అన్వేషించండి

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

Telangana Congress News: శుక్రవారం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క, మధుయాస్కి గౌడ్ విడివిడిగా మీడియాతో మాట్లాడారు.

Revanth Reddy Comments: తెలంగాణలో కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ముందస్తుగానే రైతు బంధు నిధులను ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తున్నారని ఆరోపించారు. కమీషన్ల కోసం రైతు బంధు నిధులు కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో తాము శనివారం ఎన్నికల కమిషనర్ ను కలుస్తామని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్‌ భూములను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసే పక్రియ జరుగుతుందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ లో మార్పులు జరుగుతున్నాయని రేవంత్ ఆరోపించారు.

ఆపద్ధర్మ ప్రభుత్వం అధికార దుర్వినియోగం - భట్టి
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు తెలంగాణ ప్రజలకు భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీపై ఉన్న అభిమానంతో ప్రజలు తమ పక్షాన నిలిచారని భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. చాలా సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ధరణిలో తప్పుడుగా నమోదు చేస్తోందని అన్నారు. ఆ తర్వాత వేరే వ్యక్తుల పేర్ల మీదకు మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ జరిగే సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్రమతంగా ఉండాలని భట్టి కోరారు. గత ఎన్నికల కౌంటింగ్ సమయంలో కూడా ధర్మపురి, మంచిర్యాల, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, హుజూర్‌నగర్ లో ఇబ్బందులు నెలకొన్నాయని అన్నారు. ప్రస్తుతం కోర్టులల్లో కేసులు కూడా ఇంకా నడుస్తున్నాయని గుర్తు చేశారు. కాబట్టి, కౌంటింగ్ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

సొమ్ము ప్రగతి భవన్ కు - మధుయాస్కి
ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ ను ఖాళీ చేసే పనిలో ఉన్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కి గౌడ్ ఆరోపించారు. ప్రగతి భవన్ లో ఉన్న సొమ్ము మొత్తం ఫాం హౌజ్ కి తరలించుకుపోతున్నారని వ్యాఖ్యలు చేశారు. అంతేకాక, ఓడిపోతామనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిలో ఉన్న భూములను రాత్రికి రాత్రే పేర్లు మారుస్తున్నారని ఆరోపించారు. మధుయాష్కీగౌడ్ శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయేది తెలంగాణ ప్రజల విజయం అని.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget