అన్వేషించండి

Telangana Rains: రాజకీయాలు వద్దు వరద సహాయక చర్యలపై దృష్టి పెట్టండి- కేసీఆర్‌కు బీజేపీ లీడర్ల సూచన

వాతావరణ శాఖ ముందస్తు సూచనలు చేసినా కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోకుండా... సహాయక చర్యలను ముమ్మరం చేయడం లేదని ఆరోపించింది బీజేపీ. ఇప్పటికైనా మేల్కొని ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించాలని హితవు పలికింది.

వర్షాలతో తెలంగాణ అతలాకుతలమవుతున్నా సహాయక చర్యలు ఎక్కడా కనిపించడం లేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. రాజకీయాలు పక్కన పెట్టి సీఎం వరద బాధిత ప్రాంతాలపై దృష్టి పెట్టాలని రిక్వస్ట్ చేశారు బండి సంజయ్‌. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. ముంపు బాధిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలన్నారు. 

తెలంగాణలో మరో రెండు మూడు రోజులు వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉందని తెలుస్తోందన్నారు బండి సంజయ్‌. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్సవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమైపోయాయన్నారు. అనేక ప్రాంతాల్లో నీటిలోనే ప్రజలు జీవినసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా జరిగినట్టు తమకు సమాచారం వస్తుందన్నారు బండి సంజయ్. 

మరికొన్ని రోజులు వర్షాలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాక హెచ్చరిస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు బండి సంజయ్. అధికార యంత్రాంగాన్ని పూర్తిగా సన్నద్దం చేయడంలో సర్కారు విఫలమైందని ఆరోపించారు. ఇది ఆందోళన కలిగిస్తోందని అన్నారు. వరదతో కడెం ప్రాజెక్టు వద్ద పరిస్థితి భయానకంగా ఉన్నా ప్రభుత్వం అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.   

ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్య వైఖరిని, రాజకీయాలను పక్కన పెట్టి వరద సాయంపై దృష్టి పెట్టాలని సూచించారు బండి సంజయ్. తక్షణమే కడెం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరదను అంచనా వేస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండటంతోపాటు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రాణ, పంట, ఆస్తి నష్టం వాటిల్లికుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు జగిత్యాల, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో ప్రజలకు ఆహార, తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేనందున నిత్యావసరాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

వర్షాల కారణంగా శిథిలావస్థలోనున్న అనేక భవనాలు నాని కూలిపోయే ప్రమాదం ఏర్పడినందున వెంటనే వాటిని గుర్తించి అందులో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు బండి సంజయ్‌. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించే అవకాశాలున్నాయన్నారు. వరద అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను తరలించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సహాయ చర్యల్లో నిమగ్నమయ్యేలా చెయ్యాలని అభిప్రాయపడ్డారు. వెంటనే అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కంట్రోల్ రూంలు, హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసి సహాయ చర్యలను పర్యవేక్షించాలన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget