అన్వేషించండి

Margadarsi Case: రామోజీరావును విచారించిన సీఐడీ, 40కి పైగా ప్రశ్నలు - 6న శైలజా కిరణ్‌ను ప్రశ్నించనున్న అధికారులు

Margadarshi Case: మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ ఛైర్మన్ రామోజీరావును ఏపీ సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. మొత్తం 46 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.

Margadarshi Case: మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఆ సంస్థ ఛైర్మన్ రామోజీరావును ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ డబ్బులు చీటీ పాడుకున్నాక ఆ మెత్తం వినియోగదారుడికి ఇవ్వకుండా తమ సంస్థల్లోనే డిపాజిట్ చేయించారనే అభియోగాలపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద రామోజీరావుతో పాటు ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కు ఏపీ సీఐడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. విచారణకు అనుకూలంగా ఉన్న నాలుగు తేదీలు చెప్పాలని వాటిలో పేర్కొనగా.. ఏప్రిల్ 3వ తేదీన తాను అందుబాటులో ఉంటానని రామోజీరావు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్, లీగల్ అడ్వైజర్ తో పాటు ఇతర అధికారుల బృందం హైదరాబాద్ కు చేరుకుంది. ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, మహిళా అధికారులు సహా సుమారు 20 మంది బృందం ఆరు కార్లలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని రామోజీరావు నివాసానికి సోమవారం ఉదయమే చేరుకొని సాయంత్రం వరకు ప్రశ్నించింది. 

మొత్తం 46 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం..

అలాగే నలుగురు కెమెరా మెన్ లతో మొత్తం విచారణను రికార్డు చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావును వైద్యుల పర్యవేక్షణలో అధికారులు విచారించారు. ఉదయం 11.30 గంటలకు విచారణను ప్రారంభించారు. గంటసేపు విచారణ చేపట్టగానే.. రామోజీరావు అలసిపోయినట్లు కనిపించగా గంటసేపు విరామం ఇచ్చారు. వైద్యులు పరీక్షించిన తర్వాత మళ్లీ మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ ఆరభించారు. సాయంత్రం 5.30 గంటలకు విచారణను పూర్తి చేశారు. 7.30 వరకు అక్కడే ఉన్నారు.

అయితే మొత్తం 46 ప్రశ్నలు అడగగా... రామోజీరావు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిట్ ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలోకి మళ్లించడంపై వివరిస్తారా అని రామోజీరావును ప్రశ్నించగా.. మార్గదర్శిపై ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. లక్షల మంది చందాదారులు, డిపాజిటర్ల నమ్మకం చూరగొన్న సంస్థలో ఎలాంటి తప్పులకు తాము ఆస్కారం ఇవ్వబోమని రామోజీరావు స్పష్టం చేసినట్లు తెలిసింది. గతంలో తమ సంస్థపై ఆరోపణలు వచ్చినప్పుడు సైతం డిపాజిటర్లు ఎక్కడా రూపాయి నష్టపోలేదని, ఇప్పుడూ వారి సొమ్ము కన్నా ఎక్కువ ఆస్తి తమ వద్ద ఉందని బదులు ఇచ్చినట్లు సమాచారం. 

ఆరో తేదీన శైలజా కిరణ్ ను విచారించనున్న సీఐడీ..

చందాదారుల అనుమతితో సంతకం తీసుకున్న తర్వాతే ఫిక్స్డ్ డిపాజిట్లు చేశామని, ఎక్కడా ఏదీ దాచుకోలేదని వివరించినట్లు తెలిసింది. సోమవారం రామోజీరావును మాత్రమే విచారించామని, సంస్థ ఎండీ శైలజా కిరణ్ ను గురువారం అంటే ఏప్రిల్ ఆరో తేదీన విచారిస్తామని సీఐడీ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మార్గదర్శి సంస్థకు చెందిన నలుగురు మేనేజర్ల, ఒక ఆడిటర్ ను ఏపీ సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

మార్చి నెల 28వ తేదీ రోజు మార్గదర్శిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల కేసులో రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుకు, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజాకిరణ్‌కు ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో పేర్కొంది ఏపీ సీఐడీ. మార్చి 29, 31 లేదా ఏప్రిల్‌ 3, 6 తేదీల్లో ఎప్పుడైనా సీఐడీ విచారణకు రావాలని  తెలిపారు. విచారణ వాళ్ల నివాసంలో కానీ, ఆఫీస్‌లో కానీ విచారించణకు హాజరుకావాలని ఆదేశించారు. 

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News: పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget