అన్వేషించండి

Metro Train: హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలు తగ్గింపు - పెంచిన దాంట్లో పదిశాతం -కొత్త రేట్ల వివరాలు

Hyderabad: మెట్రో చార్జీలను శుక్రవారం నుంచి కొద్ది మొత్తంలో తగ్గించనున్నారు. కానీ పెంచిన దాంట్లో అతి స్వల్ప మొత్తాన్నే తగ్గిస్తున్నారు.

Metro fares reduce:   హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలను తగ్గించాలని నిర్ణియంచారు.  ఇటీవల పెంచిన టికెట్ ధరలను 10% తగ్గిస్తూ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తగ్గింపు  శుక్రవారంం నుంచి అమలులోకి వస్తుంది.  ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, మెట్రో సేవలను మరింత మంది వినియోగించేలా చేయడానికి  ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. 


 
శుక్రవారం నుంచి   హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇలా ఉంటాయి. 

- 0-2 కి.మీ : రూ.12 నుంచి రూ.11
- 2-4 కి.మీ  : రూ.18 నుంచి రూ.17
- 4-6 కి.మీ : రూ.30 నుంచి రూ.28
- 6-9 కి.మీ : రూ.40 నుంచి రూ.37
- 9-12 కి.మీ : రూ.50 నుంచి రూ.47
- 12-15 కి.మీ : రూ.55 నుంచి రూ.51
- గరిష్ఠ ధర: రూ.75 నుంచి రూ.69

ఈ సవరించిన ధరలు మూడు మెట్రో కారిడార్లలోని అన్ని జోన్‌లకు వర్తించేలా ఉత్తర్వులు ఇచ్చారు.  2025 మే 17 నుంచి మెట్రో ఛార్జీలను పెంచారు. కనీస ధర రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.75కి పెంచారు.  ఈ ధరల పెంపుపై ప్రయాణికులు, విపక్షాలు, ప్రజాసంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. సీపీఐ ), హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం వంటి సంస్థలు ధరల రద్దు కోసం ఆందోళనలు, ధర్నాలు నిర్వహించాయి.  

కరోనా మహమ్మారి సమయంలో ప్రయాణికుల సంఖ్య తగ్గిందని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఉచిత బస్సు పథకం వల్ల మెట్రో ఆదాయంపై ప్రభావం పడిందని అలాగే  పెరిగిన నిర్వహణ ఖర్చుల కారణంగా ఛార్జీలు పెంచతున్నట్లుగా హైదరాబాద్ మెట్రో ప్రకటించింది.  ప్రయాణికుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్, వారి ఆర్థిక సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ 10% డిస్కౌంట్ ప్రకటించింది.                                                           

సీపీఎం వంటి పార్టీలు  తగ్గింపు సరిపోదని, పెంచిన ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఛార్జీల పెంపు వల్ల ఒక్కో ప్రయాణికుడిపై నెలకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు అదనపు భారం పడుతుందని విమర్శించారు. దీంతో పది శాతం తగ్గించాలని నిర్ణయించారు. .               

టాప్ హెడ్ లైన్స్

Railway Board Rejects Free MMTS: ఉచిత ఎంఎంటీఎస్‌కు రైల్వేబోర్డు నో - తెలంగాణ ప్రభుత్వానికి షాక్
ఉచిత ఎంఎంటీఎస్‌కు రైల్వేబోర్డు నో - తెలంగాణ ప్రభుత్వానికి షాక్
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Embed widget