అన్వేషించండి

Reliance Swadesh Store: హైదరాబాద్‌లో ‘స్వదేశ్’ స్టోర్ ప్రారంభించిన నీతా అంబానీ, దేశంలో తొలిస్టోర్ ఇక్కడే

Nita Ambani Telugu News: స్వదేశ్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాంచరణ్ - ఉపాసన దంపతులు, నమ్రతా శిరోద్కర్, మంచు లక్ష్మి, క్రీడాకారిణులు పీవీ సింధు, సానియా మీర్జా తదితరులు పాల్గొన్నారు.

Reliance Retail's Swadesh Store at Alcazar Mall in Hyderabad: రిలయన్స్ సంస్థ ‘స్వదేశ్’ పేరుతో (Swadesh store) కొత్త స్టోర్‌ను తెరిచింది. దేశంలోనే ఈ స్వదేశ్ తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న అల్కాజార్ మాల్‌లో (Alcazar Mall) స్వదేశ్ స్టోర్‌ను రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) బుధవారం (నవంబర్ 8) ప్రారంభించారు. ఈ స్వదేశీ స్టోర్ అతి పెద్ద ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ స్వదేశ్‌ స్టోర్‌ గా సంస్థ (Reliance News) చెబుతోంది. స్వదేశ్ స్టోర్ (Swadesh store) ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాంచరణ్ - ఉపాసన దంపతులు, నమ్రతా శిరోద్కర్, మంచు లక్ష్మి, క్రీడాకారిణులు పీవీ సింధు, సానియా మీర్జా తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన అనంతరం నీతా అంబానీ (Nita Ambani) మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. మొట్టమొదటి రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్‌ను కూడా హైదరాబాద్‌లోనే ప్రారంభించామని చెప్పారు. స్వదేశ్ అనేది భారతీయ సంప్రదాయ కళలు, కళాకారులను ప్రతిబింబిస్తుందని అన్నారు. దేశానికి గొప్ప వారసత్వం, చరిత్ర ఉందని అన్నారు. ‘‘మేం 4000 కంటే ఎక్కువ వివిధ రకాల కళలు, చేతిపనులు ఇంకా 70 లక్షల కంటే ఎక్కువ మంది కళాకారులకు వేదికగా ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడా వైవిధ్యం లేదు. కాబట్టి, స్వదేశ్ భారతదేశంలోని ఈ కళాకారులందరిని ప్రతిబింబిస్తుంది. వారు నిజంగా మన దేశం గర్వించదగినవారు’’ అని అన్నారు.

హైదరాబాద్ గురించి మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు కూడా ఇక్కడ రెండు టైటిల్స్ గెలిచిందని అన్నారు. హస్త కళలను ఆదరించడం, కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగానే స్వదేశ్‌ స్టోర్‌ను ఏర్పాటు చేశామని నీతా అంబానీ తెలిపారు.

ఒలింపిక్స్ పైనా కీలక వ్యాఖ్యలు

‘‘40 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఒలింపిక్స్ సెషన్‌ను నిర్వహించే అవకాశం మనకు లభించింది. ఈ చారిత్రాత్మక సెషన్‌లో క్రికెట్‌ను ఒలింపిక్ క్రీడగా ప్రకటించారు. అదీకాక భారతదేశంలో ప్రపంచ కప్ జరుగుతున్నప్పుడు దానిని ప్రకటించడం శుభపరిణామం. 2030లో యూత్ ఒలింపిక్స్, 2036లో సమ్మర్ ఒలింపిక్స్ కోసం భారతదేశం వేలం వేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యంగా మన దేశంలోని యువ తరం కోసం ఇది ఎంతో ఉపకరిస్తుంది. దీని కోసం నేను ఎదురుచూస్తున్నాను.’’ అని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mudragada Padmanabha Reddy: మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం
మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం
Udit Narayan Kiss Controversy : 'ముద్దు' వివాదంపై స్పందించిన ఉదిత్ నారాయణ్.. 'నేను అస్సలు సిగ్గుపడను, అది కేవలం నా ఫ్యాన్స్ మీద నాకున్న లవ్ మాత్రమే'
'ముద్దు' వివాదంపై స్పందించిన ఉదిత్ నారాయణ్.. 'నేను అస్సలు సిగ్గుపడను, అది కేవలం నా ఫ్యాన్స్ మీద నాకున్న లవ్ మాత్రమే'
Big Alert: వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Union Budget 2025 Top 5 Points | బడ్జెట్ చూడలేదా పర్లేదు..ఈ వీడియో చూడు చాలు | ABP DesamUnion Budget 2025 Income Tax Nirmala Sitharaman 12Lakhs No Tax | ఉద్యోగులకు పెద్ద తాయిలం ప్రకటించిన కేంద్రం | ABPNagoba Jathara Youngsters Musical Instruments | డోలు, సన్నాయిలతో కుర్రాళ్ల సంగీత సేవ | ABP DesamPM Modi Hints on Income Tax Rebate | ఆదాయపు పన్ను మినహాయింపు గురించి మోదీ నిన్ననే చెప్పారు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mudragada Padmanabha Reddy: మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం
మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం
Udit Narayan Kiss Controversy : 'ముద్దు' వివాదంపై స్పందించిన ఉదిత్ నారాయణ్.. 'నేను అస్సలు సిగ్గుపడను, అది కేవలం నా ఫ్యాన్స్ మీద నాకున్న లవ్ మాత్రమే'
'ముద్దు' వివాదంపై స్పందించిన ఉదిత్ నారాయణ్.. 'నేను అస్సలు సిగ్గుపడను, అది కేవలం నా ఫ్యాన్స్ మీద నాకున్న లవ్ మాత్రమే'
Big Alert: వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
Crime News: యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడు - బంధించిన యువతి కుటుంబసభ్యులు, చివరకు!
యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడు - బంధించిన యువతి కుటుంబసభ్యులు, చివరకు!
Budget 2025 : విదేశాల్లో పిల్లల్ని చదివించే వారికి బిగ్ రిలీఫ్ - టీసీఎస్ లిమిట్ రూ.10 లక్షలకు పెంపు
విదేశాల్లో పిల్లల్ని చదివించే వారికి బిగ్ రిలీఫ్ - టీసీఎస్ లిమిట్ రూ.10 లక్షలకు పెంపు
Viral News: బ్రెజిల్‌లో ఆకాశంలో వింత ఘటన, ఒక్కసారిగా స్పెడర్ వర్షం కురిసింది- రీజన్ ఇదే
బ్రెజిల్‌లో ఆకాశంలో వింత ఘటన, ఒక్కసారిగా స్పెడర్ వర్షం కురిసింది- రీజన్ ఇదే
Crime News: వీళ్లసలు పేరెంట్స్‌యేనా - నాలుగేళ్ల కుమార్తెకు తల్లి వాతలు, కొడుకుని కొట్టి దెబ్బలపై కారం పెట్టిన తండ్రి, ఏపీలో దారుణాలు
వీళ్లసలు పేరెంట్స్‌యేనా - నాలుగేళ్ల కుమార్తెకు తల్లి వాతలు, కొడుకుని కొట్టి దెబ్బలపై కారం పెట్టిన తండ్రి, ఏపీలో దారుణాలు
Embed widget