By: ABP Desam | Updated at : 05 Jun 2023 06:55 PM (IST)
వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు నుంచి సమన్లు అందాయి. ఈ నెల 20వ తేదీన విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఇటీవల వైఎస్ షర్మిల పోలీసులపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏప్రిల్ 24న నిరుద్యోగ సమస్యలపై దీక్షకు సిద్ధమైన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. వారితో షర్మిల వాగ్వానికి దిగారు. ఆ క్రమంలోనే వైఎస్ షర్మిల ఎస్సైపై చేయి చేసుకున్నారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించి వైఎస్ షర్మిల నిరసన తెలిపారు. చివరికి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
పోలీసులపై ఆమె చేయి చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇది విపరీతంగా చర్చనీయాంశం అయింది. ఈ దాడి ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు. విచారణ చేసి నేడు ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో విచారణకు హాజరుకావాలని వైఎస్ షర్మిలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
KCR Health Condition: సీఎం కేసీఆర్ కు అస్వస్థత, ప్రగతి భవన్ లో ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స
boy suicide: అపార్ట్మెంట్ పైనుంచి దూకిన పదో తరగతి విద్యార్థి సూసైడ్- చివరి నిమిషంలో తల్లికి మెస్సేజ్!
Ganesh Nimajjanam: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా TSRTC స్పెషల్ బస్సులు: సజ్జనార్
NIMS: 'నిమ్స్'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
JNTUH Admissions: జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులు, అర్హతలివే
Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !
Nithya Menen: నిత్యా మీనన్పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్
Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!
Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?
/body>