అన్వేషించండి

Minister KTR Comments: మరో రెండు వారాల్లో కొత్త కుట్రలు, రెడీగా ఉండండి - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

BRS News: తెలంగాణ భవన్ లో ఆదివారం మునుగోడు కాంగ్రెస్ కీలక నేత పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ లో చేరారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

డబ్బు మదంతో వంద కోట్లు ఖర్చు పెట్టి మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ గెలవాలని చూస్తున్నాడని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కచ్చితంగా ఈ సారి రాజగోపాల్ రెడ్డి ని ఓడించాలని పిలుపు ఇచ్చారు. మన జీవితాల్లో వెలుగులు నింపిన కేసిఆర్ కావాలా? లేదా కారు చీకట్లు తెచ్చే కాంగ్రెస్ కావాలా? అని అడిగారు. మరోసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి.. ఈ పదిహేను రోజుల్లో కొత్త కుట్రలు రాబోతున్నాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఆదివారం (నవంబరు 12) మునుగోడు కాంగ్రెస్ కీలక నేత పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ లో చేరారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

అసలు మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో - కేటీఆర్
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఏ కారణం చేత రాజగోపాల్ రెడ్డి పార్టీలు మారాడు అనేది అర్థం కాలేదు. అసలు ఆ ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో తెలియదు. మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి చేరాడు. గత ఏడాది ఎన్నికలకు అయోమయం గందరగోళం. మాకు పాల్వాయి కుటుంబంతో అనుబంధం ఉంది. తెలంగాణ బాగుండాలని కోరుకున్న వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ లోనే ఉంటాను అని చెప్పారు గోవర్దన్ రెడ్డి. కానీ అలాంటి కుటుంబంలో ఉన్న ఆయన కూతురికి కూడా టికెట్ ఇవ్వకపోవడం దారుణం. గత ఏడాది జరిగిన ఎన్నికలలో పాల్వాయి స్రవంతి లేకపోతే ఆ ఓట్లు కూడా కాంగ్రెస్ కు వచ్చేవి కావు. రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకరికొకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు. ఇప్పుడు బుజంపై చేతులేసుకొని తిరుగుతున్నారు. మునుగోడులో మాతో కలిసి వచ్చే అందరికీ స్థానిక సంస్థల్లో సముచిత స్థానం కల్పిస్తాం. 

కొద్ది రోజుల్లో కొత్త కుట్రలు
డబ్బు మదంతో వంద కోట్లతో మళ్ళీ ఖర్చు పెట్టి గెలుస్తానని రాజగోపాల్ చూస్తున్నాడు. కచ్చితంగా ఈ సారి రాజగోపాల్ రెడ్డి ని ఓడించాలి. మన జీవితాల్లో వెలుగులు నింపిన కేసిఆర్ కావాలా? లేదా కారు చీకట్లు తెచ్చే కాంగ్రెస్ కావాలా? మరోసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఈ పదిహేను రోజుల్లో కొత్త కుట్రలు రాబోతున్నాయి. కాళేశ్వరం కూలింది అని, రెండు రోజుల్లో నివేదికలు రెడీ చేసి పంపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీ, మోదీ కొత్త కొత్త రిపోర్టులు తయారు చేసి ఢిల్లీ నుంచి పంపిస్తారు. దేశంలో కేసీఆర్ చక్రం తిప్పకుండా కొత్త కుట్రలు చేస్తారు. 

ఈ పదిహేను రోజులు ఇవే కుట్రలు చేస్తూ మనల్ని మన ఆలోచన మార్చేలా చేస్తారు. ధనం ఉందని, జనాన్ని కొంటానని రాజగోపాల్ రెడ్డి చూస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి డబ్బు మదాన్ని ఈ ఎన్నికల్లో అణచి వేయాలి. గువ్వల బాల్ రాజ్ పై నిన్న దాడి చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచిది కాదు. ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము లేక భౌతిక దాడులు చేస్తున్నారు. నేను ఆసుపత్రికి వెళ్తున్నా ఆయన్ని పరామర్శిస్తా’’ అని మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget