అన్వేషించండి

MLA Raja Singh: రాజాసింగ్‌ కేసులో సర్కార్‌పై హైకోర్టు సీరియస్, ఈసారి ​నోటీసులిస్తామని హెచ్చరిక

ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు.

హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజాసింగ్ ​పైన పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయగా, అందుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో నేడు (అక్టోబరు 20) విచారణ జరిగింది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటిదాకా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పీడీ యాక్ట్ పెట్టడానికి గల కారణం చెప్పాలని ప్రభుత్వాన్ని కోర్టు మరోసారి ఆదేశించింది. ఈ పిటిషన్ తర్వాతి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయలేకపోతే నోటీసులు ఇస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది. తర్వాతి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. 

కొద్ది వారాల క్రితం ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. మంగళహాట్ పోలీస్ ​స్టేషన్ పరిధిలో రాజాసింగ్ ​పై రౌడీషీట్ తెరిచారు. రాజాసింగ్ తరుచూ​ రెచ్చగొట్టే ప్రసంగాలతో ఘర్షణలు చోటుచేసుకునేలా వ్యవహరిస్తున్నారని, అందుకే ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేశామని హైదరాబాద్​ పోలీస్ కమిషనర్​ సీవీ ఆనంద్ కూడా గతంలో ఓ సందర్భంలో​ తెలిపారు. 

ఓ మతం, లేదా వర్గాన్ని కించపరిచేలా పెట్టిన వీడియో శాంతిభద్రలకు విఘాతం కలిగించిందని సీపీ వివరణ ఇచ్చారు. 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్ పై 101కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. అంతేకాక 18 కమ్యూనల్ (మతపరమైన) కేసులు నమోదైనట్లు ఆయన చెప్పారు.

గతంలోనే హైకోర్టు హెచ్చరిక

రాజాసింగ్‌పై నమోదైన పీడీ యాక్ట్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కొన్ని రోజుల క్రితం ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం కౌంటర్ దాకలు చేయకపోవడంపై హైకోర్టు పది రోజుల క్రితమే ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా రెండోసారి. రాజాసింగ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి నాలుగు వారాలు గడుస్తున్నా స్పందించకపోవడంపై పది రోజుల క్రితమే ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. మరో రెండు వారాలు సమయం కావాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాజాసింగ్ కేసు విషయంలో ఇప్పటికే పీడీ యాక్ట్‌పై అడ్వైజరీ బోర్డు విచారణ పూర్తైందని కోర్టుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. బోర్డ్ నిర్ణయం పెండింగ్‌లో ఉందని వివరించారు. ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాది వివరణ విన్న హైకోర్టు.. ఈ నెల 20లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇకపై కౌంటర్ దాఖలు గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. కచ్చితంగా ఆ తేదీలోపు స్పందించాలని సూచించింది. 

తప్పు చేయలేదన్న రాజాసింగ్

మరోవైపు, తాను ఎలాంటి తప్పు చేయలేదని అధిష్ఠానానికి గతంలోనే వివరణ ఇచ్చారు రాజాసింగ్. భారతీయ జనతా పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చారు. ఎప్పుడో సమాధానం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అరెస్ట్ కావడంతో ఆలస్యంగా ఇచ్చారు. ఇప్పటికీ రాజాసింగ్ జైల్లోనే ఉన్నారు. ఇటీవలే ఆయన పీడీ యాక్ట్ అడ్వయిజరీ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో రాజాసింగ్ బీజేపీ హైకమాండ్‌కు తన వివరణ పంపించారు. జైలు నుంచే ఈ లేఖ పంపినట్లుగా అటెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని క్రమశిక్షణ కమిటీకి ఆయన లేఖ రాశారు. తానెక్కడ పార్టీ నిబంధనలను ఉల్లంఘించలేదని.. ఏ మతాన్ని కించపర్చలేదన్నారు. మునావర్ ఫారుఖీ షో సందర్భంగా తాను రిలీజ్ చేసిన వీడియోపై.. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి తప్పుడు కేసు పెట్టాయని.. ఆ కేసును కోర్టు డిస్మిస్ చేసిందన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget