అన్వేషించండి

Hyderabad: చేతిలో పైసా లేకున్నా హైదారాబాద్ ఆర్టీసీలో ప్రయాణించవచ్చు- త్వరలోనే అందుబాటులోకి సరికొత్త సేవలు

Telangana RTC: హైదరాబాద్‌ సిటీ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్లకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మీ చేతిలో డబ్బుల్లేకపోయినా టికెట్ ఇవ్వబోతోంది. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.

TGSRTC: సికింద్రాబాద్ వెళ్లాల్సిన శ్రీనివాస్‌ హయత్‌నగర్‌లో బస్ ఎక్కాడు. కండాక్టర్‌ టికెట్‌ కొట్టి ఇచ్చాడు. 40 రూపాయలు ఇవ్వమని చెప్పాడు. శ్రీనివాస్‌ మెల్లిగా ఐదు వందల రూపాయల నోట్ తీసి కండాక్టర్ చేతిలో పెట్టాడు. అసలే ఫస్ట్ ట్రిప్‌ కావడంతో చిల్లర లేదని చెప్పి టికెట్‌పై 460 అని రాసి ఇచ్చాడు. ఫోన్ చూస్తూ తను దిగాల్సిన స్టాప్‌లో దిగిపోయాడు. 460 రూపాయలు మర్చిపోయాడు. 40 రూపాయలు చిల్లర లేనందుకు శ్రీనివాస్‌కు 460 చెల్లించుకోవాల్సి వచ్చింది. 

ఇది ఒక్క శ్రీనివాస్‌ అనుభవమే కాదు. మీరు హైదరాబాద్‌లో ఉండి ఉంటే కచ్చితంగా ఇలాంటి అనుభవాన్ని ఫేస్ చేసి ఉంటారు. ఆ కండాక్టర్ మంచి వాడు కాబట్టి చీటీపీ రాసి ఇచ్చాడు. వేరే వాళ్లు అయితే ఏకంగా వాగ్వాదమే పెట్టుకుంటారు. చిల్లర ఎక్కడి నుంచి తీసుకురావాలని చిర్రుబుర్రులాడుతారు. 

ఇప్పుడు అలాంటి వాటికి అవకాశం లేకుండా చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. హైదరాబాద్‌ సిటీ బస్‌లలో డిజిటల్ పేమెంట్స్ తీసుకురానుంది. ప్రయోగాత్మకంగా నిర్వహించిన ప్రక్రియ విజయవంతం కావడంతో ఇప్పుడు మరికొన్ని రూట్‌లలో ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. 

ఆర్టీసీ బస్‌లలో ప్రయాణించే వాళ్లకు చిల్లర బాధ అంతా ఇంతా కాదు. డిజిటల్ చెల్లింపులు వచ్చాక బయట చిల్లర దొరకడమే కష్టంగా మారిపోయింది. ఏటీఎంకు వెళ్లినా అక్కడ కూడ వంద, 200, 500 నోట్‌లే వస్తున్నాయి. దీంతో బస్‌ ఎక్కే వాళ్ల వద్ద చిల్లర కనిపించడం చాలా అరుదు. దీంతో నిత్యం ఆర్టీసీ సిబ్బందితో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. 

ఇలాంటి పరిస్థితిని గమనించిన తెలంగాణ ఆర్టీసీ డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను బండ్లగూడ డిపోలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టింది. ఇది  విజయవంతం కావడంతో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను మిగతా ప్రాంతాలకు విస్తరించాలని చూస్తోంది. బండ్లగూడలోని 70 బసుల్లో ఫోన్‌పై, గూగుల్‌పే, పేటీఎం, డెబిట్ కార్డు, క్రెడిట్‌కార్డు ఉంటే టికెట్ తీసుకోవచ్చు. సుమారు నెల రోజుల నుంచి విజయవంతంగా నడుస్తుందీ ప్రక్రియ. 

బండ్లగూడ డిపో బసుల్లో డిజిటల్ చెల్లింపుతో టికెట్ తీసుకోవడంలో ఉన్న లోపాలు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రయాణికుల ఇబ్బందులు, టికెట్ ఇవ్వడానికి చెల్లింపులకు ఎంత టైం పడుతుంది ఇలా అన్నింటినీ పరిశీలించింది ఆర్టీసి. పెద్దగా సాంకేతిక సమస్యలు తలెత్తలేదని గ్రహించి మిగతా ప్రాంతాలకు విస్తరించాలని ఆలోచనలో ఉందీ ఆర్టీసీ. 

గ్రేటర్ పరిధిలో ఉన్న దాదాపు 2900 బస్సుల్లో ఈ డిజిటల్ చెల్లింపు ప్రక్రియను త్వరలోనే ప్రవేశ పెట్టనున్నారు. దీని వల్ల 15 లక్షల మందికిపైగా ప్రయాణికులకు మేలు జరుగుతుందని సిబ్బందిపై చిల్లర ఒత్తిడి తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget