News
News
వీడియోలు ఆటలు
X

Union Minister Kishan Reddy: జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే మౌనిక మృతి: నాలా ఘటనపై కిషన్ రెడ్డి ఫైర్

Union Minister Kishan Reddy: పాల కోసం వెళ్లి నాలాలో పడి చనిపోయిన మౌనిక మృతికి జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.  

FOLLOW US: 
Share:

Union Minister Kishan Reddy: సికింద్రాబాద్ కళాసిగూడలో పాల కోసం వెళ్లి నాలాలో పడి చనిపోయిన బాలిక మౌనిక మృతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. చిన్నారి మృతికి జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణం అని తెలిపారు. కాంట్రాక్టర్లకు జీహెచ్ంసీ అధికారులు సరిగ్గా బిల్లులు ఇవ్వకపోవడం వల్లే వారు సరిగ్గా పనులు చేయలేదని.. దీంతో మౌనిక మృతి చెందిందని చెప్పారు. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని సూచించారు. రోడ్లు తవ్వినప్పుడు కనీస దజాగ్రత్తలు పాటించడం లేదని.. శాఖల మధ్య కూడా ఎలాంటి సమన్వయం లేదని విమర్శలు గుప్పించారు.  

మరోవైపు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ... "హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ పైన మెరుగు, లోపుల మురుగు. బయటకు వెళ్లిన వారు ఇంటికి వస్తారనే నమ్మకం లేదు. చిన్నారి ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి" అని తెలిపారు. 

అసలేం జరిగిందంటే..?

రాష్ట్రంలో గత కొద్ది రోజులగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పంట పొలాలన్నీ నాశనం అవుతుండగా.. మరోవైపు హైదరాబాద్ లో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం సికింద్రాబాద్ కళాసిగూడలో పాల ప్యాకెట్ కోసం వెళ్లిన పదకొండేళ్ల చిన్నారి మౌనిక నాలాలో పడి మృతి చెందింది. అయితే ఈ ఘటనపై స్పందించిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే బాలిక మృతికి కారణం అయిన ఇద్దరు జీహెచ్ఎంసీ అధికారులపై వేటు వేశారు. ఏఈ తిరుమలయ్య, వర్క్ ఇన్ స్పెక్టర్ బీఎం హరికృష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పది రోజుల్లో సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఈఈ ఇందిరా బాయికి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 

Published at : 29 Apr 2023 05:28 PM (IST) Tags: Hyderabad Telangana Heavy Rains Kalasiguda Incident Mounika Death Case

సంబంధిత కథనాలు

Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!

Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి  ప్రత్యేక పార్కింగ్ స్థలాలు

నాడు చెరువులు నిండుకున్నాయి- నేడు నిండు కుండల్లా ఉన్నాయి: తెలంగాణ మంత్రులు

నాడు చెరువులు నిండుకున్నాయి- నేడు నిండు కుండల్లా ఉన్నాయి: తెలంగాణ మంత్రులు

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్‌ టూర్‌లో కేటీఆర్

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్‌ టూర్‌లో కేటీఆర్

టాప్ స్టోరీస్

Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?

Janasena News : జనసేనలోకి ఆమంచి  కృష్ణమోహన్ సోదరుడు -  చీరాలపై గురి పెట్టారా ?

Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?

Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?

Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!

Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!

Adipurush Censor Report : 'ఆదిపురుష్' సెన్సార్ కంప్లీటెడ్ - రిపోర్ట్ ఎలా ఉందంటే?

Adipurush Censor Report : 'ఆదిపురుష్' సెన్సార్ కంప్లీటెడ్ - రిపోర్ట్ ఎలా ఉందంటే?