అన్వేషించండి

Rangareddy: తాగిన మత్తులో పెట్రోల్ బంక్ సిబ్బందితో గొడవ, పిడిగుద్దులతో కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు

Rangareddy News: నార్సింగిలో పెట్రోల్ బంక్ లో పని చేసే సంజయ్ ను చంపిన హంతకులను పట్టుకోవాలని గ్రామస్థులు ధర్నా చేశారు. పోలీసులు కలుగజేసుకుని నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు.

Rangareddy News: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం జరిగింది. గొడవ పడుతుంటే అడ్డుకోబోయిన వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపారు. ఈ దుర్ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకుని అరెస్టు చేయాలని, తగిన శిక్ష విధించాలని ధర్నా చేస్తున్నారు. 

బంక్ సిబ్బందిపై దాడి, హత్య

రంగారెడ్డి జిల్లా నార్సింగి జన్వాడలోని పెట్రోల్ బంక్ కు ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిపోవడం, ముగ్గురు యువకులు మద్యం మత్తులో తూలుతుండటంతో పెట్రోల్ బంక్ సిబ్బంది, పెట్రోల్ లేదని చెప్పారు. అయితే తాము చాలా దూరం వెళ్లాలని కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ బంక్ సిబ్బందిని బతిమాలాడారు. దీంతో బంక్ సిబ్బంది పెట్రోల్ పోశారు. ఆ తర్వాత డబ్బులు ఇచ్చే సమయానికి కార్డు పని చేయడం లేదంటూ ఆ ముగ్గురు వ్యక్తులు బుకాయించేందుకు ప్రయత్నించారు. కార్డు పని చేయకపోతే క్యాష్ ఇవ్వాలని బంక్ సిబ్బంది అడిగారు. 

మమ్మల్నే అడ్డుకుంటావా అంటూ పిడిగుద్దులు

మమ్మల్నే అడుగుతావా.. మాకే ఎదురుతిరుగుతావా అంటూ ఆ ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ బంక్ క్యాషియర్ పై దాడికి దిగారు. తన తోటి సిబ్బందిని కొడుతుండటాన్ని చూసిన సంజయ్.. వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. క్యాషియర్ ను కొట్టవద్దని చెబుతూ వారిని అడ్డుకోబోయాడు. మాకే అడ్డు వస్తావా అంటూ ఆ ముగ్గురు కలిసి సంజయ్ ను విపరీతంగా కొట్టారు. పిడిగుద్దులతో ముఖంపై తీవ్రంగా దాడి చేశారు. వారు దాడిలో గాయపడ్డ సంజయ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సంజయ్ పడిపోవడాన్ని చూసిన ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుండి పారిపోయారు. ఇదంతా పెట్రోల్ బంక్ లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. బంక్ సిబ్బంది వెంటనే సంజయ్ ను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే సంజయ్ ప్రాణాలు కోల్పోయాడు. 

నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ధర్నా

తాగొచ్చి గొడవకు దిగి సంజయ్ ను కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులను వెంటనే పట్టుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని జన్వాడ గ్రామస్థులు ధర్నాకు దిగారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి గ్రామస్థులను నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. హంతకులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు రాస్తారోకో నిలిపివేశారు. సంజయ్ మృతితో తన కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది. బంక్ లో పని చేస్తున్న కుమారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లడం పట్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. 

అత్యాచారం, దొంగతనం కేసుల్లో ప్రధాన నిందితులు

ఈ హత్యోదంతంపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్, మల్లేష్, అనూప్ గా గుర్తించారు. పారిపోయిన ముగ్గురు వ్యక్తులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ముగ్గురిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని, అత్యాచారం, దొంగతనం కేసుల్లో ప్రధాన నిందితులను పోలీసులు తెలిపారు. గత నెలలో ఓ విలేకరిపైనా దాడి చేసినట్లు అధికారులు గుర్తించారు. ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget