అన్వేషించండి

Crime news: 12 ఏళ్ల పగ.. తండ్రిని చంపిన వాడిని ఇప్పుడు చంపేశాడు!

Crime news: పగ మనిషిని దహించి వేస్తుంది. అది చల్లారే వరకు నిద్రపోనివ్వదు. ఎన్ని ఏళ్లు గడిచినా మనసులోని పగ అలాగే ఉంటుంది. హైదరాబాద్ జవహర్ నగర్ హత్య కేసులో పగ కోణం వెలుగులోకి వచ్చింది.

Crime news: అది 2009వ సంవత్సరం. దమ్మాయిగూడ ఉప సర్పంచిగా ఉన్నాడు జంగారెడ్డి. అయితే కొన్ని కలహాల వల్ల జంగారెడ్డిని రఘుపతి చంపించాడు. దీంతో జంగారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి రఘుపతిపై పగ పెంచుకున్నాడు. ఆనాటి నుండి తండ్రిని చంపిన రఘుపతిని అంతకంటే కిరాతకంగా చంపాలను అనుకుంటున్నాడు. అదునైన సమయం కోసం వేచి చూస్తున్నాడు. అలా 12 ఏళ్ల గడిచాయి. కానీ శ్రీకాంత్ రెడ్డి పగ మాత్రం చల్లారలేదు. అది అతడిని దహించివేస్తోంది. ఎలాగైనా రఘుపతిని చంపాలనుకున్నాడు. అతడిపై అనుమానం రావొద్దని సుపారీ వ్యక్తులను మాట్లాడాడు. 

కట్ చేస్తే.. దమ్మాయిగూడలోని ఓ వైన్స్ వద్ద ఈ నెల 15న రఘుపతి, అతని స్నేహితులు ప్రసాద్, బాబు, రామానుజన్ మద్యం సేవిస్తున్నారు. అప్పటికే మూడు రోజుల ముందు నుండి రెక్కీ చేస్తున్న సుపారీ హంతకులు.. అదే సరైన సమయం అనుకుని ఫిక్స్ అయ్యారు. కత్తులు, వేటకొడవళ్లతో రఘుపతి మీదకు దూకారు. అతడిపై కత్తులు, కొడవళ్లతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో రఘుపతికి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా రక్తమోడుతున్న రఘుపతిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో రఘుపతి స్నేహితుడు ప్రసాద్ కు కూడా గాయాలు కాగా.. అతను ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. 

5 రోజుల తర్వాత దొరికారు?

పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. హత్య జరిగిన సంఘటన స్థలం వద్ద వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. సీసీటీవీ ఫుటేజీ ఉన్నా... అది వారికి పెద్దగా ఉపయోగపడలేదు. పలు బృందాలను ఏర్పాటు చేసి హంతకుల కోసం గాలింపు చేపట్టారు. హత్య జరిగి ఐదు రోజులు గడిచిన తర్వాత పోలీసులు నిందితులను మీడియా ముందుకు తీసుకువచ్చారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్... హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈనెల 15న జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో హత్య జరిగిందని తెలిపారు. రియల్టర్ రఘుపతి అలియాస్ రఘు, అతని స్నేహితడు ప్రసాద్ పై నిందితులు కత్తులతో దాడి చేశారని తెలిపారు పోలీసులు. 

నిందితులను ఎలా పట్టుకున్నారు?

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట సాంకేతిక ఆధారాలను అన్వేషించారు. అలాగే హత్య జరిగిన సంఘటన స్థలంలో ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని వెతికారు. కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఉన్నప్పటికీ దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తేల్చారు. మల్కాజ్ గిరి ఎస్వోటీ, జవహర్ నగర్ క్రైమ్ టీమ్ లు రంగంలోకి దిగాయి. హతుడిపై ఏమైన కేసులు ఉన్నాయా అని వెతికారు. ప్రత్యర్థులపై దృష్టి పెట్టారు. 2009లో అప్పటి దమ్మాయిగూడ ఉప సర్పంచి జంగారెడ్డి హత్య కేసులో  రఘుపతి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జంగారెడ్డి కొడుకు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.

ఎలా హత్య చేశారు?

రఘుపతిని చంపాలనుకున్న శ్రీకాంత్ రెడ్డి... సుపారీ గ్యాంగ్ తో కాంటాక్ట్ అయ్యాడు. రూ.30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. తన తండ్రికి మిత్రుడైన కర్ణాటక వాసి మంజునాథకు సుపారీ ఇచ్చాడు శ్రీకాంత్ రెడ్డి. రఘుపతిని చంపేందుకు ఒప్పుకున్న మంజునాథ... తనతో పాటు మహమ్మద్ సాధిక్, ఇస్మాయిల్, సమీర్ ఖాన్, భవిత్ లను తీసుకువచ్చాడు. రఘుపతిని ఎలా చంపాలని మూడు రోజులు రెక్కీ నిర్వహించారు. వైన్స్ వద్ద తాగుతుండగా.. అదే సరైన సమయం అనుకుని హత్య చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
HYDRAA Ranganath High Court Orders: హైడ్రా కమిషనర్‌కు బిగ్ షాక్ - రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం !
హైడ్రా కమిషనర్‌కు బిగ్ షాక్ - రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం !
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget