అన్వేషించండి

YSRTP Congress Merger: కాంగ్రెస్ హై కమాండ్ అలా, షర్మిల దారి మరోలా - పార్టీ విలీనానికి బ్రేకులు పడ్డాయా!

YSRTP merger with Congress: షర్మిల చేసిన ధర్నా చూస్తుంటే కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ విలీనానికి బ్రేకులు పడ్డాయా..? ఢిల్లీలో అసలేం జరిగింది అని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

YSRTP merger with Congress: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం.. తుదిదశకు చేరుకున్న చర్చలు.. చక్రం తిప్పిన డీకే శివకుమార్..! అని ఇటీవల ఈ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ, శుక్రవారం షర్మిల చేసిన ధర్నా చూస్తుంటే కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ విలీనానికి బ్రేకులు పడ్డాయా..? ఢిల్లీలో అసలేం జరిగింది అని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓ రాజకీయ పార్టీ నడపాలంటే ఆర్థిక, అంగ బలంతో పాటు అనుకూల పరిస్థితులు కూడా ఉండాలి. వైఎస్ షర్మిల ఆర్థికంగా ఎలా ఉన్నప్పటికీ.. అంగబలం, అనుకూల పరిస్థితులు తెలంగాణలోనే లేవనే చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో పార్టీ విలీనం వైపు ఆమె అడుగులు వేసినట్లు కనిపిస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ ముందు ఆమె కొన్ని షరతులు పెట్టారు. అదేంటంటే ఒకటి పార్టీలో సముచిత స్థానం, ఉపాధ్యక్షురాలు స్థాయి పదవి ఇవ్వడం. రెండోది తాను కోరుకున్న 10 చోట్ల ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలి. మూడో విషయం ఏంటంటే.. లోక్ సభ లేదా రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు తెలుస్తోంది. 
ఇలా మూడు ప్రధాన డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. ఐతే.. కాంగ్రెస్ పార్టీ దీనికి ఒకే చెబుతూనే ఒక్క షరతు విధించింది. అదేటంటే... 10 సీట్లు ఏంటీ.. మెుత్తం అసెంబ్లీ టికెట్స్ నువ్వు కోరుకున్న వాళ్లకే ఇద్దాం కానీ అది తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ లో అని షాక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది.

ఎవరెన్ని చేసినా తెలంగాణ వ్యతిరేకిగా పేరున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల అనే ప్రచారం జనాల్లో బాగానే ఉంది. మరికొందరిలో రాజన్న బిడ్డ అనే సానుభూతి ఉంది. కానీ ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లోకి షర్మిలను ఆహ్వానించి ఆంధ్రులను ఆదరించే పార్టీగా ముద్ర వేసుకోడం సరికాదని పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తును బూచిగా చూపించిన సీఎం కేసీఆర్ .. ఈ సారి షర్మిలను చూపిస్తే వచ్చే సీట్లు తగ్గుతాయని హైకమాండ్ భావిస్తోంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ లోకి షర్మిల రాకపోవడమే బెటర్ అనే ఆలోచనలో ఉంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని పదే పదే హైకమాండ్ కు చెబుతున్నారు. 

మరోవైపు విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పడిపోయింది. దానికి ఊపిరిపోయాలంటే రాజశేఖర్ బిడ్డ షర్మిలనే కరెక్ట్ ఆప్షన్. అందులోనూ కాంగ్రెస్ క్యాడర్ అంతా రాజశేఖర్ వారసత్వం అని వైసీపీలోకి చేరిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ క్యాడర్ కాంగ్రెస్ వైపు రావాలంటే ఇటువైపు కూడా రాజశేఖర్ రెడ్డి రక్తాన్ని చూపించాలి. ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ .. బలమైన ప్రతిపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేనలతో పోటీ పడి జనాల్లోకి వెళ్లాలంటే అది షర్మిలతో సాధ్యమవుతోంది. అందుకే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా లేదా జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఏపీ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. కర్ణాటక నుంచి ఆమెకు రాజ్యసభ సీటు కూడా ఇస్తామని చెబుతున్నారు. షర్మిల పార్టీలోకి వస్తే 2024 ఎన్నికల్లో పెద్దగా ప్రయోజనం లేకపోయినప్పటికీ.. 2029 ఎన్నికల్లో ఏపీలో బలమైన పార్టీగా మళ్లీ కాంగ్రెస్ కనిపిస్తుంది అన్నది రాహుల్ గాంధీ ఆలోచన.

ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. అన్నతో గొడవలెందుకు అని తెలంగాణలో పార్టీ (YSRTP) పెట్టారు వైఎస్ షర్మిల. తెలంగాణలో పార్టీ నడుపుతూ ఇక్కడ దుకాణం బంద్ పెట్టి.. ఏపీకి ఎందుకు వెళ్లాలన్నది ఆమె నుంచి వినిపిస్తున్న ప్రశ్న. రెండు సీట్లు తక్కువగా ఇచ్చిన పర్లేదు తెలంగాణలోనే ఉంటానని ఆమె గట్టిగా చెబుతోంది. అందుకే ఢిల్లీలో పార్టీ విలీనంపై చర్చలు విఫలమయ్యయేమో గానీ.. వెంటనే తెలంగాణకు వచ్చి  కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. అంటే తాను ఎక్కడికి వెళ్లేది లేదు తెలంగాణలోనే ఉంటానన్న సంకేతాలు కాంగ్రెస్ హైకమాండ్ కు పంపినట్లు అయింది.

హైకమాండ్ టార్గెట్ ఒకలా.. షర్మిల టార్గెట్ మరోలా ఉండటంతో... ప్రస్తుతానికైతే కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ విలీనానికి బ్రేకులు పడినట్లుగానే భావించాలని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget