అన్వేషించండి

Mahabubabad District Crime News: ఇద్దరు కుమారులను చంపి బతుకమ్మ ఆడిన తల్లి- మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన 

Mahabubabad District Crime News: కన్నతల్లి తన ఇద్దరి కుమారులను చంపిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తాగి వచ్చిన భర్తపై కోపంతో ఈ దారుణానికి పాల్పడింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Mahabubabad District Crime News: మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 5 సంవత్సరాల బాలుడి హత్య కేసును పోలీసులు  ఛేదించారు. కన్న తల్లే ఈ దారుణానికి పాల్పడిందని తేల్చారు. అంతకంటే ముందు చిన్న కుమారుడిని కూడా ఆమె కడతేర్చినట్టు గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ సీఐ సర్వయ్య హత్య కేసు వివరాలను వెల్లడించారు.

ఈ నెల 24వ తేదీన కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో 5 ఏళ్ల బాలుడు పందుల మనీష్ కుమార్ మెడకు నైలాన్ తాడుతో బిగించి అతి కిరాతకంగా హత్య చేసిన  కసాయి తల్లి శిరీషను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నారాయణపురం గ్రామానికి చెందిన పందుల ఉపేందర్.... వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన శిరీష 7 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 

కొంత కాలం సజావుగా సాగిన వీరి సంసారంలో మద్యం నిప్పులు పోసింది. భర్త తాగుడుకు బానిసయ్యాడు. దీనికి తోడు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ భార్య శిరీష , పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. దీంతో శిరీష ఆత్మహత్య చేసుకోవాలని మొదటి భావించింది. తాను చనిపోతే  ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందింది. అందుకే వారిని కూడా చంపేసి తాను ఆత్మహత్య చేసుకుంటే ఇబ్బంది ఉండదని డిసైడ్ అయ్యింది. 

ప్లాన్‌లో భాగంగా మొదట 15 జనవరి 2025న చిన్న కుమారుడు రెండేళ్ల నిహాల్‌ను నీటి సంపులో పడేసి కడ కడతేర్చింది. ప్రమాదవశాత్తు జరిగి బాలుడు మృతి చెందినట్టు చిత్రీకరించింది. అందర్నీ అలానే నమ్మబలికించింది. అది అందరూ నమ్మేశారని రెండో కుమారుడి హత్యకు స్కెచ్ వేసింది. 31 జులై 2025న పెద్ద కుమారుడు మనీష్ కుమార్ మెడపై కత్తితో హత్య చేసేందుకు యత్నించింది. కానీ బాలుడు అరవడంతో   నానమ్మ లేచింది. దీంతో శిరీష ప్లాన్ వర్కౌట్ కాలేదు. గాయాలతో ఉన్న బాలుడిని ఆసుపత్రిలో చేర్చారు.  

ఆసుపత్రిలో కోలుకొని ఇంటికి వచ్చిన పెద్ద కుమారుడిపై ఈనెల 24వ తేదీన హత్యకు స్కెచ్ వేసింది. ఆరోజు  సాయంత్రం మనీష్ కుమార్ పడుకొని ఉండగా నైలాన్ తాడుతో మెడకు గట్టిగా చుట్టి హతమార్చింది. తర్వాత ప్రశాంతంగా ఊరిలో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొంది. బతుకమ్మ ఆడింది. నానమ్మ ఇంటికి వచ్చి చూడగా మనవడు అచేతనంగా పడి ఉన్నాడు. స్థానికుల సాయంతో ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు హుటాహుటిన తీసుకొని వెళ్ళింది. ఆర్.ఎం.పి పరీక్షించి చూడగా అప్పటికే మృతి చెందాడని తెలిపాడు. 

కుమారుడు చనిపోయిన సంగతి తెలుసుకున్న తండ్రి వచ్చాడు. కుమారుడు మృతదేహాన్ని గమనించిన మెడపై ఉరి ఆనవాళ్లు కనపడటంతో అనుమానపడ్డాడు.  విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. పోలీసులు వారి శైలిలోవిచారణ చేపట్టగా శిరీష ఇద్దరు కుమారులను హత మార్చిన విషయాలను  బయటపెట్టింది. వెంటనే ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు రిమాండ్‌ విధించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget