అన్వేషించండి

Theenmaar Mallanna: తీన్మార్ మల్లన్న అరెస్టు.. ఓ జ్యోతిష్యుడి ఫిర్యాదు వల్లే.. అసలేం జరిగిందంటే..

ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించే తీన్మార్ మల్లన్న అరెస్టయ్యారు. ఈ మధ్య కాలంలో ఆయనపై వివిధ రకాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

‘క్యూ న్యూస్‌’ అధినేతగా ఉన్న తీన్మార్‌ మల్లన్నను ఉప్పల్‌లోని ఆయన నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకొని వెళ్లారు. తన వద్ద నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని మారుతీ జ్యోతిష్యాలయ నిర్వహకుడు సన్నిదానం లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదు మేరకు కేసు పెట్టినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసు విషయంలో నోటీసు ఇచ్చి ఈ నెల 3వ తేదీన చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌లో విచారణ జరిపామని తెలిపారు. 

ఈ నెల 8న మరోసారి విచారణకు హాజరు రావాలని మల్లన్నను కోరగా.. కరోనా పాజిటివ్‌ ఉన్నందున రావడం కుదరడం లేదని తన న్యాయవాది ద్వారా సమాచారం పంపారని పోలీసులు వెల్లడించారు. ఆ విచారణకు మల్లన్న హాజరు కాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను శుక్రవారం రాత్రి ఆయనను తన నివాసంలోనే అరెస్టు చేశామని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ప్రకటించారు. మల్లన్నను ఈ రోజు (ఆగస్టు 28) ఉదయం కోర్టులో పోలీసులు హాజరు పరచనున్నట్లు తెలిపారు.

సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని మధురానగర్‌లో ‘మారుతీ జ్యోతిష్యాలయం’ పేరుతో ఓ సంస్థను సన్నిదానం లక్ష్మీకాంత శర్మ నిర్వహిస్తున్నారు. తీన్మార్ మల్లన్న తన వద్ద నుంచి రూ.30 లక్షలు డిమాండ్‌ చేస్తున్నాడని ఏప్రిల్‌ 22న ఈయన చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన గురించి క్యూ న్యూస్‌లో తప్పుడు కథనాలు ప్రసారం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, రాజకీయ కుట్రలో భాగంగానే తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని మల్లన్న తెలిపారు.

ప్రస్తుతం సైబర్‌క్రైమ్‌ స్టేషన్‌లో రెండు, చిక్కడపల్లి, జూబ్లీహిల్స్‌లో నవీన్‌పై ఒక్కో కేసు నమోదైంది. మరో కేసులో ఆయన కార్యాలయాన్ని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తనిఖీ చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. కీలక హార్డ్ డిస్కులను, ఇతర సామగ్రిని పోలీసులు ఎత్తికెళ్లినట్లుగా అప్పుడు తీన్మార్ మల్లన్న ఆరోపించారు.

టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి ఫిర్యాదు
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి మన్నె క్రిషాంక్ సైబర్ క్రైం పోలీసులకు మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో క్యూ న్యూస్ కార్యాలయం, ఇంటిలో ఏక కాలంలో దాడులు చేశారు. సైబర్ క్రైమ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయం నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు కంప్యూటర్లు, 40 హార్డ్ డిస్కులతోపాటు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫొటోలకు మీసాలు తగిలించి మల్లన్న తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వారిని అవమాన పరుస్తున్నారని ఓయూ విద్యార్థి రామారావు గౌడ్ కూడా ఫిర్యాదు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: ట్రావెల్ బస్సు ప్రమాదం- మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటన
ట్రావెల్ బస్సు ప్రమాదం- మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటన
Kurnool Bus Mishap Exgratia: కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
Reason For Kurnool bus Accident: కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
Baahubali The Epic : 'బాహుబలి: ది ఎపిక్' ప్రమోషన్లకు దూరంగా 'దేవసేన'! - జస్ట్ వెయిట్ ఫర్ బిగ్ సర్‌ప్రైజ్
'బాహుబలి: ది ఎపిక్' ప్రమోషన్లకు దూరంగా 'దేవసేన'! - జస్ట్ వెయిట్ ఫర్ బిగ్ సర్‌ప్రైజ్
Advertisement

వీడియోలు

Vizag Google Data Centre Controversy | వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ పై ప్రశ్నలకు సమాధానాలేవి..? | ABP
Aus vs Ind 2nd ODI Highlights | రెండు వికెట్ల తేడాతో భారత్ పై రెండో వన్డేలోనూ నెగ్గిన ఆసీస్ | ABP Desam
Netaji Subhash Chandra Bose | నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్ర | ABP Desam
కోహ్లీ భయ్యా.. ఏమైందయ్యా..? అన్నీ గుడ్లు, గుండు సున్నాలు పెడుతున్నావ్!
గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన పాకిస్తాన్ ఫ్యాన్‌.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: ట్రావెల్ బస్సు ప్రమాదం- మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటన
ట్రావెల్ బస్సు ప్రమాదం- మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటన
Kurnool Bus Mishap Exgratia: కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
Reason For Kurnool bus Accident: కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
Baahubali The Epic : 'బాహుబలి: ది ఎపిక్' ప్రమోషన్లకు దూరంగా 'దేవసేన'! - జస్ట్ వెయిట్ ఫర్ బిగ్ సర్‌ప్రైజ్
'బాహుబలి: ది ఎపిక్' ప్రమోషన్లకు దూరంగా 'దేవసేన'! - జస్ట్ వెయిట్ ఫర్ బిగ్ సర్‌ప్రైజ్
Gold: 18 క్యారెట్ల ఆభరణాలను 22 క్యారెట్లుగా చెప్పి అమ్ముతున్న బంగారం వ్యాపారులు, మోసాన్ని గుర్తించేదెలా?
18 క్యారెట్ల ఆభరణాలను 22 క్యారెట్లుగా చెప్పి అమ్ముతున్న బంగారం వ్యాపారులు, మోసాన్ని గుర్తించేదెలా?
DNA Test For Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు: మంత్రి సత్యకుమార్
కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు: మంత్రి సత్యకుమార్
Param Sundari OTT: ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ 'పరమ్ సుందరి' - నో రెంట్... ఫ్రీగా చూసెయ్యొచ్చు
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ 'పరమ్ సుందరి' - నో రెంట్... ఫ్రీగా చూసెయ్యొచ్చు
Telangana Cabinet Decisions: బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
Embed widget