అన్వేషించండి

Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌

Manchu Manoj and Mohan Babu: మంచు మోహన్ బాబు ఫ్యామిలి వివాదం ఇంకా సద్దుమణగలేదా? మంచు మనోజ్ ఎందుకు మరోసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు? ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్ అవుతుంది.

Manchu Mohan Babu Family Dispute: మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వారం క్రితం మొదలైన వివాదం టీవీ సీరియల్‌ను తలపిస్తోంది. రోజుకో మలుపు తిరుగుతోంది. మూడు రోజుల క్రితం అంతా కూల్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఇవాళ మళ్లీ వివాదం మొదటికి వచ్చినట్టు సమాచారం అందుతోంది. ఇంకోసారి పహడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించడం మరోసారి సంచలనంగా మారుతోంది. 

జనరేటర్ విషయంలో వివాదం

మంచు మనోజ్‌ మరోసారి పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు వెళ్లారనే విషయంపై ఇంకా క్లారిటీ రాకపపోయినా ఇంట్లో మరోసారి వివాదం చెలరేగిందనే టాక్ వినిపిస్తోంది. అందుకే మనోజ్ మరోసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్టు చెబుతున్నారు. జనరేటర్ విషయంలో మళ్లీ వివాదం నెలకొందని అంటున్నారు. 

మీడియా ప్రతినిధిని పరామర్శించిన మోహన్ బాబు

మరోవైపు గత మంగళవారం నాడు జల్‌పల్లిలో జరిగిన ఘర్షణలో ఓ టీవీ ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆయన్ని మంచు మోహన్ బాబు ఇవాళ పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసినట్టు సమాచారం. 

యశోధ ఆసుపత్రికి వెళ్లి మంచు మోహన్ బాబు తాను ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిధిని కొట్టలేదని చెప్పుకొచ్చారు. అయినా తప్పు జరిగినందుకు జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఆయనతోపాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా సారీ చెప్పారు. 

Also Read: సైక్లింగ్ ద్వారా ప్రపంచాన్ని అన్వేషిస్తున్న యువకుడు- తండ్రి కలను నెరవేరుస్తున్న వరంగల్ వాసి

పోలీసుల విచారణకు హాజరుకాని మోహన్ బాబు

మరోవైపు హత్య కేసు విచారణలో భాగంగా మంచు మోహన్ బాబును విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. రివాల్వర్ అప్పగించాలంటూ మోహన్ బాబుకు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణ టైంలో అప్పగిస్తామని మోహన్ బాబు సమాధానం ఇచ్చారు. కానీ ఇంత వరకు విచారణకు వెళ్లలేదని. మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదంపై ఇప్పటికే మనోజ్, విష్ణు స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. ఇంకా మోహన్ బాబు స్టేట్మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. 

అజ్ఞాతంలో ఉన్నారని ప్రచారం 

మోహన్ బాబు ఇంత వరకు పోలీసులను కలుసుకోలేదు. స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. రివాల్వర్‌ కూడా సరెండర్ చేయలేదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదని పోలీసులు అంటున్నారు. ఇంత వరకు మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ ఈ మధ్యాహ్నం ఆయన తాను చేసిన దాడిలో గాయపడిన టీవీ ప్రతినిధిని పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు మాత్రం విడుదలయ్యాయి. 

దీంతో మోహన్ బాబు ఎక్కడ ఉన్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. హత్యకేసు నమోదు అవ్వడం, ఆయన విచారమకు సహకరించకపోవడంతో అరెస్టు ఖాయమంటున్నారు పోలీసులు. హైకోర్టులో కూడా ఆయనకు ముందస్తు బెయిల్ దొరకలేదు. అందుకే ఆయన బెయిల్ దొరికే వరకు పోలీసుల విచారణకు రాకపోవచ్చని అంటున్నారు. 

ఆస్తులు, ఇగో వివాదంతో గత ఆదివారం మంచు మనోజ్, మోహన్ బాబు ఇద్దరు వేర్వేరుగా ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లోఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో ఎప్పటి నుంచో ఉన్న వివాదం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు రాజీ కుదిరిందని అంతా అనుకున్నారు కానీ మళ్లీ వివాదం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. 

Also Read: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
Andhra Pradesh Group 2 Exam: అయోమయంలో గ్రూప్‌ 2- ప్రభుత్వ సూచన లెక్కచేయని ఏపీపీఎస్సీ- అభ్యర్థుల్లో అయోమయం!
అయోమయంలో గ్రూప్‌ 2- ప్రభుత్వ సూచన లెక్కచేయని ఏపీపీఎస్సీ- అభ్యర్థుల్లో అయోమయం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
Andhra Pradesh Group 2 Exam: అయోమయంలో గ్రూప్‌ 2- ప్రభుత్వ సూచన లెక్కచేయని ఏపీపీఎస్సీ- అభ్యర్థుల్లో అయోమయం!
అయోమయంలో గ్రూప్‌ 2- ప్రభుత్వ సూచన లెక్కచేయని ఏపీపీఎస్సీ- అభ్యర్థుల్లో అయోమయం!
BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh CM Phone Number:చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా ? ఇదిగో ఫోన్ నెంబర్
చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా ? ఇదిగో ఫోన్ నెంబర్
Son Murder Father: వీడు కొడుకు కాదు యముడు - ఎంత శత్రువునైనా అంత ఘోరంగా చంపరు కదా.. తండ్రిని చంపుతారా ?
వీడు కొడుకు కాదు యముడు - ఎంత శత్రువునైనా అంత ఘోరంగా చంపరు కదా.. తండ్రిని చంపుతారా ?
Revanth Reddy on SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
Embed widget