అన్వేషించండి

Phone Tapping Case: మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు.. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం

Former MP Santosh Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. జనవరి 27న విచారణకు హాజరుకావాలని నోటీసులలో సిట్ పేర్కొంది.

Phone Tapping Case: హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. మంగళవారం (జనవరి 27న) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. గత BRS ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌ జరిగిందని ఆరోపణలున్నాయి. గత రెండేళ్లుగా కేసు విచారణ కొనసాగుతోంది. తాజాగా మాజీ ఎంపీ సంతోష్ రావును ప్రశ్నించేందుకు సిట్ సిద్ధంగా ఉంది.

ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లకు సిట్ నోటీసులు ఇవ్వడం, వారు అధికారుల ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. హరీష్ రావును సుమారు 7 గంటలకు పైగా విచారించిన అధికారులు, ఆ తర్వాత కేటీఆర్ విచారణకు హాజరుకాగా స్టేట్‌మెంట్ తీసుకున్నారు. మాజీ ఇంటెలిజెన్స్ అధికారుల వాంగ్మూలం, సాక్ష్యాధారాల ఆధారంగా ఈ కేసులో జోగినల్లి సంతోష్ రావు పాత్రపై సిట్ దృష్టి సారించింది. ఈ క్రమంలో మాజీ ఎంపీకి 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసింది.

ముదురుతున్న రాజకీయ సెగ.. సిట్ విచారణలో బీఆర్ఎస్ అగ్రనేతలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ప్రస్తుతం క్లైమాక్స్ దశకు చేరుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక విచారణ బృందం (SIT) ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించడమే కాకుండా, బీఆర్ఎస్ అగ్రనేతలను విచారిస్తోంది. గులాబీ పార్టీ నేతలకు వరుస నోటీసులు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. 

నేతలపై ప్రధాన ఆరోపణలు
 రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తుల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ నేతలపై ఉంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారాన్ని సేకరించి, వ్యాపారవేత్తలను బెదిరించి పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు సేకరించారనే ఫిర్యాదులు సిట్‌కు అందాయి. సిరిసిల్ల కేంద్రంగా ఒక ప్రత్యేక 'వార్ రూమ్' ఏర్పాటు చేసి నిఘా నిర్వహించారని, దీని కోసం ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక సాఫ్ట్‌వేర్ కొనుగోలుకు పార్టీ నిధులను మళ్లించారని సెట్ అనుమానాలు వ్యక్తం చేసింది. 

ఆధారాలు ధ్వంసం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వ మార్పు సమయంలో కీలకమైన డేటా, హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారనే ఆరోపణలపై మాజీ ఎస్‌ఐబీ (SIB) అధికారులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. పలువురు పోలీసు అధికారులు బెయిల్ రావడంతో విడుదలయ్యారు. 

సిట్ దర్యాప్తు తాజా పరిణామాలు
మాజీ మంత్రి హరీష్ రావును ఇటీవల సిట్ అధికారులు సుమారు 7 గంటల పాటు విచారించారు. ఆయనను ఈ కేసులో ఒకవైపు నిందితుడిగా, మరోవైపు బాధితుడిగా (ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు ఆధారాలు) అధికారులు భావిస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం ఈ కేసులో సిట్ అధికారులు కేటీఆర్, హరీష్ రావులను సాక్ష్యులుగా మాత్రమే విచారించారని, అయితే ఎందుకు భయపడుతున్నారని ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ విచారణ
హరీష్ రావు తరువాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన కేటీఆర్ ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. పార్టీ ఆర్థిక లావాదేవీలు, ఎలక్టోరల్ బాండ్లు, ఇజ్రాయెల్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు అంశాలపై ఆయన నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారని సమాచారం. తాజాగా మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు సెక్షన్ 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. జనవరి 27న తాను విచారణకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం అన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Gaddar Awards 2025 : ది బెస్ట్ డాక్యుమెంటరీ 'యూనిటి' - కొండా లక్ష్మణ్ బాపూజీ కథకు ఫిదా
ది బెస్ట్ డాక్యుమెంటరీ 'యూనిటి' - తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ కథకు ఫిదా
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Gaddar Awards 2025 : గద్దర్ అవార్డ్స్... బెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి - బెస్ట్ యాక్టర్‌గా చై, హీరోయిన్ రష్మిక
గద్దర్ అవార్డ్స్... బెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి - బెస్ట్ యాక్టర్‌గా చై, హీరోయిన్ రష్మిక
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
Embed widget