అన్వేషించండి

Paddy Procurement: తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు - ఉగాది తర్వాత ఉడుకు చూపిస్తాం: రాష్ట్ర మంత్రులు

Paddy Procurement In Telangana: వడ్లు కొనమంటే తెలంగాణ ప్రజలను అవమానించారని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నూకల బియ్యం ప్రజలకు తినిపించమని హేళన చేశారని మంత్రులు మండిపడ్డారు.

Paddy Procurement In Telangana: మా వద్ద వడ్లు కొనే సామర్థ్యం లేదు. కేంద్రాన్ని కొనమంటే తెలంగాణ ప్రజలను అవమానించారని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నూకల బియ్యం ప్రజలకు తినిపించమని హేళన చేశారని, కనుక తెలంగాణ ప్రజలకు కేంద్రం, బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేంద్రం ధాన్యం కొంటే మేము పూర్తిగా సహకరిస్తామని, మీరు కొంటానంటే మేము ముందే రైతులకు డబ్బులు చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు.. ఉగాది తర్వాత తెలంగాణ ఉడుకు చూపిస్తామని రాష్ట్ర మంత్రులు అన్నారు. తెలంగాణ ప్రజలకు కేంద్రం క్షమాపణ చెప్పాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

వారంతా అనుభవించారు.. ఇక కేంద్రం వంతు..
మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన కౌరవులు, రామాయణంలో సీతను చెరబట్టిన రావణాసురుడు ఫలితాన్ని అనుభవించారు. ఈ దేశ రాజకీయాలలో తిరుగులేదనుకున్న ఇందిరాగాంధీ అనామకుల చేతిలో భంగపడ్డారు. తెలంగాణను అవమానించిన, అవహేళన చేసిన ఎందరో రాజకీయ భవిష్యత్ లేకుండా పోయారు. చరిత్రపుటల్లో లేకుండాపోయారు. ఎన్నో పోరాటాలు, మరెన్నో బలిదానాలు, అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షల మేరకు.. ఎన్నో అడ్డంకులు, కుట్రలు చేధించి కేసీఅర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఏడేళ్లుగా ఇష్టపడి అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు.

కేంద్రం నుంచి సహకారం లేదు..
తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సహకారం లేదని మంత్రులు మండిపడ్డారు. మేం కష్టపడి కాళేశ్వరం కట్టుకున్నాం. పాలమూరు రంగారెడ్డి 70 శాతం పనులు పూర్తయ్యాయి. దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేశాం. మిషన్ కాకతీయతో చెరువులు బాగుచేసుకున్నాం. కృష్ణా గోదావరి నీళ్లతో వాటిని నింపుకుంటున్నాం.
ఆరు దశాబ్దాల అన్యాయాల తాలూకు చేదు జ్ఞాపకాలు దిగమింగుకుంటూ ప్రగతి వైరు శరవేగంగా అడుగులు వేస్తూ నవ తెలంగాణ నిర్మించుకుంటున్నాం. వ్యవసాయం ప్రధానరంగంగా గుర్తించి కేసీఆర్ గారు ఈ రంగం మీద దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ సాగునీళ్లిచ్చి, రైతుబంధు, రైతుభీమా ఇచ్చి, 24 గంటల ఉచిత కరంటు ఇచ్చి చేదోడా వాదోడుగా నిలుస్తున్నారు. అత్యధిక శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయ రంగం బలోపేతమయితే గ్రామాలు సుస్థిరమవుతాయన్నది కేసీఆర్ ఆలోచన. 

పంటలు కొనే బాధ్యత కేంద్రానిదే..
‘ఈ దేశంలో పండిన పంటలు కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. వేలుకేస్తే కాలుకు, కాలుకేస్తే వేలుకేస్తున్నారు. రా రైస్ , బాయిల్డ్ రైస్ పేరుతో కేంద్రం లేకి రాజకీయాలు చేస్తుంది. బీజేపీ నేత రైతులను మీరు వడ్లు వేయండి. కేంద్రంతో కొనిపించే బాధ్యత నాది అంటడు. కేసీఆర్ కు ఏ సంబంధం అంటాడు. కేంద్ర మంత్రి మేం తెలంగాణ వడ్లు కొనం అంటాడు. తెలంగాణ ప్రాంతంలో యాసంగిలో బాయిల్డ్ రైసే వస్తయి. రా రైస్ రావు .. క్వింటాలుకు 67 శాతం బియ్యం రావు. కందులు, గోధుమలకు లేని నిబంధన వడ్లకు ఎందుకు ? సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేయకుండా మెదడుకు తాళం వేసుకుంటే మీరెందుకు ?. కిషన్ రెడ్డి ఎన్నాళ్లు పదవిలో ఉంటావు ? రైతుల పక్షాన ఇక్కడ ఉన్న సమస్యపై ఎందుకు మాట్లాడవు ? ఏనాడైనా ఈ ప్రాంత ప్రతినిధిగా కేంద్ర మంత్రి వద్దకు వచ్చి మాట్లాడావా ?. అన్ని తెలిసిన కిషన్ రెడ్డి ప్రతి గింజ కొంటం. అంటడు రా రైసే కావాలి అంటారని’ తెలంగాణ మంత్రులు తెలిపారు.




టాప్ హెడ్ లైన్స్

Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
Ashada Bonalu: పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget