అన్వేషించండి

Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్‌, ముచ్చటగా మూడోసారి

జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్‌ ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. మొన్నటికి మొన్న దిల్లీ వెళ్లి పలువురు రాజకీయ నాయకులతో మాట్లాడిన కేసీఆర్ ఇవాళ దేవగౌడతో భేటీ కానున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. నేరుగా దేవెగడ నివాసానికి చేరుకొని లంచ్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. రాష్ట్రాలను బలహీన పరిచేలా బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు, దేశంలో ఉన్న సమస్యలు, జాతీయ రాజకీయాల్లో రావాల్సిన మార్పులపై ఇద్దరి మధ్య డిస్కషన జరగనుంది. భవిష్యత్‌లో కీలక పాత్ర పోషించాలంటే అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా మాట్లాడుకోనున్నారు. ఈ భేటీలో దేవెగౌడతోపాటు కుమారస్వామి కూడా పాల్గోనున్నారు.  

వీళ్లిద్దరి మధ్య రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. దీన్నే అవకాశంగా తీసుకొన ప్రాంతీయ పార్టీల సత్తాను కేంద్రానికి తెలియజేసేలా వ్యూహాన్ని రెడీ చేయాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా కొన్ని నెలల నుంచి వివిధ రాజకీయా పార్టీలు, వర్గాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. మొన్నటికి మొన్న దిల్లీ కూడా వెళ్లి వచ్చారు. అవకాశం చిక్కినప్పుడల్లా కేంద్ర విధానాలను తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. 

కేసీఆర్‌ బెంగళూరు టూర్ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన అభిమానులు. బెంగళూరులో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ్‌కి నేత వస్తున్నాడని... సాదరస్వాగతం పలుగుతోంది.  

ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ వస్తున్న టైంలో సీఎం కేసీఆర్ బెంగళూరు టూర్ పెట్టుకోవడం చాలా చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో జరిగే సమావేశానికి ప్రధానమంత్రి ఇవాళ రానున్నారు. గత మూడు పర్యాయాలుగా ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌ గైర్హాజరవుతున్నారు. 2020 నవంబరు 28న హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను ప్రధాని సందర్శించినప్పుడు మొదటి సారి సీఎం కేసీఆర్‌ వెళ్లలేదు. ఈ అంశం కూడా అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ప్రధాని కార్యాలయమే సీఎం కేసీఆర్‌ను వద్దని చెప్పి సమాచారం ఇచ్చిందని... అందుకే వెళ్లలేదని రాష్ట్ర ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. 

ముచ్చింతల్‌లో సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాష్కరణకు ఫిబ్రవరి 5న ప్రధాని వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. అప్పుడు ఆయన వచ్చి రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏ కార్యక్రమంలో కూడా కేసీఆర్ కనిపించలేదు. అనారోగ్యం కారణంగానే ఈ టూర్‌కు దూరంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు కూడా ప్రధాని టూర్‌ వారం రోజుల క్రితమే ఖరారైంది. అయినా సీఎం కేసీఆర్‌ ఈ టూర్‌లో పాల్గొనడం లేదు. దీనిపై మరోసారి బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం నడిచే ఛాన్స్ ఉంది.  

టాప్ హెడ్ లైన్స్

Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
GHMC Elections Old City Hyderabad: గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Embed widget