అన్వేషించండి

Telangana SSC Results 2026: తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల.. 95.15 శాతం విద్యార్థులు పాస్.. ఫలితాల కోసం డైరెక్ట్ లింక్

TS 10th Class Results 2026 | తెలంగాణలో పదో తరగతి ఫలితాలు బుధవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. విద్యార్థులు bse.telangana.gov.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Telangana SSC Results 2026 |  హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు నేటితో తెరపడింది. రాష్ట్ర విద్యాశాఖ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఈఆర్టీ (SCERT) కార్యాలయంలో ఫలితాలను విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన వారిలో 95.15 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ ఫలితాలను వెల్లడిస్తారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://results.bse.telangana.gov.in/ , https://results.bsetelangana.org/ లో డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,26,166 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా, అందులో 4,97,312 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం  95.15 శాతం మంది టెన్త్ విద్యార్థులు పాసయ్యారు. గత ఏడాదితో (92.78%) పోలిస్తే ఈసారి ఫలితాలు మెరుగయ్యాయి. 

వాట్సాప్‌లో Hi లని మెస్సేజ్ చేస్తే ఫలితాలు..
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ ద్వారా చూసుకోవచ్చు. అంతేకాకుండా, ఈసారి సాంకేతికతను జోడిస్తూ వాట్సాప్‌లో కూడా ఫలితాలను పొందే వెసులుబాటు కల్పించారు. దీనికోసం అభ్యర్థులు 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో Hi అని మెసేజ్ చేయాలి. అనంతరం SSC Results లేక టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అని కనిపిస్తే.. క్లిక్ చేసి, హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఆ రిజల్ట్స్ పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థుల సౌకర్యార్థం ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

మరోసారి సత్తా చాటిన అమ్మాయిలు
ఈ ఏడాది కూడా ఉత్తీర్ణతలో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 96.26% గా నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 94.07% గా ఉంది. బాలుర కంటే బాలికలు 2.19 శాతం అధిక ఉత్తీర్ణత సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. రెగ్యులర్ అభ్యర్థుల పరంగా చూస్తే మొత్తం 5,16,815 మంది పరీక్ష రాయగా, అందులో 4,91,774 మంది పాస్ అయ్యారు.

ములుగు టాప్.. హైదరాబాద్ లాస్ట్
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా చూస్తే, ములుగు జిల్లా 99.30% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దురదృష్టవశాత్తూ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా 89.23% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. విద్యాసంస్థల వారీగా చూస్తే, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు 99.1% ఉత్తీర్ణతతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,731 పాఠశాలలు 100% ఫలితాలను సాధించగా, 6 పాఠశాలలు మాత్రమే 0% ఫలితాలను నమోదు చేశాయి.

వాట్సాప్‌లోనే ఫలితాలు చెక్ చేసుకోండి.
- మీ ఫోన్లో 8096958096 సేవ్ చేసుకోండి.
- ఆపై మీ వాట్సాప్‌లో 8096958096కి  Hi అని పంపాలి
- తర్వాత  SSC Results  అని టైప్ చేసి హాల్‌టికెట్ నంబర్ ఎంటర్, వివరాలు చేయాలి. 
- హాల్ టికెట్ నెండర్, మీ వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే స్క్రీన్‌పై రిజల్ట్ కనిపిస్తుంది.
- మీ రిజల్ట్స్ పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకుని, ప్రింటౌట్ తీసుకోవాలి. 

ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావించినప్పటికీ, విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ యుద్ధ ప్రాతిపదికన ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్  పూర్తి చేసి ముందుగానే ఫలితాలను సిద్ధం చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Embed widget