అన్వేషించండి

Artificial Intelligence City : నాడు హైదరాబాద్‌- నేడు సైబరాబాద్‌- రేపు ఏఐ సిటీ

Artificial Intelligence City In Telangana : తెలంగాణలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నగరాన్ని నిర్మించబోతున్నట్టు గవర్నర్‌ ప్రసంగంలో ప్రభుత్వం తెలియజేసింది. 50-100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామంది.

Artificial Intelligence City : తెలంగాణ గవర్నర్‌ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై టీజర్‌ లాంటి అప్‌డేట్స్ ఇచ్చారు. భవిష్యత్‌లో చేపట్టబోయే పనులను తన ప్రసంగంలో తమిళిసై వివరణ ఇచ్చారు. అలాంటి వాటిలో ముఖ్యమైంది ఏఐ సిటీ. 

ఉమ్మడి రాష్ట్రంలో 1990 వరకు హైదరాబాద్‌ అంటేనే ఛార్మినార్‌, గోల్కొండ వంటి చారిత్రాత్మక కట్టడాలు గుర్తుకు వచ్చాయి. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చంద్రబాబు హయాంలో ఐటీకి ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రత్యేక సిటీ రూపాంతరం చెందింది. దాన్ని సైబరాబాద్‌గా పిలవడం మొదలు పెట్టారు. ఇలా హైదరాబాద్‌ లో మరో సరికొత్త నగరం ఆవిష్కృతమైంది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని అదే స్థాయిలో అభివృద్ధి చేస్తూ వచ్చారు. 

సైబరాబాద్‌ విస్తరిస్తూనే ఉంది. మారుతున్న టెక్నాలజీతోపాటు నగర పరిధి కూడా మారాల్సి వచ్చింది. అందుకే దీన్ని మరింతగా విస్తరించి సరికొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించినట్టు గవర్నర్‌ తన ప్రసంగంలో తెలియజేశారు. గవర్నర్‌ ప్రసంగంలో ఏమన్నారంటే..." నా ప్రభుత్వం కొత్త సాంకేతికతను ముఖ్యంగా కృత్రిమ మేధా శక్తిని వినియోగించుకోవాలని దృఢ నిశ్చయంతో ఉంది. ప్రపంచ అగ్రగామి సంస్థలు, అలాగే జాతీయ సాంకేతిక కంపెనీలను తమ కృత్రిమ మేధా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆహ్వానించడం ద్వారా దేశంలోనే హైదరాబాద్‌ను, తెలంగాణను కృత్రిమ మేధస్సుకు ప్రధాన కేంద్రంగా అభివృద్ది చేస్తాం. మా ప్రభుత్వం కృత్రిమ మేధా సిటీని 50-100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తుంది. 

అంతకు ముందు మాట్లాడుతూ... నేడు మన సమాజంలో డిజిటల్‌ అనుసరణ శరవేగంగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం డిజిటల్‌ అవకాశాల నుంచి పూర్తిగా ప్రయోజనం పొందడమే కాకుండా కొత్త సాంకేతికతలలో దేశంలోనే అగ్రగామిగా ఎదగవలసిన అవసరం ఉంది. ఇంటర్నెట్‌ను ఒక ప్రాథమిక హక్కుగా ప్రవేశ పెట్టడం అనేది, మా ప్రభుత్వం చేపట్టబోయే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి. కేవలం డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించడమే కాకుండా సమాజంలోని అనని వర్గాలకు కనీస ధరలకే అందుబాటులోకి తేవడంపై దృష్టి పెట్టబోతున్నాం. ప్రతి కుటుంబం వేగవంతమైన డిజిటల్‌ అనుసరణ అవకాశాల ద్వారా వచ్చే ప్రయోజనం పొందేందుకు ఒక సార్వజనీన సమగ్ర డిజిటల్‌ అక్షరాస్యత కార్యక్రమాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తుంది అని అన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Embed widget