News
News
X

Swapanloka Fire Incident: స్వప్నలోక్ కాంప్లెక్స్ ను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి - కేంద్రం రూ.2 లక్షల పరిహారం! 

Swapanloka Fire Incident: సికింద్రాబాద్ లోని అగ్నిప్రమాదం జరిగిన స్వప్నలోక్ కాంప్లెక్స్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డ పరిశీలించారు. ఆరుగురు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు.  

FOLLOW US: 
Share:

Swapanloka Fire Incident: సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగిన స్వప్నలోక్ కాంప్లెక్స్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. స్థానికంగా ఉన్న అధికారులను అడిగి అన్ని వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం అగ్ని ప్రమాదాల నివారణకు కఠినంగా వ్యవహరించాలని కిషన్ రెడ్డి కోరారు. కమిటీలు ఏర్పాటు చేయడం మినహా ప్రమాదాల నివారణకు కృషి చేయడం లేదని  విమర్శించారు. అక్రమ కట్టడాలకు జీహెచ్ఎంసీ ఏమాత్రం అడ్డు చెప్పకుండా, రెగ్యులరేషన్ పేరుతో ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పని చేస్తుందని ఆరోపించారు. ప్రమాదల నివారణకి జీహెచ్ఎంసీ ఏమాత్రం పాటుపడడం లేదని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఉంటాయని మృతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కేంద్రం నుండి రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. 

"అటు ఫైర్ డిపార్ట్ మెంట్ కానీ ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ కానీ జీహెచ్ఎంసీ డిపార్ట్ మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్ మెంట్ కానీ వీళ్లకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి వాళ్లకు రెగ్యులర్ గా ఇదే బాధ్యత ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం ఆ కమిటీల ద్వారా చేయాలి. అందులో ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడకుండా నిజాయితీతో వ్యవహరించేటటువంటి అధికారులతో వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను. నేను టూర్ లో ఉన్నాను. వెంటనే నేను గౌరవ ప్రధాన మంత్రి గారితోటి మాట్లాడి ఇక్కడ నా నియోజకవర్గంలో మరి మా జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్స్ నాకిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు నేను ప్రధాన మంత్రి గారితోటి మాట్లాడి ఆరు మంది చనిపోయారు. మనం కొంత ఆర్థిక సాయం ప్రకటించాలని చెప్పినప్పుడు ప్రధాన మంత్రి గారు ఒకరొకరికి రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

అదే కాకుండా స్టేట్ డిజాస్టర్ తరఫున కూడా మేం 50 శాతం ఇస్తాం. స్టేట్ గవర్నమెంట్ 50 శాతం ఇస్తుంది. స్టేట్ డిజాస్టర్ తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకోవచ్చని కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోం సెక్రటరీ వారు కూడా చెప్పారు. కాబట్టి వారు డిజాస్టర్ మేనేజ్ మెంట్ తరఫున కూడా ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం పెడ్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50 శాతం పెడ్తుంది. ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ప్రమాదాలు కానీ వచ్చినప్పుడు ఎవరి అనుమతి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం 50 శాతం ఇచ్చినప్పటికి కూడా స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఈ రకమైనటువంటి మరి సంఘటనలు జరిగినపుడు ఆ డబ్బులు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి." - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Published at : 19 Mar 2023 07:35 PM (IST) Tags: Hyderabad News Kishan Reddy comments Telangana News Swapanloka Fire Incident Swapanlok Fire Incident

సంబంధిత కథనాలు

TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా

TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

Hyderabad మెట్రో రైల్ ప్రాజెక్టు రెండోదశ ఎందుకు సాధ్యం కాదు?: కేంద్రానికి కేటీఆర్ లేఖాస్త్రం

Hyderabad మెట్రో రైల్ ప్రాజెక్టు రెండోదశ ఎందుకు సాధ్యం కాదు?: కేంద్రానికి కేటీఆర్ లేఖాస్త్రం

TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ

TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Eesha Rebba: అందాలతో అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బ

Eesha Rebba: అందాలతో అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బ