అన్వేషించండి

KCR: ఈనెల 27లోగా సమాధానం చెప్పండి, కేసీఆర్ కు జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ నుంచి మరోసారి నోటీసులు

Telangana News: విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై పవర్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 27లోగా వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్ కు సూచించింది.

Power Commission Notices to KCR: యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ సంస్థల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రంలో భారీ ఎత్తున చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో నెలకొన్న అవకతవకలపై విచారణ చేపడుతున్న జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని పవర్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులో ఇప్పటివరకు కమిషన్‎కు వచ్చిన సమాచారం పై మీ అభిప్రాయం ఏంటో చెప్పాలంటూ కేసీఆర్ ను కమిషన్ కోరింది.  ఈనెల 27వ తేదీలోపు నోటీసుకు వివరణ ఇవ్వాలంటూ జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ కేసీఆర్ కు సూచించింది. ఈనెల 19వ తేదీన కేసీఆర్‎కు, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కి, మరికొంత మందికి జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌  ఇచ్చిన నోటీసులు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. 

హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్
జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌‎కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సందర్భంలో రెండోసారి పవన్  కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా గతంలో ఇచ్చిన నోటీసుల్లో  పవర్ కమిషన్ పేర్కొంది.   జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ నోటీసులపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, కమిషన్ చైర్మన్ గా నరసింహారెడ్డి తప్పుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాశారు.

నరసింహారెడ్డి కమిషన్ విచారణ పై స్టే విధించాలంటూ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.   రాష్ట్రంలో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణంపై వేసిన జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారంటూ  ఆయన వ్యాఖ్యానించారు. పవర్ కమిషన్ విచారణను తక్షణమే నిలిపివేయాలని కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

గత మార్చి 14న పవర్ కమిటీ ఏర్పాటు
పదేళ్ల కేసీఆర్ పదవీ కాలంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై విచారణ చేపట్టేందుకు గత మార్చి 14న కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. కమిషన్‌ ఇప్పటికే ఈ కేసులో విచారణను ప్రారంభించింది.  విద్యుత్ శాఖతో సంబంధం ఉన్న దాదాపు 25 మంది అధికారులను, మాజీ అధికారులను విచారించింది.  కేసీఆర్ కు కూడా ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఆయన కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారు. అందులో కమిషన్ కు చట్టబద్ధత లేదని, జస్టిస్ నరసింహా రెడ్డి స్వచ్ఛందంగా తప్పుకోవాలని లేఖలో కోరారు. దీనిపై ఇవాళ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.  పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టక ముందే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్  మరోసారి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై కేసీఆర్ ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget