అన్వేషించండి

Modi Hyderabad Visit Live:రామానుజాచార్యుల విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని మోదీ  

ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన వివరాలకు సంబంధించి లైవ్ అప్ డైట్స్ ఇక్కడ చూడొచ్చు.

LIVE

Key Events
Modi Hyderabad Visit Live:రామానుజాచార్యుల విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని మోదీ  

Background

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. నగరంలో ఇక్రిశాట్‌ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాల్లో ఆ తర్వాత ముచ్చింతల్‌లో రామానుజాచార్య విగ్రహావిష్కరణలో ప్రధాని పాల్గొంటారు. అయితే, ప్రధాని హైదరాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన వెంటనే ఉండనున్నారు. తొలుత శంషాబాద్‌ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ రాగా.. అక్కడ సీఎం కేసీఆర్ ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఆయనతోపాటే హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు, అక్కడి నుంచి ముచ్చింతల్‌కు వస్తారు. ప్రధాని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యే వరకూ సీఎం మోదీతోనే ఉండనున్నారు. అయితే, ప్రొటోకాల్‌ ప్రకారం ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ సీఎం కార్యాలయం శుక్రవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వుల విడుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉంటారని అంతా భావించారు. ప్రస్తుతం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తీవ్ర విమర్శల వల్ల మోదీని కలవరనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, కేసీఆర్ ప్రధాని పర్యటనలో పాల్గొంటారని ఆ తర్వాత సీఎంవో వర్గాలు వెల్లడించాయి.

ప్రధాని పర్యటనలో గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రులు తోమర్‌, జి.కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు. ప్రధాని మోదీ పర్యటన కోసం 8 వేల మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపడుతున్నారు. అత్యాధునిక కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్స్ పై నిషేధం విధించారు పోలీసులు. రామచంద్రపురం ఇక్రిశాట్, ముచ్చింతల్ చిన జీయర్ ఆశ్రమం వద్ద డ్రోన్స్ పై నిషేధం ఉంది. నేడు ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ వరకు డ్రోన్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, పారా గ్లైడింగ్, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్ పైనా నిషేధం ఉంది.

ప్రధాని పర్యటనకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ముచ్చింతల్ లో ఆశ్రమాన్ని శుక్రవారం సందర్శించారు. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.  

పర్యటన షెడ్యూల్ ఇదీ..
మధ్యాహ్నం గం. 2.10లకు శంషాబాద్ ఎయిర్ పోర్టు
ప్రత్యేక హెలికాప్టర్‌లో 2.45లకు ఇక్రిశాట్
2.45 నుండి 4.15 వరకు ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ ప్రారంభకార్యక్రమం
5 గంటలకు ముచ్చింతల్
అక్కడి గెస్ట్ హౌస్‌లో 10 నిమిషాలు రీప్రెష్ అయి ప్రత్యేక వస్త్రధారణలో యాగశాలకు..
5 గంటల నుంచి 8 గంటల వరకు సమతా మూర్తి విగ్రహవిష్కరణ కార్యక్రమం
సాయంత్రం 7 గంటలకు సమతామూర్తి విగ్రహం జాతికి అంకితం 
8.20 కి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం 

18:45 PM (IST)  •  05 Feb 2022

రామానుజాచార్యుల విగ్రహాన్ని జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని మోదీ  

హైదరాబాద్ ముచ్చింతల్‌ సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి రోజున జాతికి అంకితం ఇచ్చారు. పంచలోహాలతో రూపొందించిన ఈ విగ్రహం కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహం. సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 ఆలయాలు నిర్మించారు. సమతామూర్తి కేంద్రాన్ని ఎల్ఈడీ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో నిర్వహించిన యాగంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. యాగశాలలో ప్రధానికి చినజీయర్‌ స్వామి స్వర్ణకంకణం అలంకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై పాల్గొన్నారు.

18:28 PM (IST)  •  05 Feb 2022

108 వైష్ణవ ఆలయాలు సందర్శిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

108 వైష్ణవ ఆలయాలను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శిస్తున్నారు. అనంతరం సమతాస్ఫూర్తి కేంద్రం రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. నేతలు బండి సంజయ్, సుధాకర్ రెడ్డి సమతా స్ఫూర్తి కేంద్రంలో మోదీకి స్వాగతం పలికారు.

18:14 PM (IST)  •  05 Feb 2022

యాగశాల నుంచి సమతా స్ఫూర్తి కేంద్రానికి బయలుదేరిన ప్రధాని

యాగశాల నుంచి ముచ్చింతల్ సమతా స్ఫూర్తి కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ బయలుదేరారు. తొలుత 108 వైష్ణవ ఆలయాలను ప్రధాని సందర్శించనున్నారు.

18:11 PM (IST)  •  05 Feb 2022

విష్వక్సేనేష్ఠి యాగం పూర్ణాహుతి చేసిన ప్రధాని మోదీ

యాగశాలలో ప్రధాని నరేంద్ర మోదీకి  చినజీయర్ స్వామి స్వర్ణ కంకణం కట్టారు. అనంతరం ప్రధాని, గవర్నర్ విష్వక్సేనేష్ఠి యాగంలో పాల్గొన్నారు. విష్వక్సేనేష్ఠి యాగం పూర్ణాహుతి చేశారు.

18:04 PM (IST)  •  05 Feb 2022

శ్రీలక్ష్మీనారాయణ మహాయాగంలో పాల్గొన్న ప్రధాని మోదీ

యాగశాలకు చేరుకున్న ప్రధాని మోదీ శ్రీలక్ష్మీనారాయణ మహాయాగంలో పాల్గొన్నారు. మరో యాగంలోనూ ప్రధాని మోదీ పాల్గొన్నారు.

17:25 PM (IST)  •  05 Feb 2022

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ చేరుకున్నారు. శ్రీలక్ష్మీనారాయణ మహాయాగం పూర్ణాహుతిలో ప్రధాని పాల్గొంటారు. అక్కడే సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

17:09 PM (IST)  •  05 Feb 2022

ముచ్చింతల్‌లో రూ.12 వేల కోట్లతో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్మాణం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో రూ.12 వేల కోట్లతో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్మించారు. భద్రవేదికపై ఏర్పాటు చేసిన 216 అడుగుల రామానుజుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

17:06 PM (IST)  •  05 Feb 2022

ఇక్రిశాట్ నుంచి ముచ్చింతల్ బయలుదేరిన ప్రధాని మోదీ

ఇక్రిశాట్ నుంచి  ప్రధాని మోదీ బయలుదేరారు. పటాన్‌చెరు ఇక్రిశాట్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ముచ్చింతల్ చేరుకోనున్నారు.

14:41 PM (IST)  •  05 Feb 2022

హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వల్ప అస్వస్థత కారణంగా సీఎం కేసీఆర్‌ ప్రధాని స్వాగత కార్యక్రమానికి హాజరు కాలేదు. అక్కడి నుంచి వెంటనే ప్రధాని ఇక్రిశాట్‌కు పయనం అయ్యారు.

09:28 AM (IST)  •  05 Feb 2022

ప్రధాని పర్యటకు పటిష్ఠంగా తనిఖీలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల శ్రీరామ్ నగర్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ పర్యటించే రోడ్డు మార్గంలో ఎస్సీజీ అధికారులు రిహార్సల్స్ చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు చేస్తున్నాయి.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Embed widget