అన్వేషించండి

Ganesh Festival 2024: ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్

Telangana: పక్కా ప్లాన్‌తో పీస్‌పుల్‌గా తెలంగాణ, హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలను పోలీసులు ఘనంగా ముగించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకున్నారు.

Telangana News: తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు చాలా ఉత్సాహంగా సాగాయి. ఎక్కడ ఎలాంటి గడబిడలు లేకుండా ప్రశాంతంగా సాగిపోయింది వేడుక. ముఖ్యంగా హైదరాబాద్‌లో పండగ ప్రశాంతంగా జరిగిపోవడంపై అటు ప్రభుత్వం, ఇటు పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విగ్రహాలు విక్రయాల నుంచి నిమజ్జనం వరకు పక్కా ప్రణాళికలతో ఫెస్టివల్‌ను ఘనంగా చేపట్టారు. 


Ganesh Festival 2024: ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్

విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు నుంచి నిమజ్జనం వరకు అంతా ప్లాన్ ప్రకారం చేపట్టారు. ఎప్పుడు ఏ విగ్రహం ఏ చెరువు వద్దకు తరలించాలి... జనాలకు ఇబ్బంది లేకుండా రూట్ మ్యాప్‌ ఏంటని అన్ని ముందుగానే సిద్ధం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా పెద్దగా లేకుండానే ముందస్తు హెచ్చరికలతో పోలీసులు విజయవంతం అయ్యారు. 

హైదరాబాద్‌, భైంసా, ముథోల్‌, జడ్చర్ల, కరీంనగర్‌, తాండూర్‌, మక్తల్‌, నిర్మల్‌, నారాయణపేట్‌, ఉట్కూర్‌, మహబూబ్‌నగర్‌ ఇలా కీలకమైన ప్రాంతాల్లో మధ్యాహ్నానికే పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ లాంటి మహా గణపతి విగ్రహమే మధ్యాహ్నం రెండు గంటలకు గంగమ్మ ఒడికి చేర్చారంటే పోలీసులు ఎంత పకడ్బంధీగా ప్లాన్ చేశారో అర్థమవుతుంది. 

30 వేల మందితో...

ఇలా పక్కా ప్లాన్ ప్రకారం నిమజ్జనం చేపట్టేందుకు దాదాపు 30 వేల మందికిపైగా పోలీసులు రాత్రిపగలు శ్రమించారు. ఒక్క హైదరాబాద్‌లోనే పాతిక వేల మంది పని చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు మూడు లక్షల వరకు విగ్రహాలు నిమజ్జనం చేశారు. జిల్లాల్లో విగ్రహాలు దీనికి అదనం. ఇలా ఎన్ని విగ్రహాలు వచ్చినప్పటికీ ఎక్కడా ఎలాంటి దుర్ఘటనలు లేకుండా హడావుడి లేకుండా ప్రశాంతంగా పని కానిచ్చేశారు. వీళ్లకు మిగతా విభాగాలా సిబ్బంది సహకరించారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ట్యాంక్‌బండ్‌లో విగ్రహాల నిమజ్జనం ప్రాంతాలను పరిశీలించారు. ఇలా ఓ సీఎం నిమజ్జనం రోజు ట్యాంక్‌బండ్‌కు రావడం ఇదే తొలిసారి. వచ్చిన ఆయన అక్కడ సిబ్బందితో మాట్లాడారు. ప్రజలతో ముచ్చటించారు. ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనంలో రాత్రి పగలు శ్రమిస్తున్న సిబ్బంది ఎలాంటి లోటులేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. వాళ్లకు టైంకు ఫుడ్, ఇతర సౌకర్యాలు అందివ్వాలన్నారు. 


Ganesh Festival 2024: ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు- ఈసారి లడ్డూలకు భారీ డిమాండ్

లడ్డూలకు భారీ డిమాండ్

ఈసారి కూడా గణేషుడి లడ్డూల కోసం భక్తులు పోటీ పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో సాగిన వేలంలో భారీ ధర పెట్టి లడ్డూలను సొంతం చేసుకున్నారు. ఫేమస్ అయిన బాలాపూర్ గణపతి లడ్డూను కొలన్‌ శంకర్‌రెడ్డి అనే వ్యక్తి 30 లక్షల ఒక వెయ్యిరూపాయలకు పాడుకున్నారు. అయితే దీని కంటే ఎక్కువ రేట్‌కు అమ్ముడైన గణపతి లడ్డూ కూడా ఉంది. బండ్లగూడ జాగీర్‌లో కీర్తీ రిచ్‌మౌండ్‌ విల్లాస్‌లో జరిపిన వేలంలో గణేషుడి లడ్డూ కోటీ 87 లక్షలకు భక్తులు సొంత చేసుకున్నారు. ఇప్పటి వరకు గణేషుడి లడ్డూ ధరల్లో ఇదే ఆల్‌టైం రికార్డ్‌గా చెబుతున్నారు. ఈ రెండే కాకుండా ఈ సారి చాలా ప్రాంతాల్లో లడ్డూలు వేలం వేశారు. 

  వేలం జరిగిన ప్రాంతం    లడ్డూ ధర 
1 బండ్లగూడ జాగీర్‌లో కీర్తీ రిచ్‌మౌండ్‌ విల్లాస్‌   రూ. 1కోటీ 87లక్షలు
2 బాలాపూర్‌         రూ. 30.01 లక్షలు 
3 మాధాపూర్‌లోని మైహోమ్‌ భూజా    రూ. 29 లక్షలు 
4 కర్మన్‌ ఘాట్‌        రూ. 16 లక్షలు 
5 బడంగ్‌పేట        రూ. 11.90 లక్షలు 
  అత్తాపూర్‌        రూ. 11.16 లక్షలు
  ఉప్పరిపల్లి        రూ. 10 లక్షలు
  న్యూనాగోల్ కాలనీ       రూ. 6.81 లక్షలు 
  రామాంతపూర్        రూ. 6.80 లక్షలు 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget