అన్వేషించండి

Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్‌, ముచ్చటగా మూడోసారి

జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్‌ ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. మొన్నటికి మొన్న దిల్లీ వెళ్లి పలువురు రాజకీయ నాయకులతో మాట్లాడిన కేసీఆర్ ఇవాళ దేవగౌడతో భేటీ కానున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. నేరుగా దేవెగడ నివాసానికి చేరుకొని లంచ్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. రాష్ట్రాలను బలహీన పరిచేలా బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు, దేశంలో ఉన్న సమస్యలు, జాతీయ రాజకీయాల్లో రావాల్సిన మార్పులపై ఇద్దరి మధ్య డిస్కషన జరగనుంది. భవిష్యత్‌లో కీలక పాత్ర పోషించాలంటే అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా మాట్లాడుకోనున్నారు. ఈ భేటీలో దేవెగౌడతోపాటు కుమారస్వామి కూడా పాల్గోనున్నారు.  

వీళ్లిద్దరి మధ్య రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. దీన్నే అవకాశంగా తీసుకొన ప్రాంతీయ పార్టీల సత్తాను కేంద్రానికి తెలియజేసేలా వ్యూహాన్ని రెడీ చేయాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా కొన్ని నెలల నుంచి వివిధ రాజకీయా పార్టీలు, వర్గాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. మొన్నటికి మొన్న దిల్లీ కూడా వెళ్లి వచ్చారు. అవకాశం చిక్కినప్పుడల్లా కేంద్ర విధానాలను తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. 

కేసీఆర్‌ బెంగళూరు టూర్ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన అభిమానులు. బెంగళూరులో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ్‌కి నేత వస్తున్నాడని... సాదరస్వాగతం పలుగుతోంది.  

ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ వస్తున్న టైంలో సీఎం కేసీఆర్ బెంగళూరు టూర్ పెట్టుకోవడం చాలా చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో జరిగే సమావేశానికి ప్రధానమంత్రి ఇవాళ రానున్నారు. గత మూడు పర్యాయాలుగా ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌ గైర్హాజరవుతున్నారు. 2020 నవంబరు 28న హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను ప్రధాని సందర్శించినప్పుడు మొదటి సారి సీఎం కేసీఆర్‌ వెళ్లలేదు. ఈ అంశం కూడా అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ప్రధాని కార్యాలయమే సీఎం కేసీఆర్‌ను వద్దని చెప్పి సమాచారం ఇచ్చిందని... అందుకే వెళ్లలేదని రాష్ట్ర ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. 

ముచ్చింతల్‌లో సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాష్కరణకు ఫిబ్రవరి 5న ప్రధాని వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. అప్పుడు ఆయన వచ్చి రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏ కార్యక్రమంలో కూడా కేసీఆర్ కనిపించలేదు. అనారోగ్యం కారణంగానే ఈ టూర్‌కు దూరంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు కూడా ప్రధాని టూర్‌ వారం రోజుల క్రితమే ఖరారైంది. అయినా సీఎం కేసీఆర్‌ ఈ టూర్‌లో పాల్గొనడం లేదు. దీనిపై మరోసారి బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం నడిచే ఛాన్స్ ఉంది.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget