అన్వేషించండి

KCR: ఈనెల 27లోగా సమాధానం చెప్పండి, కేసీఆర్ కు జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ నుంచి మరోసారి నోటీసులు

Telangana News: విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై పవర్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 27లోగా వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్ కు సూచించింది.

Power Commission Notices to KCR: యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ సంస్థల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రంలో భారీ ఎత్తున చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో నెలకొన్న అవకతవకలపై విచారణ చేపడుతున్న జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని పవర్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులో ఇప్పటివరకు కమిషన్‎కు వచ్చిన సమాచారం పై మీ అభిప్రాయం ఏంటో చెప్పాలంటూ కేసీఆర్ ను కమిషన్ కోరింది.  ఈనెల 27వ తేదీలోపు నోటీసుకు వివరణ ఇవ్వాలంటూ జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ కేసీఆర్ కు సూచించింది. ఈనెల 19వ తేదీన కేసీఆర్‎కు, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కి, మరికొంత మందికి జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌  ఇచ్చిన నోటీసులు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. 

హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్
జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌‎కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సందర్భంలో రెండోసారి పవన్  కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా గతంలో ఇచ్చిన నోటీసుల్లో  పవర్ కమిషన్ పేర్కొంది.   జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ నోటీసులపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, కమిషన్ చైర్మన్ గా నరసింహారెడ్డి తప్పుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాశారు.

నరసింహారెడ్డి కమిషన్ విచారణ పై స్టే విధించాలంటూ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.   రాష్ట్రంలో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణంపై వేసిన జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారంటూ  ఆయన వ్యాఖ్యానించారు. పవర్ కమిషన్ విచారణను తక్షణమే నిలిపివేయాలని కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

గత మార్చి 14న పవర్ కమిటీ ఏర్పాటు
పదేళ్ల కేసీఆర్ పదవీ కాలంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై విచారణ చేపట్టేందుకు గత మార్చి 14న కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. కమిషన్‌ ఇప్పటికే ఈ కేసులో విచారణను ప్రారంభించింది.  విద్యుత్ శాఖతో సంబంధం ఉన్న దాదాపు 25 మంది అధికారులను, మాజీ అధికారులను విచారించింది.  కేసీఆర్ కు కూడా ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఆయన కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారు. అందులో కమిషన్ కు చట్టబద్ధత లేదని, జస్టిస్ నరసింహా రెడ్డి స్వచ్ఛందంగా తప్పుకోవాలని లేఖలో కోరారు. దీనిపై ఇవాళ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.  పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టక ముందే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్  మరోసారి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై కేసీఆర్ ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News: ప్రోటోకాల్ పక్కనపెట్టి, సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం..
ప్రోటోకాల్ పక్కనపెట్టి, సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం..
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. తుది తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. తుది తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
Ganja Seized: బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
Hyderabad Biryani:బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 

వీడియోలు

Delhi Capitals Mitchell Starc IPL 2026 | మరికొన్ని మ్యాచ్‌లకు స్టార్క్ దూరం | ABP Desam
Vaibhav Suryavamshi MI vs RR IPL 2026 | బుమ్రా బౌలింగ్ లో వైభవ్ మెరుపులు | ABP Desam
IPL 2026 Shubman Gill Back in Nets | గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంట్రీ | ABP Desam
IPL 2026 RR VS MI Result | రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్ విజయం | ABP Desam
Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Share Market: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
Constable Revathi: కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!
కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Naga Vamsi : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
IPL 2026 RR VS MI Result Update: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
Embed widget