అన్వేషించండి

Chandrababu: తెలంగాణలో మళ్లీ నిలదొక్కుకుంటాం, టీడీపీకి పూర్వవైభవం గ్యారంటీ - చంద్రబాబు

హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.

తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని, ఏదో ఒకరోజు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందంటే.. అది తెలుగు దేశం ప్రభుత్వం వేసిన పునాది అని చెప్పుకున్నారు. తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకపోయినా పార్టీ శ్రేణుల్లో మాత్రం ఉత్సాహం బాగుందని అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.

ఎన్టీఆర్‌, పీవీ నరసింహారావు దేశానికి దశ దిశ చూపించారని చంద్రబాబు అన్నారు. టీడీపీ వచ్చిన తర్వాతే తెలుగువారి ప్రతిభ ప్రపంచానికి తెలిసిందని, ఇప్పుడు తెలుగు వారు ప్రపంచం నలుమూలలా ఉన్నారంటే అది తెలుగు దేశం పార్టీ ఘనతేనని చంద్రబాబు అన్నారు. అప్పట్లో తాను ఐటీ అభివృధ్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి ప్రతి అడుగులో టీడీపీ వేసి ముద్ర ఉందని అన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగువారి కోసం టీడీపీ పనిచేస్తుందని చెప్పారు. ప్రతి తెలుగువాడిని సంపన్నుడిని చేయడమే టీడీపీ లక్ష్యం అని చంద్రబాబు చెప్పారు. 

దేశంలోని వంద ప్రధాన నగరాల్లో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయని తెలిపారు. మరోసారి తనను టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి తాను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు వచ్చానని చెప్పారు. చంద్రబాబుకు రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, పలువు సీనియర్‌ నేతలు ఘన స్వాగతం పలికారు.

ఘన స్వాగతం అనంతరం తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చర్చలు జరిపారు. దీంతో పొత్తు వార్తలకు మరింత బలం వచ్చినట్లు అయింది. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు సహా తెలంగాణలో పార్టీ పరిస్థితులపై రాష్ట్ర నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చించినట్లు సమాచారం.

మూడు రోజుల క్రితమే ఢిల్లీకి చంద్రబాబు

గత శనివారం (జూన్ 3) ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో మొదలైన ఈ సమావేశం దాదాపు 40 నిమిషాలపాటు కొనసాగింది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చించారు. ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు కావడంతో పొత్తుల విషయంపై చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారని ఏపీలో చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉండటంతో ఎన్డీఏలోకి కొత్త పార్టీలను ఆహ్వానించడంతో పాటు పాత మిత్రులను తమతో కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
Telugu TV Movies Today: డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
Telugu TV Movies Today: డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Embed widget