అన్వేషించండి

Manda Krishna Madiga: మాలలతో రేవంత్ రెడ్డి కుమ్మక్కు, మాదిగలకు కాంగ్రెస్ తీరని అన్యాయం: మందకృష్ణ ఫైర్

Telangana News: మాలలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని, అందుకే ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించలేదని మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మరోసారి మాదిగలకు తీరని అన్యాయం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాలలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి విలువల్లేని, విధానాలు లేని రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి రాజకీయాలు ఎల్లకాలం చెల్లవని, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గుణపాఠం తప్పదని అన్నారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.
మరోసారి మాదిగలకు తీరని అన్యాయం
‘కడియం శ్రీహరి కూతురు కావ్యకి కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ కేటాయించింది. మూడు ఎస్సీ పార్లమెంట్ స్థానాలు ఉంటే.. మూడు స్ధానాలను మాదిగలకు కేటాయించ లేదు. కాంగ్రెస్ పార్టీ మరోసారి మాదిగలకు తీరని అన్యాయమే చేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాదిగలను జనాభా లెక్కల నుంచి తీసేసింది. కాంగ్రెస్ పార్టీలో మాలలకు తప్ప మాదిగలకు సముచిత స్థానం లేదు. స్థానికుడు కాకపోయినా నాగర్ కర్నూల్ టికెట్‌ను కాంగ్రెస్ అధిష్టానం మాజీ ఎంపీ మల్లు రవికి కేటాయించింది. వరంగల్ ఎస్సీ పార్లమెంట్ స్థానాన్ని మాదిగలకు ఇస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావించారు. సొంత పార్టీ నాయకులు వరంగల్ పార్లమెంట్ సీటు ఆశించి భంగం పడ్డారు. ఊరికి ఒక్కరు లేని బైండ్ల సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ కేటాయించారు. తెలంగాణలో నూటికి 70 శాతం ఉన్న మాదిగలకు గుర్తించడం లేదు’ - మందకృష్ణ మాదిగ

కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతాం అన్నారు. మేము ఏంటో సీఎం రేవంత్ రెడ్డికి చూపిస్తాం. మాదిగలే తన గెలుపునకు దోహద పడ్డారన్న రేవంత్ రెడ్డి ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు టికెట్ ఇవ్వ లేదు? అని ప్రశ్నించారు. రెడ్డి సామాజికవర్గానికి తప్ప.. ఎవరికీ న్యాయం చేయలేదని విమర్శించారు. చేవెళ్ల సిటింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు టికెట్ ఇచ్చారు. కానీ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ చేరితే మాత్రం అతడికి టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున మెజార్టీ అభ్యర్థులు రెడ్డిలకే కేటాయించారు.12 స్థానాల్లో మెజార్టీ స్థానాలు రెడ్డిలే ఉన్నారు. మాదిగలతో పాటు బీసీలకి కూడా రేవంత్ రెడ్డి అన్యాయం చేశారని మందకృష్ణ మాదిగ విమర్శించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget