అన్వేషించండి

TS Lands Auction : తెలంగాణ సర్కార్‌కు జాక్ పాట్ - అక్కడ భూముల వేలంలో ఎన్ని వందల కోట్లు వచ్చాయంటే ?

భూముల వేలంతో తెలంగాణ ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. తాజాగా వేసిన వేలంతో రూ. 200 కోట్ల వరకూ సమకూరినట్లుగా తెలుస్తోంది.

TS Lands Auction :   ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి జాక్ పాట్ తగిలినట్లయింది. హైదరాబాద్ శివారులో ఉన్న ప్రభుత్వ భూములను వేలం వేయడంతో వందల కోట్ల ఆదాయం వచ్చింది.  హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంలో స్థలాల కొనుగోలుకు రియల్‌ ఎస్టేట్  వ్యాపారులు పోటీపడ్డారు. అత్యధికంగా గజం రూ.1.11 లక్షల ధర పలికినట్లుగా తెలుస్తోంది.  రంగారెడ్డి జిల్లాలో మూడు, మేడ్చల్‌ -మలాజిగిరి జిల్లాలో నాలుగు, సంగారెడ్డి జిల్లాలో రెండు ల్యాండ్‌ పార్సిల్స్‌ కలిపి మొత్తం 9 చోట్ల భూములను విక్రయించడం ద్వారా రూ.195.24 కోట్ల రెవెన్యూ వచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ భూములకు హెచ్‌ఎండీఏ నిర్ణయించిన రూ.రూ.146 కోట్ల అప్‌సెట్‌ ధర మేరకు   ఆన్‌లైన్‌ వేలం నిర్వహించారు.  మొత్తం 32,730 చదరపు గజాల స్థలాలకు రూ.195.24 కోట్ల ఆదాయం సమకూరింది. రంగారెడ్డి జిల్లాలో పుప్పాలగూడ, గండిపేట, కోకాపేటలో వేలం నిర్వహించగా, కోకాపేటలోని 1,852 గజాల భూమికి అత్యధికంగా గజం రూ.1.11లక్షలు పలికిందని సమాచారం. మేడ్చల్‌ జిల్లా పరిధిలోని మూసాపేటలో 4,840 గజాలకు సుమారు రూ.35 కోట్లు మేర ధర పలికినట్టు అధికారులు చెబుతున్నారు.  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్‌టీసీ ఆధ్వర్యంలో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలం పోటాపోటీగా జరిగింది. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలో 12,584 చదరపు గజాలు, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 12,160 చదరపు గజాలు, సంగారెడ్డిలో 7,986 చదరపు గజాలు భూమిని ఈ వేలంలో విక్రయించారు. 

ఇంతకు ముందు   కోకాపేటలో 49.9 ఎకరాలు హెచ్‌ఎండీఏ వేలం వేసింది. గరిష్టంగా ఒక ఎకరాకు  రూ.60.2 కోట్ల ధర పలికింది. రూ.31.2 కోట్లకు అత్యల్ప ధరకు హైమా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎకరం భూమి కొనుగోలు చేసిది.  వేలంపాటలో అత్యధిక ధర పెట్టిన కొనుగోలు చేసిన కంపెనీ ఆక్వా స్పేస్ డెవెలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ పదహారున్నర ఎకరాలను సొంతం చేసుకుంది. తర్వాత స్థానంలో రాజపుష్ప రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. సత్యనారాయణరెడ్డి మన్నె దాదాపుగా ఎనిమిది ఎకరాలు సొంతం చేసుకున్నారు. ప్రెస్టిజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఏడున్నర ఎకరాలు.. ఇక శ్రీ చైతన్యకు చెందిన వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏడున్నర ఎకరాలు కొనుగోలు చేసింది. హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎకరం స్థలాన్ని దక్కించుకుంది. దాదాపుగా పదిహేడు ఎకరాలు కొన్న అక్వా స్పేస్ సంస్థ మైహోం గ్రూప్‌నకు చెందినది. ఎకరం కొన్న హైమా డెవలపర్స్ కూడా వారిదే. మొత్తంగా రూ. ఐదు వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం భూముల వేలం వేస్తోంది. 

రెండో దశ ల్యాండ్‌ పార్సిల్స్‌ అమ్మకాలకు మరో మూడు రోజుల తర్వాత నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ సారి కూడా భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోటీ పడే అవకాశం ఉంది. స్థలాలన్నీ  సామాన్యులు కొనుగోలు చేసేంత చిన్నవి కావు.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉంటాయి. అందుకే వాటికి ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget