అన్వేషించండి

KTR On LRS : ఎల్ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలి - కాంగ్రెస్ అప్పటి డిమాండ్‌ను వెలుగులోకి తెచ్చిన కేటీఆర్ !

KTR On LRS : ఎల్ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ఇదే డిమాండ్ చేసిందన్నారు.


KTR demanded to make LRS free  :   ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్ ఆర్ ఎస్ కార్యక్రమం ద్వారా ప్లాట్ల రెగ్యులరైజేషన్ చేయాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ తో సహా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరు కూడా ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ప్రజల దగ్గర ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండానే రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం మార్గదర్శకాలు రూపొందించినప్పుడు, ఇదే కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడిన విషయాన్ని కేటీఆర్ సాక్షాలతో సహా మీడియా ముందు ఉంచారు.  

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.   అప్పటి సీఎల్పీ నేత ఇప్పటి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు ఎవరు ప్రభుత్వానికి డబ్బులు కట్టవద్దని,  రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని విమర్శించారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రజల జేబుల నుంచి డబ్బులను దోచుకోవడానికే ఎల్ఆర్ఎస్ స్కీం అమలు చేస్తున్నారని కెటిఅర్ మండిపడ్డారు.  ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద మార్చి 31వ తేదీ లోపల ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాలని దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్ కాల్స్ చేయడం జరుగుతుందని, మరీ ఇది రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగడం కాదా అన్నారు.
 
ఒక ఒకప్పుడు నో ఎల్ఆర్ఎస్ - నో బీఆర్ఎస్ అన్న ఉత్తంకుమార్ రెడ్డి ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజలు నో కాంగ్రెస్ అంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అప్పుడు ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని తెలిపిన ఉత్తంకుమార్ రెడ్డి, ఈరోజు ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్ర ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బులు లాక్కోవడం పైన స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదే ఎల్ఆర్ఎస్ అంశం పైన మంత్రి సీతక్క మాట్లాడుతూ డబ్బులు దోచుకోవడానికే ఎఆర్ఎస్ పెట్టారని మాట్లాడింది, మరి ఈరోజు ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ కార్యక్రమం పైన కోర్టులో కేసు వేసిన మరో మంత్రి కోమటిరెడ్డి ఇప్పుడు ఆ కేసును వెనక్కి తీసుకున్నారా లేదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరోసారి ఎల్ఆర్ఎస్ వద్దు అంటూ కేసు వేస్తారా అనే విషయాన్ని తెలియజేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలవడం కోసం అడ్డగోలుగా ఇచ్చిన హామీల అన్నింటిని తూ.చా తప్పకుండా అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న 25 లక్షల 44 వేలమంది లబ్ధిదారుల పైన కనీసం లక్ష రూపాయల చొప్పున భారాన్ని మోపేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. మొత్తం రాష్ట్ర ప్రజల నుంచి ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా 20వేల కోట్ల రూపాయలను దోచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. అధికారంలో లేనప్పుడు ఒక తీరుగా అధికారంలో ఉన్నప్పుడు మరొక తీరుగా  మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు,  మంత్రుల వైఖరి పైన కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. 

ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగేలా ఎల్ఆర్ఎస్ ను ఎలాంటి చార్జీలు లేకుండా అమలు చేసేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల ఆరవ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరసన కార్యక్రమాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని కోరుతూ ప్రతి జిల్లా కలెక్టర్ కి, అర్డీవోలకు ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా అందిస్తామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ) కార్యాలయం ముందు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) కార్యాలయం ముందు ప్రత్యేక నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ కార్యక్రమంలో ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించాలని, లేకుంటే భవిష్యత్తులో న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని కేటీఆర్ హెచ్చరించారు

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
KTR On Congress Ruling: తెలంగాణపై దరిద్రం దండయాత్ర.. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జిషీట్, కేటీఆర్ ఫైర్
తెలంగాణపై దరిద్రం దండయాత్ర.. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జిషీట్, కేటీఆర్ ఫైర్
Hyderabad Crime News: నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
Hydra AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భారీ ఊరట.. సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భారీ ఊరట.. సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
Panjaa Re Release: జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
Irumudi Collections : 200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
Gen Z నిజంగా అన్‌ఫిట్‌, 75% కంపెనీలకు కొత్త ఉద్యోగుల పని నచ్చడం లేదు: తాజా సర్వే
Gen Z నిజంగా అన్‌ఫిట్‌, 75% కంపెనీలకు కొత్త ఉద్యోగుల పని నచ్చడం లేదు: తాజా సర్వే
Tamil Nadu News: ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ పుతిన్‌తో 'యుద్ధం ముగిసింది' అని ఎందుకు అన్నారు? కారణం ఇదేనా?
నరేంద్ర మోదీ పుతిన్‌తో 'యుద్ధం ముగిసింది' అని ఎందుకు అన్నారు? కారణం ఇదేనా?
Embed widget