నూతన సచివాలయం
TS New Secretariat: హైదరాబాద్ లో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎం కేసీఆర్ సచివాలయానికి చేరుకోనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించనున్న పూర్ణాహుతిలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత సచివాలయాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవం తర్వాత నేరుగా 6వ అంతస్థులోని తన చాంబర్ కు సీఎం వెళ్తారు. అక్కడే తన చాంబర్ లో కూర్చొని గృహలక్ష్మీ సహా కీలక ఫైల్స్ పై సంతకాలు చేస్తారు.
మధ్యాహ్నం 1.58 నుండి 2.04 లోపు ఎవరి ఛాంబర్ లోకి ఆ మంత్రులు వెళ్తారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఫైల్ పై కేటీఆర్ తొలి సంతకం చేస్తారు. అనంతరం అంటే 2.15 గంటలకు సచివాలయం నుంచి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. మొత్తం 650 మంది పోలీసులతో సచివాలయానికి భారీ భద్రత చేపట్టనున్నారు. సచివాలయం ప్రారంభోత్సవం కారణంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెలుగు తల్లి జంక్షన్ వద్ద వాహనాలను దారి మళ్లించారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వాహనాలకు నో ఎంట్రీ విధించారు. ట్యాంక్ బండ్, తెలుగుతల్లి, బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ లో వాహనాలకు అనుమతి నిరాకరించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పార్కులను మూసివేశారు.
నూతన సచివాలయం ఎందుకు కట్టాలనుకున్నారు?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయంలోనే కేసీఆర్ సారథ్యంలోని తొలి ప్రభుత్వం పరిపాలనను ప్రారంభించింది. రాష్ట్ర పరిపాలనకు ఆయువుపట్టుగా భావించే పాత సచివాలయంలో కాలానుకూలంగా ఏర్పాటు చేసుకోవాల్సిన వసతుల లేమితో సచివాలయ ఉద్యోగులు, సందర్శకుల రకకరాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం దృష్టికి వచ్చింది. తరుచూ పై కప్పు పెచ్చులు ఊడిపడడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సమస్యలు తలెత్తడం, అన్ని వసతరులతో క్యాంటీన్ ఏర్పాటుకు స్థలం లేమి, పార్కింగ్ సౌకర్యం లేకపోవడం తదితర ఇబ్బందులతో పాలనాపరమైన సమస్యలు, శాఖల మధ్య సమన్వయ లోపం వంటి ఎన్నో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పాత సచివాలయం స్థానంలోనే రాష్ట్ర పాలనకు కేంద్రమైన కొత్త సచివాలయాన్ని దేశంలోనే అత్యద్భుతంగా నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు.
నూతన సచివాలయ భవనం డిజైన్ కు ప్రేరణ..
నిజామాబాదులోని కాకతీయుల కాలంనాటి నీలకంఠేశ్వరస్వామి దేవాలయం, వనపర్తి సంస్థానపు రాజప్రాసాదాల్లోని శైలులు-అక్కడి గోపురాలు, గుజరాత్ లోని సారంగాపూర్ హనుమాన్ దేవాలయ శైలుల ఆధారంగానే సచివాలయం గుమ్మటాల నిర్మాణాలు జరిగాయి. బయటివైపు ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నింటినీ ఎర్ర ఇసుకరాతితోనూ, మధ్యనున్న శిఖరం లాంటి బురుజును రాజస్థాన్ లోని ధోల్పూర్ నుంచి తెచ్చిన ఇసుకరాతితో నిర్మించారు. నూతన సచివాలయానికి తూర్పున లుంబినీవనం, అమరజ్యోతి.. పశ్చిమాన మింట్ కాంపాండ్, ఉత్తరాన అంబేద్కర్ విగ్రహం, దక్షిణాన రవీంద్రభారతి రోడ్డు ఉన్నాయి.
సచివాలయం విస్తీర్ణం వివరాలు
TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మాజీ ఎంపీటీసీ కుమార్తె పేరు- షాకింగ్ విషయాలు చెబుతున్న డీఈ రమేష్
Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్మ్యాన్
Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు
'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఊహించని గెస్ట్!
థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!
WTC Final 2023: అదిరిందయ్యా రోహిత్! కొత్త జెర్సీల్లో టీమ్ఇండియా ఫొటోషూట్!