అన్వేషించండి

Telangana LRS Extension: తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్ గడువు పెంపు- మే 3 లోపు పూర్తి చేసుకునే ఛాన్స్ 

Telangana LRS Extension:తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ గడువును ప్రభుత్వం మరో మూడు రోజులు పెంచింది. ఈ మేరకు రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana LRS Deadline : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్‌ రెగ్యులరైజేషన్ స్కీమ్‌ గడువును పెంచింది. ఈ ఎల్‌ఆర్‌ఎస్‌లో భాగంగా భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అదే టైంలో సాంకేతికంగా కూడా ఫీజులు చెల్లించడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నార. అందుకే ప్రజల నుంచి వస్తున్న స్పందనతోపాటు క్లియర్ చేయాల్సిన ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణ రాష్ట్రంలో అక్రమ లేఅవుట్‌లు, ప్లాట్లు క్రమబద్దీకరించేందుకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌ చేసుకునే ఫెసిలిటీ కల్పించింది. ఈ గడువు ఏప్రిల్‌ 30తో ముగిసింది. దీన్ని మరో మూడు రోజులు అంటే మే 3 వరకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు రాత్రి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు. 

క్రమబద్ధీకరణతో ఏం ప్రయోజనం 

అక్రమ లేఅవుట్‌లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో ల్యాండ్ రెగ్యులలరైజేషన్ స్కీమ్‌ను తీసుకొచ్చారు. కొంత ఫైన్‌తో అక్రమ లేఅవుట్‌లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ఆమోదిస్తుంది. అలాంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రణాళికాబద్ధంగా  అభివృద్ధి చేసేందుకు అంగీకరిస్తుంది. అందుకే ఈ స్కీమ్ కింద భారీ సంఖ్యలో ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు. 

ఇదే ఆఖరి ఛాన్స్ అంటున్న అధికారులు

2025 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం ఎల్‌ఆర్ఎస్‌ కింద ఫీజులు చెల్లించే వారికి 25 శాతం రాయితీ ప్రకటించింది. ఈ రాయితీ మార్చి 31 నాటికి చెల్లించే వారికి మాత్రమే వర్తిస్తుందని మొదట పేర్కొంది. అయితే చాలా మంది దరఖాస్తుదారులు సాంకేతిక సమస్యలు, వెబ్‌సైట్‌లో లోపాలు, ఇతర అడ్డంకుల వల్ల చెల్లింపులు చేయలేకపోయారు. వారి అభ్యర్థన మేరకు గడువును ఏప్రిల్ 30 వరకు పెంచారు. అయినా ఇంకా చాలా మంది దరఖాస్తు చేసుకోలేదు. దీంతో మరో మూడు రోజులు ఆఖరి ఛాన్స్ ఇస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

తర్వాత దరఖాస్తు చేసే ఏమవుతుంది

ఈ పథకం కింద దరఖాస్తుదారులు రెగ్యులరైజేషన్ ఫీజుతోపాటు ప్రో-రాటా ఓపెన్ స్పేస్‌ ఛార్జీలను కూడా చెల్లించవచ్చు. ఈ రెండింటిపై 25 శాతం రాయితీ వస్తుంది. మే 3 లోపు చెల్లించే వాళ్లకే ఈ రాయితీ వర్తిస్తుంది. తర్వాత చెల్లిస్తే కచ్చితంగా వంద శాతం ఫీజు కట్టించుకుంటారు. 

ఈ స్కీమ్ నుంచి భారీగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆశించింది. చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో భారీ సంఖ్యలో క్రమబద్దీకరణకు వస్తారని ఆలోచించింది. మార్చి చివరి నాటికి రెండు లక్షల మంది దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించారు. ఏప్రిల్ 30 నాటికి మరో లక్షన్నర దరఖాస్తులు పరిష్కారం అవుతాయని అనుకుంటున్నారు. ఈ మూడు రోజుల గడువు పెంపుతో మరిన్ని దరఖాస్తులు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. 

దరఖాస్తుదారులకు సూచనలు 
ప్రభుత్వం దరఖాస్తుదారులకు మూడు రోజుల గడువులో చెల్లింపులు పూర్తి చేయాలని సూచించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ పోర్టల్‌ https://lrs.telangana.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ స్టేటస్‌ కూడా తెలుసుకోవచ్చు. సమస్యలు ఎదురైతే హెచ్‌ఎండీ ఫోన్ నెంబర్‌ 18005998838కి ఫోన్‌ చేసి సాయం పొందవచ్చు.  మేడే సెలవు అయినప్పటికీ ఈ పోర్టల్ పని చేస్తుందని అధికారులు చెబుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget