అన్వేషించండి

Revanth Reddy Delhi Tour: బుధవారం ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి! మంత్రివర్గ విస్తరణతోపాటు కేంద్రంతో తేల్చుకోవాల్సిన అంశాలపై చర్చ!

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌ -2 విస్తరణ కేంద్రంతో చర్చిస్తారు. కేబినెట్ విస్తరణపై కూడా అధిష్ఠానంతో మాట్లాడుతారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మెట్రో ఫేజ్-2పై చర్చలు.
  • కేరళ విజయంతో రేవంత్ రెడ్డికి అధిష్ఠానంలో ప్రాధాన్యత పెరిగింది.
  • రెండు ఖాళీలను భర్తీ చేస్తూ మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చు.
  • టీపీసీసీ టీమ్, వర్కింగ్ ప్రెసిడెంట్లను త్వరలో ప్రకటించే అవకాశం.

Revanth Reddy Delhi Tour: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు మొదలయ్యాయి. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారనే ప్రచారంతో కాంగ్రెస్ సీనియర్ నేతలంతా హై అలర్ట్ అయ్యారు. నౌ అర్ నెవర్ అన్నట్టు కీలక పదవులు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి పర్యటన మాత్రం మంత్రివర్గ విస్తరణతోపాటు కేంద్రం వద్ద చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించనున్నారు. పనిలో పనిగా పార్టీలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టబోతున్నారని టాక్ నడుస్తోంది. 

మెట్రో ఫేజ్‌-2 విస్తరణపై కేంద్రంతో చర్చలు 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన అజెండా హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2కు సంబంధించిన అనుమతులు, నిధుల సమీకరణ. నగర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రూపొందించిన ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్‌ సాధించడం రేవంత్ రెడ్డి లక్ష్యం. ఇందు కోసం ఆయన పలువురు కేంద్రమంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అవసరమైన సహకారం కోరనున్నారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న నిధులు, కొత్త ప్రాజెక్టుల మంజూరుపై ఈ భేటీలు కీలక పాత్ర పోషించనున్నాయి. 

Also Read: జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయా? -కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు - బీజేపీ ఊరుకుంటుందా?

కేరళ విజయంతో పెరిగిన ప్రాధాన్యత 

ఈ ఢిల్లీ పర్యటనకు మరో ముఖ్యమైన రాజకీయ కారణం కూడా ఉంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతోంది. ఈ విజయంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో ప్రచారం నిర్వహించిన రేవంత్ , అక్కడ పార్టీ విజయానికి తనదైన శైలిలో సహకరించారని అంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ముఖ్యమంత్రి రేసులో ఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రేవంత్ రెడ్డికి వేణుగోపాల్‌కు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా, ఈ విజయం రేవంత్ రెడ్డికి అధిష్ఠానం వద్ద మరింత పట్టును తెచ్చిపెట్టింది. 

Also Read: తెలంగాణ వాసులకు చల్లటి వార్త.. 2, 3 రోజులపాటు దిగిరానున్న పగటి ఉష్ణోగ్రతలు

కేబినెట్ విస్తరణ ఆశావహుల ఉత్కంఠ 

రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం రెండు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కొందరు మంత్రుల శాఖలను మార్చడం లేదా పని తీరు సరిగా లేని వారిని తొలగించే అవకాశం ఉందనే చర్చ గట్టిగానే సాగుతోంది. మే నెలలోనే ఈ మార్పులు ఉండవచ్చని సమాచారం. 

Also Read: చంద్రబోస్ సోదరుడి మృతిపై అనుమానాలు - శరీరంపై గాయాలు... జీరో ఎఫ్ఐఆర్ నమోదు

మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి లాంటి వారు తమకు గతంలో అధిష్టానం హామీ ఇచ్చిందని, ఈసారి మంత్రిపదవి ఖాయమంటున్నారు. ఎమ్మెల్సీ విజయశాంతి పేరు కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్టీ కోటాలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ లేదా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఆది శ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావు లాంటి నేతలు కూడా మంత్రి పదవి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ప్రక్షాళన ఉంటుందని మరో వాదన కూడా ఉంది. అయితే ఖాళీగా ఉన్న రెండు స్థానాలను వెంటనే భర్తీ చేయాలని సీఎం పట్టుబడుతున్నారు. 

పార్టీ ప్రక్షాళనకు ప్రయత్నాలు 

కేవలం కేబినెట్ మాత్రమే కాకుండా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీమ్‌ను కూడా మే నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉంది. సామాజిక న్యాయం పాటించేలా మాదిగ, లంబాడ, మైనారిటీ వర్గాల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని అధిష్ఠానం యోచిస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్‌గా కొనసాగుతుండగా ఇతర కమిటీల్లో కొత్త ముఖాలకు చోటు కల్పించనున్నారు. 

Also Read: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. సిటీలో 3 కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు

Frequently Asked Questions

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరగనుంది?

రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం రెండు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కొందరు మంత్రుల శాఖలను మార్చే లేదా తొలగించే అవకాశం ఉంది. మే నెలలోనే ఈ మార్పులు ఉండవచ్చని సమాచారం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ప్రధాన అజెండా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సంబంధించిన అనుమతులు, నిధుల సమీకరణ. అలాగే, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అవసరమైన సహకారం కేంద్రం నుంచి కోరనున్నారు.

కేరళ ఎన్నికల విజయం రేవంత్ రెడ్డికి ఎలా ఉపయోగపడింది?

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ విజయం అధిష్ఠానం వద్ద ఆయనకు మరింత పట్టును తెచ్చిపెట్టింది.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎప్పుడు ప్రకటించబడుతుంది?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీమ్‌ను మే నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉంది. సామాజిక న్యాయం పాటించేలా వివిధ వర్గాల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని యోచిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget