Telangana Latest News: తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
Telangana Latest News: లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఆ భూసేకరణ నోటిఫికేషన్ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.

Telangana Latest News: తెలంగాణలో లగచర్ల, హకీంపేటలో జరిగే భూసేకరణపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అక్కడ జరిగే భూసేకరణ ప్రక్రియకు బ్రేక్ వేసింది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసింది.
ఇండస్ట్రియల్ కారిడార్ కోసం దుద్యాల మండలంలోని లగచర్ల, పోలేపల్లి, హకీంపేట్, పులిచర్లకుంట తండా, రోటిబండ తండాల పరిధిలో భూసేకరణ కోసం ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేసింది. 1177 ఎకరాల భూసేకరణ చేయాలని నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వ భూమి 534 ఎకరాలు కాగా మిగతా 643 ఎకరాలు ప్రజల నుంచి సేకరించాలని ప్రభుత్వం భావించింది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ప్రజలతో ప్రభుత్వం చర్చలు జరిపి ఎకరాలకు 20 లక్షలు, 150 గజాల ప్లాటు, ఇంటికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో భూసేకరణకు ప్రజలు అంగీకరించారు. కానీ రోటిబండ తండాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం అధికారులపై దాడి చేయడం జరిగిపోయింది.
ఇలా వివాదాలతో ఉన్న భూసేకరణపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిపై తీర్పు వెల్లడించిన హైకోర్టు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసింది. వాటిపై స్టే విధించింది.
Also Read: SLBC టన్నెల్ ఆపరేషన్లోకి కేరళ కుక్కలు





















