అన్వేషించండి

Mahabubabad District Crime News: ఇద్దరు కుమారులను చంపి బతుకమ్మ ఆడిన తల్లి- మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన 

Mahabubabad District Crime News: కన్నతల్లి తన ఇద్దరి కుమారులను చంపిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తాగి వచ్చిన భర్తపై కోపంతో ఈ దారుణానికి పాల్పడింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మహబూబాబాద్ జిల్లాలో ఐదేళ్ల బాలుడి హత్య కేసులో తల్లిని పోలీసులు అరెస్టు చేశారు.
  • కుటుంబ కలహాలు, భర్త తాగుడుతో విసిగిపోయి తల్లి ఈ ఘాతుకానికి పాల్పడింది.
  • గతంలో చిన్న కుమారుడిని కూడా నీటి సంపులో పడేసి చంపినట్లు విచారణలో తేలింది.
  • తండ్రి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య కేసు వెలుగులోకి వచ్చింది.

Mahabubabad District Crime News: మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 5 సంవత్సరాల బాలుడి హత్య కేసును పోలీసులు  ఛేదించారు. కన్న తల్లే ఈ దారుణానికి పాల్పడిందని తేల్చారు. అంతకంటే ముందు చిన్న కుమారుడిని కూడా ఆమె కడతేర్చినట్టు గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ సీఐ సర్వయ్య హత్య కేసు వివరాలను వెల్లడించారు.

ఈ నెల 24వ తేదీన కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో 5 ఏళ్ల బాలుడు పందుల మనీష్ కుమార్ మెడకు నైలాన్ తాడుతో బిగించి అతి కిరాతకంగా హత్య చేసిన  కసాయి తల్లి శిరీషను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నారాయణపురం గ్రామానికి చెందిన పందుల ఉపేందర్.... వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన శిరీష 7 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 

కొంత కాలం సజావుగా సాగిన వీరి సంసారంలో మద్యం నిప్పులు పోసింది. భర్త తాగుడుకు బానిసయ్యాడు. దీనికి తోడు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ భార్య శిరీష , పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. దీంతో శిరీష ఆత్మహత్య చేసుకోవాలని మొదటి భావించింది. తాను చనిపోతే  ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందింది. అందుకే వారిని కూడా చంపేసి తాను ఆత్మహత్య చేసుకుంటే ఇబ్బంది ఉండదని డిసైడ్ అయ్యింది. 

ప్లాన్‌లో భాగంగా మొదట 15 జనవరి 2025న చిన్న కుమారుడు రెండేళ్ల నిహాల్‌ను నీటి సంపులో పడేసి కడ కడతేర్చింది. ప్రమాదవశాత్తు జరిగి బాలుడు మృతి చెందినట్టు చిత్రీకరించింది. అందర్నీ అలానే నమ్మబలికించింది. అది అందరూ నమ్మేశారని రెండో కుమారుడి హత్యకు స్కెచ్ వేసింది. 31 జులై 2025న పెద్ద కుమారుడు మనీష్ కుమార్ మెడపై కత్తితో హత్య చేసేందుకు యత్నించింది. కానీ బాలుడు అరవడంతో   నానమ్మ లేచింది. దీంతో శిరీష ప్లాన్ వర్కౌట్ కాలేదు. గాయాలతో ఉన్న బాలుడిని ఆసుపత్రిలో చేర్చారు.  

ఆసుపత్రిలో కోలుకొని ఇంటికి వచ్చిన పెద్ద కుమారుడిపై ఈనెల 24వ తేదీన హత్యకు స్కెచ్ వేసింది. ఆరోజు  సాయంత్రం మనీష్ కుమార్ పడుకొని ఉండగా నైలాన్ తాడుతో మెడకు గట్టిగా చుట్టి హతమార్చింది. తర్వాత ప్రశాంతంగా ఊరిలో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొంది. బతుకమ్మ ఆడింది. నానమ్మ ఇంటికి వచ్చి చూడగా మనవడు అచేతనంగా పడి ఉన్నాడు. స్థానికుల సాయంతో ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు హుటాహుటిన తీసుకొని వెళ్ళింది. ఆర్.ఎం.పి పరీక్షించి చూడగా అప్పటికే మృతి చెందాడని తెలిపాడు. 

కుమారుడు చనిపోయిన సంగతి తెలుసుకున్న తండ్రి వచ్చాడు. కుమారుడు మృతదేహాన్ని గమనించిన మెడపై ఉరి ఆనవాళ్లు కనపడటంతో అనుమానపడ్డాడు.  విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. పోలీసులు వారి శైలిలోవిచారణ చేపట్టగా శిరీష ఇద్దరు కుమారులను హత మార్చిన విషయాలను  బయటపెట్టింది. వెంటనే ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు రిమాండ్‌ విధించారు. 

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget