అన్వేషించండి

KTR: కేంద్ర సాయం తెలుగు రాష్ట్రాలకు అత్యవసరం.. ఈసారి కూడా లేదంటే ఇక పోరాటమే..: కేటీఆర్

హైదరాబాద్‌లోని గ్రీన్ ల్యాండ్స్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో సోమవారం జరిగిన డ్రిల్‌మెక్ స్పా సంస్థ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర హక్కులు, డిమాండ్ల కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిందేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ బడ్జెట్‌లో కనుక అన్యాయం జరిగితే కేంద్రంపై పోరాటం చేస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు. గత ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు రాష్ట్రానికి అందలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఈసారి బడ్జెట్‌లో అయినా రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తెలంగాణతో పాటు ఏపీకి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని గ్రీన్ ల్యాండ్స్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో సోమవారం జరిగిన డ్రిల్‌మెక్ స్పా సంస్థ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. మంత్రి సమక్షంలో ప్రభుత్వం, ఆ సంస్థ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు.

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ సారి బడ్జెట్‌లోనైనా విభజన హామీలు అమలు చేయాలని, తెలంగాణలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తెలంగాణ కాకతీయ, మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, ఫార్మా సిటీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సాయం ఇప్పటికి రాలేదని గుర్తు చేశారు. ప్రధానమంత్రి మోదీ ఊరికే సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటున్నారని.. రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. భారతదేశంలో నాలుగు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కేంద్రం సహకరిస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహకారం అవసరం ఉందని అన్నారు. తెలంగాణ, ఏపీకి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని కోరారు. 

మరోవైపు మేఘా ఇంజినీరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ అయిన డ్రిల్‌మెక్‌ స్పా తెలంగాణలో రూ.1,500కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. చమురు రిగ్గర్స్, అనుబంధ పరికరాలు తయారీ పరిశ్రమ ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డ్రిల్‌మెక్‌ స్పా సంస్థ వెల్లడించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్న

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget