాత్రమే ఉంటారు.

ముఖ్యంగా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వంటి ఎక్స్-అఫీషియో సభ్యుల కోసం ప్రత్యేక సీటింగ్ కేటాయించారు. రాజకీయ పార్టీల సభ్యులు, స్వతంత్ర అభ్యర్థులకు విడివిడిగా సీట్లు కేటాయించి, ప్రతి గ్రూపు ముందు గుర్తింపు బోర్డులను ఏర్పాటు చేశారు. ఏవైనా వివాదాలు తలెత్తితే పరిష్కరించేందుకు ఉన్నత స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ కీలక ఎన్నికలను పూర్తి చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది.

లోక్ సభ ఎంపీలు, ఎమ్మెల్యేలు: సంబంధిత మున్సిపాలిటీ పరిధి పూర్తిగా లేదా కొంత భాగంగా అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండాలి. అప్పుడే ఎక్స్‌ అఫీషియో ఓటు వేయవచ్చు. అయితే సంబంధిత నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉంటేనే ఓటు వేసే వీలుంటుంది. ఓ ఎమ్మెల్యే నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీల్లో రెండు చోట్ల ఓటింగ్ ఉంటే ఒకేచోట మాత్రమే ఓటు హక్కు చెల్లుబాటు అవుతుంది. రెండుచోట్ల కో ఆప్షన్ ఓటు వినియోగించుకునే అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసింది. రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఆ మున్సిపాలిటీ పరిధిలో ఓటరుగా నమోదు అయి ఉంటేనే ఓటు హక్కు ఉంటుంది.

కాంగ్రెస్ పార్టీ హవా

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన హవా చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించి, అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 66 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఏకపక్ష విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కేవలం 13 స్థానాలకే పరిమితం కాగా, 38 పురపాలికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో 'హంగ్' ఏర్పడింది. 

ఇక 7 కార్పొరేషన్ల విషయానికొస్తే.. 4 కాంగ్రెస్‌కు, 2 బీజేపీకి దక్కాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌లో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్, సీపీఐ పార్టీలు పొత్తు కుదుర్చుకోవడం విశేషం. వార్డుల వారీగా చూస్తే, కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని కనబరిచింది. మొత్తం 1,347 వార్డుల్లో విజయం సాధించి తిరుగులేని శక్తిగా నిలిచింది. డివిజన్ల స్థాయిలోనూ కాంగ్రెస్ 191 చోట్ల గెలిచి అగ్రస్థానంలో నిలవగా, బీజేపీ 77 డివిజన్లతో రెండో స్థానంలో నిలిచింది.

మున్సిపల్ ఎన్నికల తుది బలాబలాలు
1. వార్డుల వారీగా ఫలితాలు:
కాంగ్రెస్ 1,347 
బీఆర్ఎస్ (BRS)  716 
బీజేపీ (BJP) 261 
ఇతరులు (MIM, CPI, CPM, Ind) 257 

2. డివిజన్ల వారీగా ఫలితాలు (మొత్తం 414):
 కాంగ్రెస్ 191 
బీజేపీ (BJP)  77 
బీఆర్ఎస్ (BRS)  63 
ఇతరులు 83 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS MLAs Walk Out: మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
CM Revanth Musi Revival Project: అగ్నిపరీక్షగా మూసి ప్రక్షాళన - మాటలకే ఇంత కాలం మరి చేతలెప్పుడు?
అగ్నిపరీక్షగా మూసి ప్రక్షాళన - మాటలకే ఇంత కాలం మరి చేతలెప్పుడు?
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Advertisement

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
US Exit Bonus: అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
Big Relief For Fliers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Free Charging For EVs: మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
BRS MLAs Walk Out: మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Embed widget