అన్వేషించండి

TG Ration Cards: రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, పెండింగ్ దరఖాస్తులకు లైన్ క్లియర్

Telangana News | తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్డులలో కొత్త పేర్లు చేర్చడానికి పౌరసరఫరాల శాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్: రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ (Telangana) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్ని ఏళ్ల నుంచి రేషన్ కార్డుల కోసం చేస్తున్న నిరీక్షణకు మోక్షం లభించనుంది. మీ పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చే ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకూ రేషన్ కార్డుల్లో అవసరం లేని సభ్యులను తొలగించడం కొసాగుతుండగా, తాజాగా కొత్త సభ్యులను చేర్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో తెలంగాణ పౌరసరఫరాల శాఖ రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేరిక కోసం దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తోంది. 

మే నెల కోటా కేటాయింపు
ఇప్పటివరకు రేషన్ కార్డులలో సభ్యులు తొలగింపు కొనసాగుతుండగా, తాజాగా కొత్త సభ్యుల చేరిక ఆప్షన్ కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో దరఖాస్తులు పరిశీలించి కొత్త సభ్యులను అధికారులు ఆమోదిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ అయినప్పటికీ, ఏడేళ్ల వయసు దాటిన వారికి మాత్రమే రేషన్ సరుకులు ఇవ్వన్నట్లు తెలుస్తోంది. పెండింగ్ దరఖాస్తులు 20 శాతం మేర పరిష్కరించి వాటికి సైతం మే నెల రేషన్ కోటాను పౌరసరఫరాల శాఖ కేటాయించింది. మిగతా దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పరిశీలించి ఒక్కొక్కటిగా ఆమోదిస్తోంది. 

రేషన్ కార్డులు లేక తీవ్ర ఇబ్బందులు, త్వరలోనే పరిష్కారం
తెలంగాణలో 2 కోట్ల 81 లక్షల కుటుంబాలకు దాదాపు 90 లక్షల మేర రేషన్ కార్డులున్నాయి. కానీ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో, అటు ప్రైవేట్ ఆస్పత్రిలో నూ ఈ కార్డులు లేక ఉచిత వైద్యం సైతం చేయించుకోలేకపో తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రేషన్ కార్డులపై కదలిక వచ్చింది. రేషన్ కార్డులు జారీలో జాతీయ జరుగుతున్న, దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రేషన్ కార్డులో కొత్త సభ్యుల చివరి కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాలు వేరై రెండు మూడు కుటుంబాలుగా విడిపోయిన, కుటుంబంలో కొత్త వ్యక్తి పుట్టినా ప్రత్యేకంగా రేషన్ కార్డులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెబుతున్నప్పటికీ తమకి ఇంకా రేషన్ కార్డులు జారీ కావడం లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలనలో భాగంగా తీసుకున్న దరఖాస్తులు, జనవరి నెలలో గ్రామసభలో వచ్చిన దరఖాస్తులు, ఆపై మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను  పౌరసరఫరాల శాఖ పరిశీలించి ఆమోదిస్తోంది. కొందరు ఒకే రేషన్ కార్డు కోసం మూడు నాలుగు దరఖాస్తులు ఇచ్చినట్లుగా అధికారులు తెలిపారు. అందువల్లే రేషన్ కార్డులు జారీలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. ఇటీవల ఆమోదం పొందిన రేషన్ కార్డులకు మే నెల కోటా కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ కారణంగా రేషన్ కార్డుల జారీలో జాప్యం జరుగుతోందని నేతలు చెబుతున్నారు. కానీ ఏడాదిన్నర గడిచినా కొత్త రేషన్ కార్డులు తమ చేతికి మాత్రం రాలేదని ప్రజలు అంటున్నారు. రేషన్ కార్డులను రెండు రకాలుగా జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిసిందే.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget