అన్వేషించండి

Infosys Tiger: ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?

Infosys: ఇన్‌ఫోసిస్ ఉద్యోగులు ఆఫీసుకు వస్తే డేంజర్ అంటూ ఈమెయిల్స్ అందుకున్నారు. దీనికి కారణం హెచ్‌ఎంపీవీ వైరస్ కాదు.. ఓ టైగర్.

Tiger in Infosys Campus:  మైసూరులో ఇన్‌ఫోసిస్‌కు అతి పెద్ద క్యాంపస్ ఉంది. అక్కడ వేల మంది ఉద్యోగులు పని చేస్తూ ఉంటారు. వారందరికీ హటాత్తుగా ఓ మెయిల్ వచ్చింది. ఎవరూ ఆఫీసుకు రావాల్సిన పని లేదుని అందరూ వర్క్ ఫ్రం హోం చేయాలని అందులో ఆదేశాలు ఇచ్చారు. వస్తే ప్రమాదంలో పడతారని హెచ్చరించారు. రాకపోతే ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించే మెయిల్స్ వచ్చాయి కానీ ఇలా .. ఆఫీసుకు వస్తే ప్రమాదంలో పడతామని హెచ్చరించే మెయిల్స్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు రావొద్దంటున్నారో తెలిసిన తర్వాత .. ఉద్యోగం తీసేస్తామని చెప్పినా సరే రాబోమని అంటున్నారు. ఎందుకంటే వారి క్యాంపస్‌లోకి పులి వచ్చింది.                                  

ఇన్ఫోసిస్ ఆఫీస్ క్యాంపస్ లోకి పులి వచ్చినట్లుగా తెలియడంతో అందరికీ వర్క్ ఫ్రం హోం ఇచ్చేశారు. ఎవరూ పొరపాటున కూడా ఆఫీసుకు రావొద్దని అర్జంట్ మెయిల్ పంపారు. ఈ మెయిల్స్ చూసుకోకుండా ఎవరైనా ఆఫీసు దగ్గరకు వస్తే వెనక్కు పంపేస్తున్నారు. ఇన్ఫోసిస్ వర్క్ ఫ్రం హోంకు పూర్తి వ్యతిరేకం. అయినా పులి కారణంగా వర్క్ ఫ్రం హోం ఇవ్వక తప్పలేదు.   

Also Read: ఒరే ఆజాము ఎంత గ్యాంగ్‌స్టర్‌వి అయితే మాత్రం గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే రోజు ఇలా చేయాలా ? - అదిత్యనాథ్ ఒక చూపు చూస్తే ...

మైసూరులోని ఇన్ ఫోసిస్ క్యాంపస్ రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలో ఉంటుంది. ఫారెస్ట్ నుంచి ఓ పులి క్యాంపస్ లోకి వచ్చేసింది. దాన్ని గమనించడంతో వెంటనే అలర్ట్ అయ్యారు. ఫారెస్ట్ సిబ్బందికి ఇతర అధికారులకు సమాచారం ఇచ్చి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ దొరకలేదు. అందుకే వర్క్ ఫ్రం హోం ఇచ్చేశారు.  చాలా రోజులుగా పులి తిరుగుతోంది కానీ పట్టుకోలేకపోతున్నారు. పట్టుకునే వరకూ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయనున్నారు. మళ్లీ చెప్పే వరకూ ఆఫీసుకు వెళ్లేందుకు ఉద్యోగులు కూడా భయపడే అవకాశం ఉంది.  

 2011లో కూడా ఓ సారి ఇన్ ఫోసిస్ మైసూర్ ఆఫీసులోకి పులి వచ్చింది. అప్పట్లో అందరూ పరుగులు తీశారు. ఎలాగోలా పట్టుకున్నారు. ఇప్పుడు ఈ పులి దొరుకుందో లేదో అన్న టెన్షన్ ఉద్యోగులకు పట్టుకుంది.  ఆఫీసులో పులి అనేది కొత్త కాన్సెప్ట్. ఈ ఐడియాతో సస్పెన్స్ ధ్రిల్లర్ సినిమా తీస్తే సూపర్ హిట్ అయిపోతుందని సోషల్ మీడియాలో ఐటీ ఉద్యోగులు జోకులు వేసుకుంటున్నారు.       

Also Read : Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Milei Cabala Magic: వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget