అన్వేషించండి

Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ నారసింహ యాత్ర, కొండగట్టు నుంచి స్టార్ట్

పవన్ కల్యాణ్‌ యాత్ర పేరుతో సరికొత్త చర్చకు తెరలేపారు. అయితే అది ఆధ్యాత్మిక యాత్ర లేకా రాజకీయ యాత్ర అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోకస్ చేశారు. రెండు రాష్ట్రాల్లో యాత్ర చేయాలని నిర్ణయించారు. జనసేన సోషల్ మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్య్యూలో చాలా విషయాలు వెల్లడించారు. 

తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షిస్తూ త్వరలో భారీ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. అనుష్టు నారసింహ యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న  నరసింహ ఆలయాల మీదుగా జనసేన అధినేత యాత్ర సాగనుంది. 

కొండగట్టు నుంచి పవన్ యాత్ర ప్రారంభిస్తారు. ఎప్పుడు ప్రారంభిస్తారని మాత్రం స్పష్టం చేయలేదు. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. 30 ఆలయాలను సందర్శిస్తూ సాగే ఈ యాత్ర ఎలా ఉంటుందన్నది కూడా తెలియాల్సి ఉంది. పవన్ కల్యాణ్ యాత్ర పాదయాత్ర చేస్తారా లేక బస్సు యాత్ర చేస్తారా అనేది త్వరలోనే క్లారిటీ రానుంది. ఏం చేసినా దశలవారీగా ఉంటుందని పవన్ స్పష్టత ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల లీడర్లతో మాట్లాడతానంటూ చెప్పారు కూడా. 

ఈ యాత్ర ఆధ్యాత్మికంగా సాగుతుందా లేకుంటే రాజకీయాలు ఇందులో కలుస్తాయా అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఈ యాత్ర ఎజెండా, కార్యచరణ, షెడ్యూల్ వంటి విషయాల పై త్వరలోనే పవన్ క్లారిటీ ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
 
చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ తనపై వైసీపీ నేతలు పదే పదే చేస్తున్న విమర్శలపై పవన్ కల్యాణ ఘాటుగా బదులిచ్చారు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన విమర్శలకు సమాధానం ఇస్తూ ప్రజలకే తాను దత్తపుత్రుడినని.. ఎప్పుడైనా తాను ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మాట్లాడతానన్నారు. 

ప్రభుత్వం సృష్టించిన ఉద్యోగల సమస్యలపై తాము మాట్లాడితే తప్పేంటని పవన్ ప్రశ్నించారు. ఈ సమస్య విపక్షాలు తీసుకురాలేదని.. ఇచ్చిన హామీ నెరవేర్చలేక ప్రభుత్వం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని వ్యాఖ్యానించారు. వచ్చిన సమస్యను పరిష్కరించాల్సిన మంత్రులు, ప్రభుత్వ పెద్దలు ఉద్యోగులను రెచ్చగొట్టి ఇంత వరకు తీసుకొచ్చారని విమర్శించారు. 

తప్పును ఎత్తి చూపిన ప్రతి ఒక్కరూ శత్రువుగానే ప్రభుత్వానికి శత్రువుగా కనిపిస్తున్నారని.. డూడూ బసవన్నలే ప్రభుత్వానికి కావాలని పవన్ ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేయాలని చెప్పడమే తప్ప ప్రభుత్వం విఫలం కావాలని తాను ఎప్పుడూ కోరుకోనుంటూ సజ్జలకు చురకలు వేశారు. తనపై విమర్శలు, తన కామెంట్స్‌పై సెటైర్లు ఆపి.. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి చూసుకోండని సజ్జలకు సూచన చేశారు పవన్ కల్యాణ. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget