అన్వేషించండి

Kasani Gnaneshwar: తెలంగాణలో టీడీపీ అవసరమా అన్న వారి నోళ్లు మూయిస్తాం: ABP దేశంతో కాసాని జ్ఞానేశ్వర్

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమంటున్నారు రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్.

తెలంగాణలో టిడిపి బలపడుతోంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమంటున్నారు రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. ABP దేశం ప్రత్యేక ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ మనసులో విషయాలు బయటపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కేవలం టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వల్ల మాత్రమే సాధ్యం కాలేదని, సకల జనుల సమ్మె, బంద్, నిరసనలు, ప్రజా ఉద్యమాలతోనే తెలంగాణ సాధించుకుంటే.. ఇప్పుడు ఆ ఖ్యాతి కేసీఆర్ కుటుంబానికి మాత్రమే సొంతం అన్నట్లు వ్యవహరిస్తున్నారని జ్ఞానేశ్వర్ అన్నారు.

ఖమ్మం సభతో మా సత్తా చూపించామని, త్వరలో నిజామాబాద్ లో సైతం టిడిపి భారీ బహిరంగ సభ  ఏర్పాటు చేయబోతున్నామని, రాబోయే రోజుల్లో హైదరాబాద్ నడి బొడ్డున ఎవరూ ఊహించని స్థాయిలో లక్షలాది మందితో సభ నిర్వహించి మరోసారి తెలంగాణలో టిడిపి బలహీనపడిందన్న వాళ్ల నోళ్లను మూయిస్తామంటున్నారు. జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన తనకు ఇప్పుడు తెలంగాణలో టిడిపికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడం పెద్ద విషయం కాదన్నారు. ఏనిమిదేళ్ల తరువాత ఇక్కడ హడావుడి చేస్తున్నామని కొందరు మాట్లడుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో గెలిచిన 15 మంది ప్రజాప్రతినిధులను టిఆర్ఎస్ తనవైపు లాక్కుందని ఆరోపించారు. పొలిటికల్ గేమ్ లో భాగంగా టిడిపిని దెబ్బకొట్టాలని బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉందని విమర్శించారు. పార్టీ నుంచి నాయకులు మాత్రమే వారి లబ్ధికోసం ఇతర పార్టీల మాయలో పడ్డారని, తెలంగాణలో టిడిపి కార్యకర్తలు, జనం ఇంకా టిడిపి వెంట ఉన్నారని  జ్ఞానేశ్వర్ ధీమా వ్యక్తం చేసారు. 
రైతు కుంటుంబంలో పుట్టిన తాను వార్డు నెంబర్ నుండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడి స్దాయికి ఎదిగానేంటే అది తన కష్టం, ప్రజాధరణతోనే సాధ్యమైందన్నారు. మా కుటుంబానికి అప్పట్లో 24 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ పంటలు పండే అవకాశం లేక తాను ఆటో నడిపి కుటుంబాన్ని పోషించాల్సి వచ్చిందని తెలిపారు. ఒక్కోరోజు ఆటో నడిపి తెచ్చిన డబ్బు ఇంట్లో ఇస్తే తప్ప ఆరోజు తిండి ఉండేది కాదన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేసానని, ఆ సందర్భంలో భూములు, వాటి లెక్కలు ఇలా వివరంగా తెలుసుకుని, కష్టపడి సంపాదించానని, ఇప్పడు అలా సంపాదించి కొన్న భూములు కోట్లాది రూపాయలు ధరలు పలుకుతున్నాయే తప్ప తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదన్నారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. 

తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో టిడిపి స్దబ్దుగా ఉన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు ఆయా ప్రాంతాలపై ప్రత్యక దృష్టి పెట్టాం. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టిడిపి అభ్యర్దులు ఎన్నికల బరిలో దిగడంతోపాటు విజయం సాధించడం ఖాయమన్నారు. తెలంగాణాలో టిడిపి అవసరమా అనే వాళ్లకు నా ధీటైన సమాధానం ఒక్కటే , అదే ఇప్పటివరకూ తెలంగాణలో జరిగిన అభివృద్ది కేవలం కట్టు కథలు మాత్రమే. లక్షల కోట్లు అప్పులు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసిఆర్ సర్కారు ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో నిర్వీర్యం అయ్యింది. అందుకే రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా టిడిపి ఎదుగుతోందన్నారు. సీట్లు గెలవడం మాత్రమే కాదు తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అన్ని కులాలకు ప్రాధాన్యత నిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ధీమా వ్యక్తం చేసారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget