అన్వేషించండి

Minister KTR With ABP Desam : టీఆర్ఎస్ కోసం ఐప్యాక్ పనిచేస్తుంది, బీజేపీకి విషయం లేదు విషం మాత్రమే ఉంది : ఏబీపీ దేశంతో మంత్రి కేటీఆర్

Minsiter KTR With ABP Desam : ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఐప్యాక్ టీఆర్ఎస్ కోసం పనిచేస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ 21వ ఆవిర్భావ వేడుకల్లో మూడోసారి ఎలా అధికారంలోకి రావాలో చర్చిస్తామని ఆయన అన్నారు.

Minsiter KTR With ABP Desam : ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పనిచేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రి కేటీఆర్ ఏబీపీ దేశంతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.." ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ ను మాకు పరిచయం చేశారు. వాళ్లు టీఆర్ఎస్ తరఫున పనిచేసేందుకు ఒప్పుకున్నారు. ఎవరూ ఓడిపోయే పార్టీలకు సపోర్టు ఇవ్వరు. ఐప్యాక్ కూడా అంతే తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తోందన్న నమ్మకంతో ఐప్యాక్ మాతో కలిసి పనిచేసేందుకు ఒప్పుకుంది. మమత, స్టాలిన్, నవీన్ పట్నాయక్ ఇలా ఎక్కడ మంచి లీడర్లు ఉన్నారో అక్కడ ఐప్యాక్ సక్సెస్ అయింది." అని కేటీఆర్ అన్నారు. 

ఖమ్మం ఘటనకు బీజేపీ బాధ్యత వహించాలి

"రామాయంపేట తల్లి, కుమారుడు ఆత్మహత్య ఘటన విషాదకరం, దురదృష్టకరం. జరగకూడని ఘటన. అయితే ఆ తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు చూడండి. లఖింపూర్ ఘటన తర్వాత బీజేపీ ఏం చేసిందో చూడండి. మరి టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. నిందితుడిని రామాయంపేటలో అరెస్టు చేశారు. విచారణ జరగనివ్వండి. టీఆర్ఎస్ నేత నేరానికి పాల్పడినట్లయితే, అభియోగాలను ఎదుర్కొనేలా మేము చేస్తాం. ఖమ్మం బీజేపీ కార్యకర్త ఆత్మహత్య ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. మంత్రిగా నేను అధికారిక పనులకు వెళ్లినప్పుడు, నా వాహన శ్రేణిని అడ్డుకోవాలని బీజేపీ యువ నాయకులను ప్రేరేపించింది. ఈ ఘటనకు సంబంధించి సహజంగానే పోలీసులు కేసులు పెడతారు. అలాంటి ఓ ఘటనలో కేసు నమోదు అయింది. సాయి గణేష్ ఆత్మహత్యకు బీజేపీ బాధ్యత తీసుకోవాలి." అని మంత్రి కేటీఆర్ అన్నారు. 

గవర్నర్ రాజకీయ ప్రసంగాలు 

"గాంధీని హత్యచేసిన వారిని ప్రధాని మౌనంగా సమర్థిస్తారని నా దృఢమైన అభిప్రాయం. నాథూరామ్ గాడ్సే మొదటి ఉగ్రవాది అని నేను అంటాను. గాడ్సే జయంతిని జరుపుకునేటప్పుడు ప్రధాని నోరు మెదపరు. అంటే గాడ్సేను సమర్థించడం కాదా. గవర్నర్ అనేది నామమాత్రపు పదవి. ఆమెను ప్రత్యక్ష్యంగా ఎన్నుకోలేదు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రాజకీయేతర వ్యక్తులను గవర్నర్‌గా నియమించండి అని మోదీ స్వయంగా చెప్పారు. ఆయన చెప్పిన మాటలను పాటించడం లేదు. రాజకీయ నాయకురాలిలా గవర్నర్ ప్రసంగాలు చేస్తారు కానీ మనం మాట్లాడితే తప్పు. బీజేపీ ఫిరాయింపు రాజకీయాలు చేస్తోంది. టీఆర్ఎస్ హలాల్, హిజాబ్ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఉపాధి సమస్యలు, సామాన్యులకు బలం చేకూర్చే అంశాలపై చర్చించాలనుకుంటుంది. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల్లో మూడోసారి ఎన్నికల్లో గెలుపొందేందుకు రోడ్‌మ్యాప్‌పై చర్చిస్తాం. ప్రస్తుత సమస్యలను పరిష్కరించుకుంటాం. ఎన్‌డీఎ ప్రభుత్వంపై నా ఆరోపణ ఏమిటంటే అవి ఎన్‌పీపీ అంటే నాన్ పర్ఫామింగ్ అలెయెన్స్( పని చేయని కూటమి). బండి సంజయ్ ఒక బఫూన్, జోకర్. అతనికి అవగాహన లేదు. కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకోకపోతే తెలంగాణ బీజేపీ ఎక్కడ, బండి ఎక్కడ." అని కేటీఆర్ అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget