అన్వేషించండి

Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్‌, ముచ్చటగా మూడోసారి

జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్‌ ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. మొన్నటికి మొన్న దిల్లీ వెళ్లి పలువురు రాజకీయ నాయకులతో మాట్లాడిన కేసీఆర్ ఇవాళ దేవగౌడతో భేటీ కానున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. నేరుగా దేవెగడ నివాసానికి చేరుకొని లంచ్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. రాష్ట్రాలను బలహీన పరిచేలా బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు, దేశంలో ఉన్న సమస్యలు, జాతీయ రాజకీయాల్లో రావాల్సిన మార్పులపై ఇద్దరి మధ్య డిస్కషన జరగనుంది. భవిష్యత్‌లో కీలక పాత్ర పోషించాలంటే అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా మాట్లాడుకోనున్నారు. ఈ భేటీలో దేవెగౌడతోపాటు కుమారస్వామి కూడా పాల్గోనున్నారు.  

వీళ్లిద్దరి మధ్య రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. దీన్నే అవకాశంగా తీసుకొన ప్రాంతీయ పార్టీల సత్తాను కేంద్రానికి తెలియజేసేలా వ్యూహాన్ని రెడీ చేయాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా కొన్ని నెలల నుంచి వివిధ రాజకీయా పార్టీలు, వర్గాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. మొన్నటికి మొన్న దిల్లీ కూడా వెళ్లి వచ్చారు. అవకాశం చిక్కినప్పుడల్లా కేంద్ర విధానాలను తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. 

కేసీఆర్‌ బెంగళూరు టూర్ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన అభిమానులు. బెంగళూరులో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ్‌కి నేత వస్తున్నాడని... సాదరస్వాగతం పలుగుతోంది.  

ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ వస్తున్న టైంలో సీఎం కేసీఆర్ బెంగళూరు టూర్ పెట్టుకోవడం చాలా చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో జరిగే సమావేశానికి ప్రధానమంత్రి ఇవాళ రానున్నారు. గత మూడు పర్యాయాలుగా ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌ గైర్హాజరవుతున్నారు. 2020 నవంబరు 28న హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను ప్రధాని సందర్శించినప్పుడు మొదటి సారి సీఎం కేసీఆర్‌ వెళ్లలేదు. ఈ అంశం కూడా అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ప్రధాని కార్యాలయమే సీఎం కేసీఆర్‌ను వద్దని చెప్పి సమాచారం ఇచ్చిందని... అందుకే వెళ్లలేదని రాష్ట్ర ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. 

ముచ్చింతల్‌లో సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాష్కరణకు ఫిబ్రవరి 5న ప్రధాని వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. అప్పుడు ఆయన వచ్చి రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏ కార్యక్రమంలో కూడా కేసీఆర్ కనిపించలేదు. అనారోగ్యం కారణంగానే ఈ టూర్‌కు దూరంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు కూడా ప్రధాని టూర్‌ వారం రోజుల క్రితమే ఖరారైంది. అయినా సీఎం కేసీఆర్‌ ఈ టూర్‌లో పాల్గొనడం లేదు. దీనిపై మరోసారి బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం నడిచే ఛాన్స్ ఉంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Embed widget