అన్వేషించండి

Malla Reddy: ఐటీ విచారణ: మంత్రి మల్లారెడ్డికి బదులుగా ఆడిటర్‌ హాజరు, కీలక పత్రాలతో ఐటీ ఆఫీస్‌కు

నేటి విచారణకు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరవుతున్నారు. అయితే, తన స్థానంలో తన ఆడిటర్ విచారణకు వస్తారని మల్లారెడ్డి అధికారులను కోరారు.

Minister Malla Reddy IT Raids Issue: తెలంగాణ మంత్రి మల్లా రెడ్డిపై ఐటీ దాడుల వ్యవహారంలో నేడు విచారణ జరగనుంది. ఆమేరకు మల్లా రెడ్డి ఆడిటర్ శివకుమార్ కీలక పత్రాలు, ఆధారాలతో ఐటీ ఆఫీసుకు వచ్చారు. ఆ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని మల్లా రెడ్డి గతంలోనే స్పష్టం చేశారు. నేటి విచారణకు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరవుతున్నారు. అయితే, తన స్థానంలో తన ఆడిటర్ విచారణకు వస్తారని మల్లా రెడ్డి అధికారులను కోరారు. తాను మంత్రిగా ఉప్పల్‌లో జరిగే కొన్ని ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని తెలిపారు. అందుకే ఐటీ విచారణకు వెళ్లలేకపోతున్నాని అన్నారు. 

మల్లా రెడ్డికి (Minister Malla Reddy) అల్లుడు అయిన మర్రి శశిధర్ రెడ్డికి కూడా ఐటీ నోటీసులు అందగా తాను మాత్రం విచారణకు వస్తానని చెప్పారు. తనకు అందిన నోటీసుల్లో హాజరు కావాలని మాత్రమే ఉందని, ఎటువంటి పత్రాలు, ఇతర వివరాలు తీసుకొని రావాలని సూచించలేదని అన్నారు. 

ఐటీ శాఖ అధికారులు 16 మందికి నోటీసులు ఇవ్వగా 12 మంది విచారణకు వచ్చారు. మంత్రి మల్లా రెడ్డి కుమారుడు భద్రా రెడ్డి ఐటీ కార్యాలయానికి వెళ్లారు. మంత్రికి కూడా నోటీసులు ఇవ్వగా ఆయన తరపున తన చార్టెడ్ అకౌంటెంట్ శివకుమార్ ని పంపారు. ఇక మల్లా రెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా హాజరు అయినట్లు తెలుస్తోంది.

ఇక మర్రి లక్షారెడ్డి, నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ నర్సింహారెడ్డి, ఆయన కుమారుడు త్రిశూల్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. మల్లా రెడ్డి విద్యాసంస్థలకు చెందిన శివకుమార్ రెడ్డి అధికారులు ఇచ్చిన నోటీసు తీసుకుని ఐటీ కార్యాలయానికి వెళ్లారు. మల్లా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రామస్వామి రెడ్డి సైతం విచారణకు వచ్చారు. ఇప్పటి వరకు ఐటీశాఖ ఎదుట 12 మంది హాజరు కాగా సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాలపై ప్రశ్నిస్తున్నారు.

ఆరు రోజుల క్రితం మంత్రి మల్లా రెడ్డి ఇల్లు, కార్యాలయాలు సహా బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. మంత్రి మల్లా రెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడికు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో సోదాలు చేశారు. ఏకంగా 60 టీమ్‌లు రెండు రోజుల పాటు రాత్రీ పగలు షిఫ్టుల వారీగా సోదాలు చేశాయి. ఈ సోదాల్లో పత్రాలతోపాటు భారీగా నగదును కూడా సీజ్ చేశారు. ఇంట్లో భారీగా నగదుతో పాటు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నవంబర్ 28న విచారణకు హాజరుకావాలని మంత్రి మల్లా రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఉద్యోగులు సహా 16 మందికి నోటీసులు ఇచ్చారు. దీంతో విచారణకు పూర్తిగా సహకరిస్తానని మల్లా రెడ్డి అప్పుడే ప్రకటించారు. ఈ విచారణకు ఈ రోజు మల్లా రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌కు సంబంధించిన కొంతమంది ఉద్యోగులు కూడా హాజరుకానున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget