అన్వేషించండి

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా, ఆ బిల్లుకు సభ ఆమోదం

TS Assembly News: తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ఆమోదం లభించింది.

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి (ఫిబ్రవరి 13)కు వాయిదా పడ్డాయి. నేటి సభలో నీటిపారుదల విషయంలో మంత్రి ఉత్తమ్ ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం తెలిపారు. తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. 

అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన తీర్మానంపై చర్చ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో భాగంగా సాగునీటి విభాగాన్ని భ్రష్టుపట్టించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అంతేకాక, అప్పట్లో నీటిపారుదల శాఖ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ రాసిన లేఖను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చదివి వినిపించారు. కృష్ణా నది ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు తాము అంగీకరిస్తున్నామని ఆ లేఖలో రాసినట్లుగా ఉత్తమ్ చదివి వినిపించారు. అయితే, చర్చ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్మానంపై కాక.. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీదకు కూడా మళ్లింది. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏపీకి అనుకూలంగా వ్యవహరించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలు కాలరాసేలా రాయలసీమ ప్రాజెక్టు ప్రారంభం చేశారని.. అందుకే కేసీఆరే సహకరించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 

ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగం క్లిప్ ను కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శింపజేసింది. ఆ క్లిప్పింగ్ లో సీఎం జగన్ మాట్లాడిన ప్రకారం.. తెలంగాణ నుంచి వాళ్లు నీళ్లు కిందకి వదిలితే తప్ప, మనకు నీళ్లు రాని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఉందనే కేసీఆర్.. ఓ అడుగు ముందుకేసి తెలంగాణ నుంచి నీళ్లు తీసుకునేందుకు ఏపీకి అంగీకారం తెలిపారు. మొత్తం 8 జిల్లాలు.. అందులో రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు ఉన్నాయి. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా నుంచి పశ్చిమ గోదావరి వరకు కృష్ణా ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. మనం కోరగానే.. తెలంగాణ నుంచి ఏపీ వాళ్లు నీళ్లు తీసుకునేందుకు కేసీఆర్ ఒప్పుకున్నారంటూ సీఎం జగన్ గతంలో మాట్లాడిన విషయాన్ని సభలో చూపించారు. ఏపీకి ఇచ్చినందుకు సీఎం జగన్ అప్పటి కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పడం కూడా అందులో ఉంది. 

దీంతో తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను కేసీఆర్ ఏకపక్షంగా ఏపీకి ఇచ్చేశారని.. తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. చర్చ అనంతరం ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించవద్దని పెట్టిన తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ప్రసాద్‌ ప్రకటించారు. అనంతరం సభను మంగళవారానికి (ఫిబ్రవరి 12) వాయిదా వేశారు. అయితే, ఈ నెల 13న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు సభ్యులను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. దీనికి సంబంధించి సభ్యులకు లేఖలు పంపామని.. వ్యక్తిగత ఆహ్వానంగా భావించి అందరూ రావాలని ఉత్తమ్ పిలుపు ఇచ్చారు.

హుక్కా పార్లర్లపై నిషేధంపై బిల్లుకూ అసెంబ్లీ ఆమోదం

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది. అనంతరం హుక్కా పార్లర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్‌ అండ్‌ అదర్‌ టొబాకో ప్రొడక్ట్స్‌ అమెండ్‌మెంట్‌ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్‌ బాబు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే బిల్లును సభ ఏకగ్రీవంగా శాసన సభ ఆమోదించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Amaravati Loans: అమరావతి అప్పులు ఏపీ రుణపరిమితిలోకి రావు -  చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్
అమరావతి అప్పులు ఏపీ రుణపరిమితిలోకి రావు - చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్
Rohit Sharma Lands In Mumbai: దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Amaravati Loans: అమరావతి అప్పులు ఏపీ రుణపరిమితిలోకి రావు -  చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్
అమరావతి అప్పులు ఏపీ రుణపరిమితిలోకి రావు - చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్
Rohit Sharma Lands In Mumbai: దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
Telugu TV Movies Today: చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Rammohan Naidu News:శ్రీకాకుళం జిల్లాపై రామ్మోహన్ నాయుడు స్పెషల్ ఫోకస్- ఫిషింగ్‌ హార్బర్, జెట్టీలు ఏర్పాటుపై కేంద్రానికి లేఖ
శ్రీకాకుళం జిల్లాపై రామ్మోహన్ నాయుడు స్పెషల్ ఫోకస్- ఫిషింగ్‌ హార్బర్, జెట్టీలు ఏర్పాటుపై కేంద్రానికి లేఖ
Revanth Chit Chat: కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే స్థాయి నిజంగానే లేదు  - కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే స్థాయి నిజంగానే లేదు - కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Latest Crime News: హైదరాబాద్‌లోని హబ్సీగూడలో విషాదం- ఇద్దరు పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య 
హైదరాబాద్‌లోని హబ్సీగూడలో విషాదం- ఇద్దరు పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య 
Embed widget