అన్వేషించండి

YS Sharmila: ప్రొ.కోదండరామ్‌‌తో వైఎస్ షర్మిల భేటీ, T-SAVE కోసం కలిసి పని చేద్దామని విజ్ఞప్తి

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశంతో పాటు రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు కలిసి పోరాటం చేసే అంశంపై ఇరువురూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

YS Sharmila meets Professor Kodandaram: వైఎస్ఆర్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కలిశారు. నాంపల్లిలోని టీజేఎస్ (TJS) పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆమె భేటీ అయ్యారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశంతో పాటు రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు కలిసి పోరాటం చేసే అంశంపై ఇరువురూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్య యువతను పట్టి పీడిస్తోందని అన్నారు. అందరం కలిసికట్టుగా పని చేస్తే మంచిదని, అందుకోసం టీ - సేవ్ ఫోరం (T SAVE Forum) పేరుతో అందరం కలిసి పోరాడదామని అన్నారు. నిరుద్యోగులకు భరోసా కోసమే టీ సేవ్ ఫోరమ్ ఉద్దేశమని చెప్పారు. అయితే, వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై ప్రొఫెసర్ కోదండరాం సానుకూలంగా స్పందించారు. పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతానని హామీ ఇచ్చినట్లు సమాచారం.

‘‘అన్ని పార్టీలు ఏకం అవ్వాలి. అన్ని పార్టీలు ఓకే వేదిక మీదకు వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. T - SAVE ఫోరం అధ్యక్షుడిగా ఉండాలని కోదండరాంను కోరాం. కోదండరాం సానుకూలంగా స్పందించారు. కలిసి కొట్లాడకపోతే నిరుద్యోగులకు న్యాయం జరగదు. ఎవరికి వారు పోరాటం చేసినా కేసీఅర్ అణచి వేస్తున్నారు. అందరం ఒక వేదిక మీదకు వస్తే వెంటనే న్యాయం జరుగుతుంది’’ అని షర్మిల మీడియాతో మాట్లాడారు.

ప్రొఫెసర్ కోదండరామ్ (Professor Kodandaram) మాట్లాడుతూ.. నిరుద్యోగుల తరపున కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎవరితో కలిసి పోవాలనేది తమ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని కోదండరామ్ చెప్పారు. ఎవరితో కలిసి ఎలా పోరాటంలో ముందుకు వెళ్ళాలనేది టీజేఎస్ రాష్ట్ర కమిటీలో చర్చించుకుని మాట్లాడతామని అన్నారు. పదో తరగతికి సంబంధించి నిన్న, నేడు వరుసగా పేపర్ లీక్ కావడం ప్రభుత్వ నిర్లక్షమేనని విమర్శించారు. ఇవాళ సాయంత్రం అఖిలపక్ష ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నామని, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని కోదండరాం స్పష్టం చేశారు.

‘‘T- SAVE లో భాగస్వామ్యం కావాలని షర్మిల అడిగారు. నిరుద్యోగుల పక్షాన కొట్లాడాల్సిన అవసరం ఉంది. షర్మిల ప్రతిపాదనల పై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు.

నిరుద్యోగుల కోసమే టీ - సేవ్: వైఎస్ షర్మిల (YS Sharmila)

వైఎస్ షర్మిల నిన్న (ఏప్రిల్ 3) విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..  తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా ఉమ్మడిగా కలిసి పోరాడుదామని YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం T-SAVE (Telangana Students Action For Vacancies & Employment) అనే ఫోరంను ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగుల పక్షాన కలిసి పోరాడితేనే పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ అవుతాయని, అప్పుడే యువతకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కేసులు, అరెస్టులు, హౌజ్ అరెస్టులతో కేసీఆర్ సర్కారు.. ప్రశ్నించకుండా నిర్బంధిస్తోందని, దీని నుంచి బయటపడి, పోరాడాలంటే అందరూ ఏకతాటి మీదికి రావాలని సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Durgam Lake Encroachment Case: దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
Embed widget