అన్వేషించండి

KCR: ఈనెల 27లోగా సమాధానం చెప్పండి, కేసీఆర్ కు జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ నుంచి మరోసారి నోటీసులు

Telangana News: విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై పవర్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 27లోగా వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్ కు సూచించింది.

Power Commission Notices to KCR: యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ సంస్థల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రంలో భారీ ఎత్తున చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో నెలకొన్న అవకతవకలపై విచారణ చేపడుతున్న జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని పవర్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులో ఇప్పటివరకు కమిషన్‎కు వచ్చిన సమాచారం పై మీ అభిప్రాయం ఏంటో చెప్పాలంటూ కేసీఆర్ ను కమిషన్ కోరింది.  ఈనెల 27వ తేదీలోపు నోటీసుకు వివరణ ఇవ్వాలంటూ జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ కేసీఆర్ కు సూచించింది. ఈనెల 19వ తేదీన కేసీఆర్‎కు, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కి, మరికొంత మందికి జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌  ఇచ్చిన నోటీసులు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. 

హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్
జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌‎కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సందర్భంలో రెండోసారి పవన్  కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా గతంలో ఇచ్చిన నోటీసుల్లో  పవర్ కమిషన్ పేర్కొంది.   జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ నోటీసులపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, కమిషన్ చైర్మన్ గా నరసింహారెడ్డి తప్పుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాశారు.

నరసింహారెడ్డి కమిషన్ విచారణ పై స్టే విధించాలంటూ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.   రాష్ట్రంలో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణంపై వేసిన జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారంటూ  ఆయన వ్యాఖ్యానించారు. పవర్ కమిషన్ విచారణను తక్షణమే నిలిపివేయాలని కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

గత మార్చి 14న పవర్ కమిటీ ఏర్పాటు
పదేళ్ల కేసీఆర్ పదవీ కాలంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై విచారణ చేపట్టేందుకు గత మార్చి 14న కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. కమిషన్‌ ఇప్పటికే ఈ కేసులో విచారణను ప్రారంభించింది.  విద్యుత్ శాఖతో సంబంధం ఉన్న దాదాపు 25 మంది అధికారులను, మాజీ అధికారులను విచారించింది.  కేసీఆర్ కు కూడా ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఆయన కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారు. అందులో కమిషన్ కు చట్టబద్ధత లేదని, జస్టిస్ నరసింహా రెడ్డి స్వచ్ఛందంగా తప్పుకోవాలని లేఖలో కోరారు. దీనిపై ఇవాళ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.  పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టక ముందే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్  మరోసారి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై కేసీఆర్ ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.  

టాప్ హెడ్ లైన్స్

Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Professor Kodandaram: పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget