అన్వేషించండి

Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్‌, ముచ్చటగా మూడోసారి

జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్‌ ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. మొన్నటికి మొన్న దిల్లీ వెళ్లి పలువురు రాజకీయ నాయకులతో మాట్లాడిన కేసీఆర్ ఇవాళ దేవగౌడతో భేటీ కానున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. నేరుగా దేవెగడ నివాసానికి చేరుకొని లంచ్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. రాష్ట్రాలను బలహీన పరిచేలా బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు, దేశంలో ఉన్న సమస్యలు, జాతీయ రాజకీయాల్లో రావాల్సిన మార్పులపై ఇద్దరి మధ్య డిస్కషన జరగనుంది. భవిష్యత్‌లో కీలక పాత్ర పోషించాలంటే అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా మాట్లాడుకోనున్నారు. ఈ భేటీలో దేవెగౌడతోపాటు కుమారస్వామి కూడా పాల్గోనున్నారు.  

వీళ్లిద్దరి మధ్య రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. దీన్నే అవకాశంగా తీసుకొన ప్రాంతీయ పార్టీల సత్తాను కేంద్రానికి తెలియజేసేలా వ్యూహాన్ని రెడీ చేయాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా కొన్ని నెలల నుంచి వివిధ రాజకీయా పార్టీలు, వర్గాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. మొన్నటికి మొన్న దిల్లీ కూడా వెళ్లి వచ్చారు. అవకాశం చిక్కినప్పుడల్లా కేంద్ర విధానాలను తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. 

కేసీఆర్‌ బెంగళూరు టూర్ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన అభిమానులు. బెంగళూరులో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ్‌కి నేత వస్తున్నాడని... సాదరస్వాగతం పలుగుతోంది.  

ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ వస్తున్న టైంలో సీఎం కేసీఆర్ బెంగళూరు టూర్ పెట్టుకోవడం చాలా చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో జరిగే సమావేశానికి ప్రధానమంత్రి ఇవాళ రానున్నారు. గత మూడు పర్యాయాలుగా ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌ గైర్హాజరవుతున్నారు. 2020 నవంబరు 28న హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను ప్రధాని సందర్శించినప్పుడు మొదటి సారి సీఎం కేసీఆర్‌ వెళ్లలేదు. ఈ అంశం కూడా అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ప్రధాని కార్యాలయమే సీఎం కేసీఆర్‌ను వద్దని చెప్పి సమాచారం ఇచ్చిందని... అందుకే వెళ్లలేదని రాష్ట్ర ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. 

ముచ్చింతల్‌లో సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాష్కరణకు ఫిబ్రవరి 5న ప్రధాని వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. అప్పుడు ఆయన వచ్చి రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏ కార్యక్రమంలో కూడా కేసీఆర్ కనిపించలేదు. అనారోగ్యం కారణంగానే ఈ టూర్‌కు దూరంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు కూడా ప్రధాని టూర్‌ వారం రోజుల క్రితమే ఖరారైంది. అయినా సీఎం కేసీఆర్‌ ఈ టూర్‌లో పాల్గొనడం లేదు. దీనిపై మరోసారి బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం నడిచే ఛాన్స్ ఉంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jupally Krishna Rao: ప్రోటోకాల్ పక్కనపెట్టి, సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం..
ప్రోటోకాల్ పక్కనపెట్టి, సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం..
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. తుది తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. తుది తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
Ganja Seized: బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
Hyderabad Biryani:బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 

వీడియోలు

Delhi Capitals Mitchell Starc IPL 2026 | మరికొన్ని మ్యాచ్‌లకు స్టార్క్ దూరం | ABP Desam
Vaibhav Suryavamshi MI vs RR IPL 2026 | బుమ్రా బౌలింగ్ లో వైభవ్ మెరుపులు | ABP Desam
IPL 2026 Shubman Gill Back in Nets | గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంట్రీ | ABP Desam
IPL 2026 RR VS MI Result | రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్ విజయం | ABP Desam
Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Share Market: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
Constable Revathi: కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!
కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Naga Vamsi : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
IPL 2026 RR VS MI Result Update: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
Embed widget